Visakhapatnam New Traffic Rules: రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో వైజాగ్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ట్రాఫిక్ రూల్స్ పాటించని వాహనదారులపై ఉక్కుపాదం మోపాలని నిర్ణయించారు. ఎక్కడ చిన్న తప్పు చేసినా తప్పించుకోలేని సిచువేషన్ క్రియేట్ చేస్తున్నారు. స్పీడ్ గన్స్, ఏఐ టెక్నాలజీ సాయంతో రూల్స్ అతిక్రమించిన వెంటనే జరిమానా ఈ చలాన్ రూపంలో వాహనదారుడికి మొబైల్ కు వచ్చేలా ఏర్పాటు చేశారు వైజాగ్ ట్రాఫిక్ పోలీసులు.
వాహనదారుల అతి వేగాన్ని కంట్రోల్ చేసేందుకు2 స్పీడ్ లేజర్ గన్స్ ను వైజాగ్ ట్రాఫిక్ పోలీసులు అందుబాటులోకి తీసుకొచ్చారు. సుమారు రూ. 18 లక్షల వ్యయంతో వీటిని కొనుగోలు చేశారు. ఈ స్పీడ్ గన్స్ 100 మీటర్ల దూరం నుంచే వచ్చే వాహనానికి సంబంధించి వేగాన్ని డికెక్ట్ చేస్తుంది. అదే సమయంలో వైజాగ్ లోని 44 కీలక ప్రాంతాల్లో 120 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వీటి ద్వారా 24 గంటలు నిఘా పెడతారు. పోలీసులు కనిపించపోయినా, స్పీడ్ లేజర్ గన్స్, కెమెరాలు వాహనదారులను గమనిస్తూనే ఉంటాయి.
ఇకపై ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసి తప్పించుకోవడం వైజాగ్ లో సాధ్యం కాదంటున్నారు ట్రాఫిక్ పోలీసులు. స్పీడ్ లేజర్ గన్స్ సాయంతో 100 మీటర్ల దూరంలోనే స్పీడ్ డిటెక్షన్ చేయనున్నారు. హెల్మెట్ లేకపోతే ఫైన్ ఖాయం కానుంది. ట్రిపుల్ రైడింగ్, రాంగ్ రూట్ కు ఛాన్స్ లేకుండా చేస్తున్నారు. సీట్ బెల్ట్ లేకపోయినా క్షణాల్లో ఫైన్స్ విధించనున్నారు. నగర వ్యాప్తంగా 120 CCTV కెమెరాలతో 24/7 నిఘా ఉంచుతున్నారు.
Read Also: 8 ఏళ్ల వారెంటీతో.. జస్ట్ రూ. 49,999కే అదిరిపోయే ఎలక్ట్రిక్ బైక్!
ఇకపై వైజాగ్ లో ఇష్టం వచ్చినట్లు డ్రైవింగ్ చేస్తామంటే కుదరదని పోలీసులు వెల్లడించారు. కచ్చితంగా ట్రాఫిక్ రూల్స్ పాటించడంతో పాటు సేఫ్గా డ్రైవ్ చేయాలని సూచిస్తున్నారు. పోలీసులు కనిపించడం లేదంటూ ఉల్లంఘనలు చేయకూడదంటున్నారు. మీ భద్రత మీ చేతుల్లోనే ఉందంటున్నారు. మొత్తంగా విశాఖలో మరికొద్ది రోజుల్లో ట్రాఫిక్ రూల్స్ వాయిలేషన్ అనేది ఉండదని పోలీసులు అంచనా వేస్తున్నారు. అదే సమయంలో, పదే పదే ట్రాఫిక్ రూల్స్ పాటించని వారిపై పెద్ద మొత్తంలో జరిమానా విధించడంతో పాటు డ్రైవింగ్ లైసెన్సులు క్యాన్సిల్ చేయడం, వాహనాలను జప్తు చేయడం, కొన్ని సందర్భాల్లో జైలు శిక్ష కూడా విధించే ఏర్పాట్లు చేస్తున్నారు.
Read Also: మిలటరీ తయారు చేసిన ఎలక్ట్రిక్ డర్ట్ బైక్ ఇది.. ఆఫ్ రోడ్లో రయ్ రయ్!