BigTV English

Vande Bharat Attack: వందే భారత్ రైలుపై దాడి.. ఢమాల్ అంటూ శబ్దం.. ఎంతకు తెగించారు!

Vande Bharat Attack: వందే భారత్ రైలుపై దాడి.. ఢమాల్ అంటూ శబ్దం.. ఎంతకు తెగించారు!

Vande Bharat Attack: దేశ గర్వంగా భావించే వందే భారత్‌ రైలుపై ఓ దారుణ దాడి.. ఒంగోలు వద్ద రాత్రి సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు రైలు బోగీలపై రాళ్ల దాడికి పాల్పడగా.. ప్రయాణికుల్లో ఆందోళన నెలకొంది. రెండు బోగీల అద్దాలు పాక్షికంగా విరిగిపోవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇప్పుడు ఒంగోలు రైల్వే స్టేషన్ పరిధిలో గాలింపు తారాస్థాయికి చేరింది.


దాడి వివరాలు ఇలా..
గురువారం రాత్రి సమయంలో హైదరాబాద్‌ నుండి చెన్నై వైపు ప్రయాణిస్తున్న వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ఒంగోలు వద్దకు చేరినపుడు, స్థానిక ప్రాంతం దాటుతున్న సమయంలో అకస్మాత్తుగా రైలుపై రాళ్లు పడిన శబ్దం వినిపించిందట. ఆ సమయంలో ప్రయాణికులు కిటికీలను మూసుకోవడమే కాక, భయంతో ఒక్కసారిగా హడలిపోయారు. రెండు బోగీల అద్దాలు పాక్షికంగా ధ్వంసం అయినట్టు తెలుస్తోంది. అదృష్టవశాత్తూ ఎవరికీ గాయాలు కాలేదు. అయితే, ప్రయాణికుల్లో గభీరం కలగడంతో, రైల్వే అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు.

పోలీసుల గాలింపు ప్రారంభం
ఈ ఘటనపై దక్షిణ మధ్య రైల్వే అధికారులు మరియు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) వెంటనే స్పందించారు. వందే భారత్‌కు ఎదురైన భద్రతా ముప్పును తేలికగా తీసుకోవడం సాధ్యంకాదు. రైల్వే ట్రాక్‌ పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలు, ప్రత్యక్ష సాక్ష్యాలను ఆధారంగా పెట్టుకొని గుర్తుతెలియని దుండగుల కోసం గాలింపు చేపట్టారు. ఒంగోలు పట్టణానికి ఆనుకొని ఉన్న కాలనీల్లో, స్టేషనుకు సమీపంగా ఉండే రైల్వే మార్గాల్లో నిరంతరం పోలీసు పహారా కొనసాగుతోంది.


వందే భారత్‌పై ఇలా ఎందుకు?
దేశంలోని అత్యాధునిక రైళ్లలో వందే భారత్‌కు ప్రత్యేక స్థానం ఉంది. వేగవంతమైన ప్రయాణం, ప్రయాణికులకు అధునాతన సౌకర్యాలతో అందుబాటులో ఉన్న ఈ రైలు తరచూ తక్కువ సమయంతో ఎక్కువ ప్రయాణాన్ని పూర్తి చేస్తుంది. కానీ ఇటీవలి కాలంలో తెలంగాణ, బిహార్, పశ్చిమబెంగాల్, కేరళలోనూ వందే భారత్‌పై ఇలాగే రాళ్ల దాడులు జరిగిన ఉదంతాలు నమోదయ్యాయి.

రైల్వే శాఖ తీవ్రంగా స్పందిస్తోంది
ఒంగోలు ఘటనపై రైల్వే శాఖ అధికారికంగా విచారణ మొదలుపెట్టింది. రైలుపై దాడి చేయడం ఐపీసీ ప్రకారం తీవ్ర నేరంగా పరిగణించబడుతుంది. రైల్వే ప్రాపర్టీకి హాని కలిగించిన వారిపై 6 నెలల జైలు శిక్ష, భారీ జరిమానా విధించే అవకాశం ఉంది. అలాగే ప్రజలకు హెచ్చరికలతో పాటు, ఎటువంటి అనుమానాస్పద కార్యకలాపాలను తక్షణమే అధికారులకు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

ప్రయాణికుల భద్రతపై ప్రశ్నలు..
ఈ ఘటనతో రైల్వే ప్రయాణ భద్రతపై తీవ్ర చర్చ జరుగుతోంది. ముఖ్యంగా దేశం గర్వించే వందే భారత్‌ రైలుపై దాడులు మళ్లీ మళ్లీ జరుగుతుండటమే అధికారులను ఆందోళనలోకి నెట్టుతోంది. ప్రయాణికులు కూడా రాత్రివేళ రైలు ప్రయాణాల్లో భయంతో ఉంటున్నారట. అందమైన డిజైన్‌తో ఉండే వందే భారత్‌పై ఎవరికి ఇంత కసి? అనే ప్రశ్న ఇప్పుడు సామాన్య ప్రజానీకం నోళ్ళలో వినిపిస్తోంది. వందే భారత్‌ భారత రైల్వే ప్రతిష్ఠకు నిలువెత్తు ప్రతీక. అలాంటి రైలుపై దాడులు జరగడం మన దేశ అభివృద్ధికి మచ్చపడే విషయమే, నిందితులు ఎవరైనా సరే కఠినంగా శిక్షించాల్సిందేనని ప్రయాణికులు అంటున్నారు.

