E-Paper
Advertisement

Vande Bharat Trains: షాకింగ్.. ఆ రూట్‌లో వందే భారత్ రైళ్ల సేవల్ ఇక బంద్, రైల్వే కీలక నిర్ణయం!

Vande Bharat Trains: షాకింగ్.. ఆ రూట్‌లో వందే భారత్ రైళ్ల సేవల్ ఇక బంద్, రైల్వే కీలక నిర్ణయం!

Two Vande Bharat Trains To Be Discontinued: భారతీయ రైల్వేలోకి సెమీ హైస్పీడ్ రైళ్లుగా వందేభారత్ ఎక్స్ ప్రెస్ లు అడుగు పెట్టాయి. ప్రయాణీకులకు ప్రపంచ స్థాయి ప్రయాణ అనుభవాన్ని అందిస్తున్నాయి. అత్యాధునిక టెక్నాలజీతో లగ్జరీ సౌకర్యాలతో ఆహ్లాదకర ప్రయాణాలను అందిస్తున్నాయి. దేశ వ్యాప్తంగా 150కి పైగా మార్గాల్లో వందేభారత్ స్లీపర్ రైళ్లు సేవలు అందిస్తున్నాయి. ఎక్కువ ప్రయాణీకులు ఉండే ప్రాంతాల్లో వందేభారత్ సర్వీసులను అందుబాటులోకి తీసుకొస్తున్నారు అధికారులు. అదే సమయంలో తక్కువ ప్రయాణీకులు ఉన్న మార్గాల్లో ఈ రైలు సేవలు నిలిపివేస్తున్నారు. తాజాగా దేశంలో రెండు సర్వీసులను క్యాన్సిల్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ ఏ రూట్ లో ఆ రైళ్లను క్యాన్సిల్ చేస్తున్నారు? ఎందుకు? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

ఉదయపూర్‌ రూట్ లో రెండు రైళ్లు క్యాన్సిల్  

రైల్వేబోర్డు తాజా నిర్ణయం ప్రకారం ఉదయపూర్- ఆగ్రా కాంట్ మధ్య నడిచే రైలు (నంబర్ 20981/82) ఫిబ్రవరి 15, 2026 నుంచి నిలిపివేయబడుతుంది. అటు ఉదయపూర్- జైపూర్ మధ్య నడుస్తున్న రైలు (నంబర్ 20979/80) ఫిబ్రవరి 14, 2026 నుంచి సర్వీసులు నిలిచిపోనున్నాయి.  ఈ రైళ్లను నిలిపివేయడానికి ప్రధాన కారణం తక్కువ ప్రయాణీకుల రద్దీ. ఆ మార్గంలో పరిమిత స్టాప్‌లు కూడా ప్రయాణికుల సంఖ్య తగ్గడానికి కారణం అయినట్లు అధికారులు వెల్లడించారు.

ఆగ్రా కనెక్టివిటీపై ప్రభావం పడే అవకాశం

ఇక ఉదయపూర్-ఆగ్రా కాంట్ వందేభారత్ సర్వీసు నిలిపివేయడంతో ఆగ్రా నుంచి ప్రయాణించే వందేభారత్ సర్వీసుల సంఖ్య మూడుకి తగ్గుతుంది. ముఖ్యంగా వేగవంతమైన కనెక్షన్లను కోరుకునే ప్రయాణికుల కోసం, వందే భారత్ సేవలను అందుబాటులోకి తీసుకురావడం వల్ల ప్రధాన పర్యాటక కేంద్రమైన ఆగ్రా ప్రయోజనం పొందింది. కానీ, ఇప్పుడు ఆ మార్గంలో నడిచే వందేభారత్ సర్వీసులను నిలిపివేయడం ద్వారా, ఆగ్రా కనెక్టివిటీ మీద ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా టూరిస్టులకు మరింత ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది.

Read Also: స్లీపర్ క్లాస్ టికెట్ తో ఏసీలో ప్రయాణించాలనుందా? సింపుల్ గా ఇలా చేయండి!

వందేభారత్ రైళ్ల గురించి..

వందే భారత్ రైళ్లను భారతీయ రైల్వేలలోకి అత్యాధునిక సెమీ హైస్పీడ్ రైళ్లుగా తీసుకొచ్చారు. వీటి రాకతో ఇండియన్ రైల్వేలో కొత్త అధ్యాయం మొదలయినట్లు అయ్యింది. మెరుగైన వేగం, ఆధునిక కోచ్‌లు, మెరుగైన ప్రయాణీకుల సౌకర్యాలను అందిస్తున్నారు. దేశ వ్యాప్తంగా 150కి పైగా మార్గాల్లో వందేభారత్ రైళ్లు నడుస్తున్నాయి. మరిన్ని కొత్త మార్గాల్లో విస్తరించేందుకు ప్రణాళికలు కొనసాగుతున్నాయి. అదే సయంలో తక్కువ ప్రయాణీకుల రద్దీ ఉన్న మార్గాల్లో వందేభారత్ రైళ్ల సేవలను క్యాన్సిల్ చేస్తున్నారు అధికారులు. వాటిని ఎక్కువ ప్రయాణీకుల రద్దీ ఉన్న ప్రాంతాల్లోకి మళ్లిస్తున్నారు.  అందులో భాగంగానే ఉదయపూర్, ఆగ్రా కాంట్, జైపూర్ మధ్య నడిచే రైళ్లను క్యాన్సిల్ చేశారు. ఈ మార్గాల్లోని ప్రయాణీకులు ఇప్పుడు ప్రత్యామ్నాయ రైలు సేవలను వినియోగించుకోవాల్సి ఉంటుంది.

Read Also: ప్రయాణీకులకు గుడ్ న్యూస్, వందేభారత్ స్లీపర్ లో ఇక ఎమర్జెన్సీ కోటా టికెట్లు!

Related News

రైల్వే స్టేషన్ బోర్డుపై ‘సముద్ర మట్టం ఎత్తు’ ఎందుకు రాస్తారో తెలుసా? దీని వెనుక రహస్యం ఇదే!

రిటైర్మెంట్ తర్వాత.. పాత రైళ్లను ఏం చేస్తారో తెలుసా? రూ. కోట్ల బిజినెస్ భయ్యా!

రైలు పట్టాలపై కంకర రాళ్లు ఎందుకు ఉంటాయో తెలుసా? వాటి బెనిఫిట్స్ తెలిస్తే షాకే!

వెయిటింగ్‌ లిస్ట్‌పై కీలక అప్‌డేట్‌… ఇకపై అలా కుదరదు.. ఇవాళ్టి నుంచి మారనున్న రూల్స్

టాయిలెట్ లో ప్లేట్లు కడిగిన రైల్వే సిబ్బంది.. FSSAI సీరియస్, IRCTCకి నోటీసులు!

స్విట్జర్లాండ్‌ ట్రిప్.. తస్మాత్ జాగ్రత్త-లక్ష రెడీ చేసుకోండి.. ఏడాది తర్వాత భారతీయ మహిళకు లక్షన్నర ఫైన్

అక్కడ పెట్రోల్ కంటే వాటర్ బాటిల్ ధర ఎక్కువ.. జీవితంలో ఒక్కసారైనా ఆ అందమైన దేశానికి వెళ్లి రావాల్సిందే!

మీరు వెళ్లాల్సిన రైలు లేటయ్యిందా? డోంట్ వర్రీ.. హ్యాపీగా రైల్వే స్టేషన్ లో ఏసీ రూమ్ బుక్ చేసుకోండి!

Big Stories

×