E-Paper
Advertisement

Anasuya: హైపర్ ఆది కారణంగా జబర్దస్త్ కు దూరం.. ఇన్నాళ్లకు ఓపెన్ అయిన యాంకర్?

Anasuya: హైపర్ ఆది కారణంగా జబర్దస్త్ కు దూరం.. ఇన్నాళ్లకు ఓపెన్ అయిన యాంకర్?

Anasuya: అనసూయ (Anasuya)అంటేనే అందరికీ జబర్దస్త్ (Jabardasth)కార్యక్రమం గుర్తుకు వస్తుంది. ఈ కార్యక్రమానికి యాంకర్ గా అనసూయ కొనసాగుతూ ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్నారు. ఇక ఈ కార్యక్రమం ద్వారా ఈమెకు మంచి గుర్తింపు రావడంతో సినిమా అవకాశాలు కూడా వచ్చాయి. ఇలా వరుస సినిమా అవకాశాలు వస్తున్న నేపథ్యంలో జబర్దస్త్ కార్యక్రమానికి దూరమయ్యారు. అయితే ఇటీవల జబర్దస్త్ కార్యక్రమం 12 సంవత్సరాలను పూర్తి చేసుకున్న నేపథ్యంలో మెగా సెలెబ్రేషన్స్ అంటూ ఈ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహించబోతున్నారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా జబర్దస్త్ కార్యక్రమం మొదలైనప్పటి నుంచి పాల్గొన్న కమెడియన్స్, యాంకర్లు, జడ్జిలు కూడా పాల్గొన్నారు.

ఎంతో ఎంకరేజ్ చేశాను..

ఇక ఈ కార్యక్రమానికి నాగబాబు(Nagababu) తిరిగి ఎంట్రీ ఇవ్వడం విశేషం. తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ఒక ప్రోమో విడుదల చేశారు. ఈ ప్రోమోలో భాగంగా అనసూయ జబర్దస్త్ కార్యక్రమాన్ని ఎందుకు వదిలి వెళ్ళిపోవాల్సి వచ్చిందో తెలియజేశారు. అనసూయ మాట్లాడుతూ…”బాబు గారు.. ఇంద్రజ గారు ఎంత అడుక్కున్నానో తెలుసా? నేను వెళ్లేముందు వద్దు ఆది నాకు కొన్ని.. అన్ని మైక్ లోనే చెప్పేస్తా..నేను నీతో పాటు స్కిట్ చేసి ఎంత ఎంకరేజ్ చేశాను. నా ఎక్స్ క్లూజివిటీ యాడ్ అవ్వలేదు అదే నా ఏడుపు” అంటూ అనసూయ మాట్లాడారు.

అమెరికా వెళ్లిన …

అనసూయ ఇలా మాట్లాడటంతో వెంటనే హైపర్ ఆది మాట్లాడుతూ…”ఒరేయ్ నువ్వు అమెరికా వెళ్లిన సరే నీకు లింకులు పంపించాను. అది రా మన మధ్య ఉన్న లింకు ఏమనుకుంటున్నావు రా నువ్వు” అంటూ హైపర్ ఆది మాట్లాడారు .దీంతో వెంటనే అనసూయ ఇదిగో ఇలా మాట్లాడిన అందుకే నేను జబర్దస్త్ కార్యక్రమం నుంచి వెళ్లిపోయాను అంటూ ఆది పై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. ప్రస్తుతం ఈ ప్రోమో చూస్తుంటే హైపర్ ఆది, అనసూయ మధ్య గట్టి వాధనే జరిగిందని స్పష్టమవుతుంది. అయితే వీరిద్దరి మధ్య ఏం జరిగిందనేది తెలియాలి అంటే పూర్తి ఎపిసోడ్ ప్రసారమయ్యే వరకు ఎదురు చూడాలి.

ఇక 12 సంవత్సరాలను ఈ కార్యక్రమం పూర్తి చేసుకున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున సెలబ్రేషన్స్ నిర్వహిస్తున్నారు. నాగబాబు మొదట ఈ కార్యక్రమానికి జడ్జిగా వ్యవహరించడంతో తిరిగి ఈయన కూడా జడ్జిగా వచ్చారు. అలాగే ఇంద్రజ కుష్బూ జడ్జెస్ గా ఉన్నారు. జబర్దస్త్ కార్యక్రమానికి నాగబాబుతో పాటు యాంకర్ గా వ్యవహరించిన రోజా(Roja) మాత్రం ఈ కార్యక్రమంలో కనిపించలేదు దీంతో ఉద్దేశపూర్వకంగానే ఆమెను ఈ కార్యక్రమానికి దూరం పెట్టారా? లేకపోతే పిలిచిన రాలేదా? అనే సందేహాలను అభిమానులు వ్యక్తపరుస్తున్నారు. అలాగే సుడిగాలి సుదీర్ కూడా ఈ కార్యక్రమంలో కనిపించకపోవడం గమనార్హం. ఇక ఈ కార్యక్రమానికి రీఎంట్రీ ఇచ్చిన నాగబాబు ఇదొక ఎపిసోడ్లో మాత్రమే కనిపించబోతున్నారా? లేకపోతే ప్రతి వారం జడ్జిగా ఈ కార్యక్రమంలో సందడి చేయనున్నారా?అనే విషయం తెలియాల్సి ఉంది.

Also Read: Rashmika Mandanna: ఆ ఫీలింగ్ లో తేలిపోతున్న రష్మిక.. ఆగలేక పోతున్నానంటూ పోస్ట్!

Related News

రెండు కాళ్లు ఫ్రాక్చర్.. ఆసుపత్రి బెడ్‌పై నుంచి పండు మాస్టర్ షాకింగ్ కామెంట్స్!

Bramhamudi Rudraani : ‘ బ్రహ్మముడి ‘ రుద్రాణి ఆస్తులు ఎన్ని కోట్లు..? హీరోయిన్లు సరిపోరు..

Podarillu Lalitha : ‘పొదరిల్లు’ మహా తల్లి రియల్ లైఫ్.. రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Gundeninda GudiGantalu Today episode: పాపం ప్రభావతి.. బాలును అరెస్ట్ చేసిన పోలీసులు.. మనోజ్ ను కొట్టిన పోలీసులు..

Podarillu Today Episode : అడ్డంగా బుక్కయిన ప్రతాప్.. మాధవ్ దెబ్బకు మైండ్ బ్లాక్.. అన్నదమ్ముల సీన్ హైలెట్..

Illu Illalu Pillalu Today Episodes: గుడ్డిగా నమ్మిమోసపోయిన ధీరజ్.. పోలీస్ స్టేషన్ లో ధీరజ్.. నర్మదకు అడ్డంగా బుక్కయిన శ్రీవల్లి..

Intinti Ramayanam Today Episode: అవని కోసం కన్నీళ్లు పెట్టుకున్న ఆరాధ్య.. నిజం చెప్పిన మీనాక్షి.. పల్లవికి కమల్ వార్నింగ్..

Karthika Deepam 2 Serial Today Episode June 4th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌:  సుమిత్ర బర్తుడే పార్టీకి వెళ్లిన దక్షిణమూర్తి

Big Stories

×