Also Read: Visakhapatnam Drain Incident: గంటల తరబడి మురికిలో.. నిమిషాల్లో పోయే ప్రాణాలు.. విశాఖలో ఏం జరిగిందంటే?

దొరికితే చుక్కలే..
ఈ ఘటనపై ఇప్పటికే పోలీసులు, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) కలిసికట్టుగా దర్యాప్తు చేపట్టారు. దుండగులను గుర్తించేందుకు సీసీ కెమెరాల ఫుటేజ్‌ విశ్లేషణ జరుగుతోంది. ఇదే సమయంలో ప్రజలంతా కలిసికట్టుగా సహకరించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే, వందే భారత్‌ వంటి కీలక రైలుపై దాడి చేయడం సాధారణమైన అంశం కాదు. ఇది చట్టరీత్యా తీవ్రమైన నేరంగా పరిగణించబడుతుంది.

భారతీయ శిక్షా సంహిత (IPC) ప్రకారం, ప్రభుత్వ ఆస్తిపై తలపెట్టే విధ్వంసక చర్యలు కఠినంగా శిక్షార్హం. ముఖ్యంగా, రైల్వే చట్టం 1989లోని సెక్షన్ 152 ప్రకారం, ఈ తరహా దాడులకు సంబంధించి జీవిత ఖైదు లేదా కనీసం 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. పైగా, 2 సంవత్సరాల కంటే తక్కువగా శిక్ష తగ్గించడానికి అవకాశం లేదు. ఇక రైలుపై రాళ్ల దాడి చేస్తే రూ. 50,000ల వరకూ జరిమానా, అత్యల్పంగా రెండేళ్ల జైలు శిక్ష ఖచ్చితంగా అమలులోకి వస్తుంది.

ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే, ఇది బెయిల్‌ లభించని నేరంగా పరిగణించబడుతుంది. ఒకవేళ చిన్నారులు (జువెనైల్స్) ఈ చర్యకు పాల్పడ్డారని తేలినా, వారికి బదులుగా వాళ్ల తల్లిదండ్రులు లేదా సంరక్షకులపై చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

అంతేకాదు, వందే భారత్‌ వంటి దేశ ప్రతిష్ఠాత్మక రైలుపై దాడి జరగడం పట్ల రైల్వే శాఖ తీవ్ర స్థాయిలో స్పందిస్తోంది. రాష్ట్ర స్థాయి నుండి కేంద్ర స్థాయి వరకూ అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రయాణికుల భద్రతే ప్రథమ కర్తవ్యం అనే దృష్టితో రైల్వే శాఖ పటిష్టమైన భద్రతా చర్యలు చేపడుతోంది. మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రత్యేక పర్యవేక్షణ బృందాలు, డిజిటల్ గస్తీ, డ్రోన్ నిఘా వంటి చర్యలు చేపట్టే దిశగా సాగుతోంది. ఈ నేపథ్యంలో నిందితులు ఎంతగా దాగినా వారి పాపం బయటపడక మానదు.. తగిన శిక్ష ఖచ్చితమే!

Related News

Special Trains: సికింద్రాబాద్ నుంచి ఆ నగరానికి స్పెషల్ ట్రైన్, ప్రయాణీకులకు గుడ్ న్యూస్!

Kakori Train Action: కాకోరి రైల్వే యాక్షన్.. బ్రిటిషోళ్లను వణికించిన దోపిడీకి 100 ఏళ్లు!

Secunderabad Station: ఆ 32 రైళ్లు ఇక సికింద్రాబాద్ నుంచి నడవవు, ఎందుకంటే?

Raksha Bandhan 2025: వారం రోజుల పాటు రక్షాబంధన్ స్పెషల్ ట్రైన్స్.. హ్యపీగా వెళ్లొచ్చు!

Garib Rath Express: గరీబ్ రథ్ ఎక్స్‌ ప్రెస్ రైలు పేరు మారుతుందా? రైల్వే మంత్రి ఏం చెప్పారంటే?

Safest Cities In India: మన దేశంలో సేఫ్ సిటీ ఇదే, టాప్ 10లో తెలుగు నగరాలు ఉన్నాయా?

Big Stories

×