E-Paper
Advertisement

Liquor Sales Record : 157 కోట్ల బీర్లు తాగారా.. అసలు మీరు మనుషులేనా!

Liquor Sales Record : 157 కోట్ల బీర్లు తాగారా.. అసలు మీరు మనుషులేనా!
Advertisement

Liquor Sales Record : రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఐపీఎల్ 2025 సీజన్ లో ట్రోఫీ గెలుచుకున్న విషయం తెలిసిందే. దీంతో అభిమానులు దేశవ్యాప్తంగా అంగరంగ వైభవంగా సంబురాలు జరుపుకున్నారు. చిన్న పల్లెటూరు నుంచి రాష్ట్ర స్థాయి వరకు దేశవ్యాప్తంగా ఆర్సీబీ అభిమానులు విజయోత్సవ వేడుకలు నిర్వహించుకున్నారు. పల్లెటూర్లలో కూడా యువకులు కేకులు కట్ చేస్తూ.. లిక్కర్ తో తెగ ఎంజాయ్ చేశారు. సోషల్ మీడియాలో ఈ వార్త ప్రస్తుతం వైరల్ గా మారింది. ముఖ్యంగా కర్నాటక రాష్ట్రంలో రికార్డు స్థాయిలో లిక్కర్ సేల్స్ జరిగాయి. రూ.157.94 కోట్ల విలువైన మద్యం సేవించడం విశేషం. ఇలాంటి మ్యాచ్ లు నెలకి ఒక్కటి ఉంటే ఎంత బాగుండేదో అని మద్యం వ్యాపారులు పేర్కొనడం విశేషం.

Also Read : Trolls On Allu Ayaan : ఫుట్ బాల్ జెర్సీ వేసి ఆర్సీబీ ఫ్యాన్ అంటాడేంటి ?

Advertisement

 

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అభిమానులు ఫైనల్ లో ఆర్సీబీ విజయం సాధించడంతో విరాట్ కోహ్లీ ఎమోషనల్ కావడంతో వారి సంతోషం పట్టలేక కొంత మంది అయితే అప్పులు చేసి మరీ మద్యం సేవించారట. ఈ మ్యాచ్ లో తొలుత పంజాబ్ గెలుస్తుందని అంతా భావించారు. కానీ ఆర్సీబీ బౌలర్లలో కృణాల్ పాండ్యా మినహా అందరూ పరుగులు సమర్పించుకున్నారు. అయితే భువనేశ్వర్ పరుగులు సమర్పించుకున్నప్పటికీ 17వ ఓవర్ లో ఇద్దరి వికెట్లు తీయడంతో మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వైపు మళ్లింది. 17 ఓవర్ వరకు కూడా పంజాబ్ కింగ్స్ విజయం సాధిస్తుందని రేటింగ్ కూడా 60/40 అని చెప్పారు. కానీ అనూహ్యంగా బెంగళూరు బౌలర్లు పుంజుకొని వికెట్లు తీయడంతో పంజాబ్ కింగ్స్ జట్టుకి కళ్లెం వేశారు. దీంతో రాయల్ ఛాలలెంజర్స్ బెంగళూరు విజయం సాధించింది. 

Advertisement

బెంగళూరు విజయం సాధించడం ఒక ఎత్తయితే.. విజయం సాధించిన తరువాత సంబురాలు జరపడం మరో ఎత్తుగా మారింది. నిన్న రాత్రి చిన్న స్వామి స్టేడియంలో ఆర్సీబీ యాజమాన్యం విజయోత్సవ సంబురాలు నిర్వహించారు. ఈ వేడుకలకు ఆర్సీబీ టీమ్ ఓపెన్ టాప్ బస్సులో స్టేడియం వద్దకు చేరుకున్నారు. తమ క్రికెటర్లను చూసేందుకు మెట్రోలలో, బస్సుల్లో చిన్న స్వామి స్టేడియం వద్దకు ఆర్సీబీ అభిమానులు భారీగా చేరుకున్నారు. అభిమానులు భారీగా చేరుకోవడంతో తొక్కిసలాట జరిగి 11 మంది మృతి చెందారు. ఇది కేవలం ఒక్క చిన్నస్వామి స్టేడియం వద్దనే. దేశవ్యాప్తంగా ఆర్సీబీ అభిమానులు 25 మందికి పైగా మరణించినట్టు సమాచారం. ఆర్సీబీ జట్టు 18వ సీజన్ లో విజయం సాధించడం.. విరాట్ కోహ్లీ జెర్సీ నెం.18 కావడం విశేషం. ఆర్సీబీ  వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ ని అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో లక్షలాది మంది వీక్షించారు. ఈ స్టేడియం ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియం కావడం విశేషం. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇప్పటికే మూడుసార్లు టైటిల్ గెలవకుండా ఫైనల్ లో ఇంటిదారి పట్టేది. కానీ ఎట్టకేలకు ఈ సీజన్ లో టైటిల్ సాధించడంతో అభిమానులు అంతా ఇంకా కూడా అక్కడక్కడ సంబరాలు జరుపుకుంటున్నారు. 

Related News

ఇమామ్ ఉల్ హక్ పెద్ద ద‌ద్ద‌మ్మ‌…త‌న‌ మామ ఇంజ‌మామ్ లాగా బ‌ద్ధ‌క‌స్తుడే

టీమిండియా ఓట‌మిని శాసించిన‌ సామ్‌ కర్రన్..అత‌ను వేసిన మూన్ బాల్స్ కొంప‌ముంచాయి

లార్డ్స్ వన్డేలో బాల్ టాంపరింగ్…శ్రేయస్ అయ్యర్ పై బ్యాన్?

లార్డ్స్ నుంచి అలిగి ఇంటికి వెళ్లిపోయిన గంభీర్..?

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

Big Stories

Advertisement
×