E-Paper
Advertisement

Vande Bharat Express: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. నర్సాపురం వరకు వందే భారత్ రైలు పొడిగింపు

Vande Bharat Express: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. నర్సాపురం వరకు వందే భారత్ రైలు పొడిగింపు

Vande Bharat Express: భారతీయ రైల్వేలో ‘వందే భారత్’ ఎక్స్ ప్రెస్ రైలుకు ఆదరణ పెరుగుతోంది. అతి తక్కువ సమయంలో వేగంగా తమ గమ్యస్థానాలకు చేరుకోవాలనుకునేవారు వందే భారత్ రైలులో ప్రయాణిస్తున్నారు. చెన్నై సెంట్రల్‌-విజయవాడ మధ్య నడుస్తున్న వందే భారత్‌ రైళ్లను పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం వరకు తాత్కాలికంగా పొడిగించినట్లు రైల్వే అధికారులు తెలిపారు.

చెన్నై సెంట్రల్ టు నర్సాపురం

ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటన చేసంది. చెన్నై సెంట్రల్‌-నరసాపురం వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌(నెం.20677) ఈ నెల 15 నుంచి జనవరి 11 వరకు నడపనున్నారు. ఈ రైలు చెన్నై సెంట్రల్‌లో ఉదయం 5.30 గంటలకు బయల్దేరి 7.05 గంటలకు రేణిగుంట, 8.29 గంటలకు నెల్లూరు, 9.43 గంటలకు ఒంగోలు, 11.08 గంటలకు విజయవాడ చేరుకుంటుంది. మధ్యాహ్నం 12.29 గుడివాడ, 01.14 గంటలకు భీమవరం టౌన్‌, 2.10 గంటలకు నరసాపురం స్టేషన్ చేరుకుంటుంది.

నర్సాపురం టు చెన్నై సెంట్రల్

అలాగే నర్సాపురం-చెన్నై సెంట్రల్‌ వందే భారత్‌ రైలు(నెం.20678) ఈ నెల 17 నుంచి జనవరి 11 వరకు నడపనున్నారు. ఈ రైలు నర్సాపురంలో మధ్యాహ్నం 2.50 గంటలకు బయల్దేరి 3.19 గంటలకు భీమవరం టౌన్‌, సాయంత్రం 4.04 గంటలకు గుడివాడ, 4.50 గంటలకు విజయవాడ, 6.29 గంటలకు ఒంగోలు, రాత్రి 7.39 గంటలకు నెల్లూరు చేరుకుంటుంది. రాత్రి 9.50 గంటలకు రేణిగుంట,11.45 గంటలకు చెన్నై సెంట్రల్‌ చేరుకుంటుందని దక్షిణ రైల్వే ప్రకటనలో తెలిపింది.

నర్సాపురం-చెన్నై మార్గంలో వ్యాపారులు నిత్యం ప్రయాణిస్తుంటారు. దీంతో వారు వందే భారత్ ను ఎక్కువగా వినియోగించుకునే అవకాశం కలిగింది. ఉపాధి, ఉద్యోగాల కోసం తమిళనాడులో ఉంటున్న వారు సంక్రాంతి సీజన్ కు స్వగ్రామాలకు వస్తుంటారు. దీంతో వీరు కూడా వందే భారత్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది.

]

Related News

రైల్వే స్టేషన్ బోర్డుపై ‘సముద్ర మట్టం ఎత్తు’ ఎందుకు రాస్తారో తెలుసా? దీని వెనుక రహస్యం ఇదే!

రిటైర్మెంట్ తర్వాత.. పాత రైళ్లను ఏం చేస్తారో తెలుసా? రూ. కోట్ల బిజినెస్ భయ్యా!

రైలు పట్టాలపై కంకర రాళ్లు ఎందుకు ఉంటాయో తెలుసా? వాటి బెనిఫిట్స్ తెలిస్తే షాకే!

వెయిటింగ్‌ లిస్ట్‌పై కీలక అప్‌డేట్‌… ఇకపై అలా కుదరదు.. ఇవాళ్టి నుంచి మారనున్న రూల్స్

టాయిలెట్ లో ప్లేట్లు కడిగిన రైల్వే సిబ్బంది.. FSSAI సీరియస్, IRCTCకి నోటీసులు!

స్విట్జర్లాండ్‌ ట్రిప్.. తస్మాత్ జాగ్రత్త-లక్ష రెడీ చేసుకోండి.. ఏడాది తర్వాత భారతీయ మహిళకు లక్షన్నర ఫైన్

అక్కడ పెట్రోల్ కంటే వాటర్ బాటిల్ ధర ఎక్కువ.. జీవితంలో ఒక్కసారైనా ఆ అందమైన దేశానికి వెళ్లి రావాల్సిందే!

మీరు వెళ్లాల్సిన రైలు లేటయ్యిందా? డోంట్ వర్రీ.. హ్యాపీగా రైల్వే స్టేషన్ లో ఏసీ రూమ్ బుక్ చేసుకోండి!

Big Stories

×