E-Paper
Advertisement

Yadadri MMTS: సికింద్రాబాద్ టు యాదాద్రి.. చౌకగా, వేగంగా.. భక్తుల కష్టాలు తీర్చనున్న‌ ఎంఎంటీఎస్

Yadadri MMTS: సికింద్రాబాద్ టు యాదాద్రి.. చౌకగా, వేగంగా.. భక్తుల కష్టాలు తీర్చనున్న‌ ఎంఎంటీఎస్
Advertisement

Yadadri MMTS: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి భక్తులకు రైల్వే శాఖ తీపి కబురు అందించింది. హైద‌రాబాద్ నుంచి యాదాద్రి పుణ్యక్షేత్రానికి ఎంఎంటీఎస్ రైలు సదుపాయం కల్పించేందుకు ఎట్టకేలకు ముహూర్తం ఖరారైంది. రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ (RVNL) ఈ ప్రాజెక్టుకు సంబంధించిన టెండర్లను దక్కించుకోవడంతో, ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఈ రైలు మార్గం పనులు త్వరలోనే పట్టాలెక్కనున్నాయి. ఈ ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే హైదరాబాద్ నగరం నుంచి యాదాద్రికి వెళ్లే భక్తులకు రవాణా కష్టాలు తీరడమే కాకుండా, ప్రయాణం మరింత సులభతరం, చౌకగా మారుతుంది.

ఈ ప్రాజెక్టు వివరాల ప్రకారం, సుమారు రూ. 430 కోట్ల అంచనా వ్యయంతో 33 కిలోమీటర్ల మేర నూతన రైలు మార్గాన్ని నిర్మించనున్నారు. సికింద్రాబాద్ నుంచి బయలుదేరే ఎంఎంటీఎస్ రైళ్లు చర్లపల్లి, ఘటకేసర్ మీదుగా రాయగిరి స్టేషన్ వరకు చేరుకుంటాయి. అక్కడి నుంచి కేవలం 4 కిలోమీటర్ల రోడ్డు మార్గం ద్వారా భక్తులు ఆలయానికి చేరుకోవచ్చు. ఈ పనులను రాబోయే రెండున్నరేళ్లలో పూర్తి చేసి, రైళ్లను ప్రజలకు అందుబాటులోకి తేవాలని రైల్వే శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే రాయగిరి వరకు భూసేకరణ ప్రక్రియ పూర్తి కావడంతో, పనులను వేగవంతం చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు.

Advertisement

వాస్తవానికి ఈ ప్రాజెక్టు ప్రతిపాదన 2015లోనే యాదాద్రి అభివృద్ధి పనుల్లో భాగంగా తెరపైకి వచ్చింది. అయితే, కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సరైన సమన్వయం లేకపోవడంతో దాదాపు తొమ్మిదేళ్ల పాటు ఈ ప్రాజెక్టు పెండింగ్‌లో ఉండిపోయింది. తాజాగా రైల్వే శాఖ తన సొంత నిధులతోనే ఈ నిర్మాణాన్ని చేపట్టాలని నిర్ణయించడంతో అడ్డంకులు తొలగిపోయాయి. పటాన్‌చెరు, లింగంపల్లి, మేడ్చల్ వంటి నగర శివారు ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు కూడా ఎంఎంటీఎస్ రైళ్ల ద్వారా నేరుగా రాయగిరికి చేరుకునే అవకాశం కలగనుంది. ఇది నగరం నలుమూలల నుంచి వచ్చే వేలాది మంది భక్తులకు గొప్ప ఊరటనిచ్చే పరిణామం.

Read Also: Sridhar Babu on BRS: మాట తప్పని ప్రభుత్వం మాది.. గ్యారెంటీలను పట్టాలెక్కిస్తున్నా.. శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు

Related News

ఎలాన్ మస్క్ ఫ్లయింగ్ ప్యాలెస్.. ఈ జెట్‌లోని ఫీచర్లు తెలిస్తే పరేషాన్ కావాల్సిందే!

విదేశాల్లో పెళ్లిళ్లు వద్దంటూ పిలుపునిచ్చిన మోదీ.. ఇండియాలో సెలెబ్రిటీ వెడ్డింగ్ డెస్టినేషన్స్ ఇవే

అమరావతి ఓవైపు.. ఫ్యూచర్ సిటీ మరోవైపు.. దక్షిణ భారత ముఖచిత్రాన్ని మార్చబోతున్న రెండు మెగా నగరాలు!

రాత్రి 9 తర్వాత నో ఎంట్రీకి చెక్.. శ్రీశైలానికి 24/7 రూట్ క్లియర్!

కారు, మెట్రో కాదు.. ఇంటికి వెళ్లాలంటే నదిలో దూకాల్సిందే!

నేపాల్ వరదల్లో నమ్మశక్యం కాని ఘటనలు.. ప్రపంచాన్నే ఆశ్చర్యపరిచిన 6 అద్భుతాలు..!

ఒకే బిల్డింగ్‌లో ఊరంతా.. ఈ వింత చూస్తే షాక్ అవ్వాల్సిందే!

గాల్లో తేలే పుస్తకాలు.. చుట్టూ అద్దాల మాయ.. ప్రపంచాన్ని అబ్బురపరుస్తున్న ఫ్యూచరిస్టిక్ లైబ్రరీ!

Big Stories

Advertisement
×