E-Paper
Advertisement

Anasuya: హైపర్ ఆది కారణంగా జబర్దస్త్ కు దూరం.. ఇన్నాళ్లకు ఓపెన్ అయిన యాంకర్?

Anasuya: హైపర్ ఆది కారణంగా జబర్దస్త్ కు దూరం.. ఇన్నాళ్లకు ఓపెన్ అయిన యాంకర్?
Advertisement

Anasuya: అనసూయ (Anasuya)అంటేనే అందరికీ జబర్దస్త్ (Jabardasth)కార్యక్రమం గుర్తుకు వస్తుంది. ఈ కార్యక్రమానికి యాంకర్ గా అనసూయ కొనసాగుతూ ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్నారు. ఇక ఈ కార్యక్రమం ద్వారా ఈమెకు మంచి గుర్తింపు రావడంతో సినిమా అవకాశాలు కూడా వచ్చాయి. ఇలా వరుస సినిమా అవకాశాలు వస్తున్న నేపథ్యంలో జబర్దస్త్ కార్యక్రమానికి దూరమయ్యారు. అయితే ఇటీవల జబర్దస్త్ కార్యక్రమం 12 సంవత్సరాలను పూర్తి చేసుకున్న నేపథ్యంలో మెగా సెలెబ్రేషన్స్ అంటూ ఈ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహించబోతున్నారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా జబర్దస్త్ కార్యక్రమం మొదలైనప్పటి నుంచి పాల్గొన్న కమెడియన్స్, యాంకర్లు, జడ్జిలు కూడా పాల్గొన్నారు.

ఎంతో ఎంకరేజ్ చేశాను..

Advertisement

ఇక ఈ కార్యక్రమానికి నాగబాబు(Nagababu) తిరిగి ఎంట్రీ ఇవ్వడం విశేషం. తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ఒక ప్రోమో విడుదల చేశారు. ఈ ప్రోమోలో భాగంగా అనసూయ జబర్దస్త్ కార్యక్రమాన్ని ఎందుకు వదిలి వెళ్ళిపోవాల్సి వచ్చిందో తెలియజేశారు. అనసూయ మాట్లాడుతూ…”బాబు గారు.. ఇంద్రజ గారు ఎంత అడుక్కున్నానో తెలుసా? నేను వెళ్లేముందు వద్దు ఆది నాకు కొన్ని.. అన్ని మైక్ లోనే చెప్పేస్తా..నేను నీతో పాటు స్కిట్ చేసి ఎంత ఎంకరేజ్ చేశాను. నా ఎక్స్ క్లూజివిటీ యాడ్ అవ్వలేదు అదే నా ఏడుపు” అంటూ అనసూయ మాట్లాడారు.

అమెరికా వెళ్లిన …

Advertisement

అనసూయ ఇలా మాట్లాడటంతో వెంటనే హైపర్ ఆది మాట్లాడుతూ…”ఒరేయ్ నువ్వు అమెరికా వెళ్లిన సరే నీకు లింకులు పంపించాను. అది రా మన మధ్య ఉన్న లింకు ఏమనుకుంటున్నావు రా నువ్వు” అంటూ హైపర్ ఆది మాట్లాడారు .దీంతో వెంటనే అనసూయ ఇదిగో ఇలా మాట్లాడిన అందుకే నేను జబర్దస్త్ కార్యక్రమం నుంచి వెళ్లిపోయాను అంటూ ఆది పై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. ప్రస్తుతం ఈ ప్రోమో చూస్తుంటే హైపర్ ఆది, అనసూయ మధ్య గట్టి వాధనే జరిగిందని స్పష్టమవుతుంది. అయితే వీరిద్దరి మధ్య ఏం జరిగిందనేది తెలియాలి అంటే పూర్తి ఎపిసోడ్ ప్రసారమయ్యే వరకు ఎదురు చూడాలి.

ఇక 12 సంవత్సరాలను ఈ కార్యక్రమం పూర్తి చేసుకున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున సెలబ్రేషన్స్ నిర్వహిస్తున్నారు. నాగబాబు మొదట ఈ కార్యక్రమానికి జడ్జిగా వ్యవహరించడంతో తిరిగి ఈయన కూడా జడ్జిగా వచ్చారు. అలాగే ఇంద్రజ కుష్బూ జడ్జెస్ గా ఉన్నారు. జబర్దస్త్ కార్యక్రమానికి నాగబాబుతో పాటు యాంకర్ గా వ్యవహరించిన రోజా(Roja) మాత్రం ఈ కార్యక్రమంలో కనిపించలేదు దీంతో ఉద్దేశపూర్వకంగానే ఆమెను ఈ కార్యక్రమానికి దూరం పెట్టారా? లేకపోతే పిలిచిన రాలేదా? అనే సందేహాలను అభిమానులు వ్యక్తపరుస్తున్నారు. అలాగే సుడిగాలి సుదీర్ కూడా ఈ కార్యక్రమంలో కనిపించకపోవడం గమనార్హం. ఇక ఈ కార్యక్రమానికి రీఎంట్రీ ఇచ్చిన నాగబాబు ఇదొక ఎపిసోడ్లో మాత్రమే కనిపించబోతున్నారా? లేకపోతే ప్రతి వారం జడ్జిగా ఈ కార్యక్రమంలో సందడి చేయనున్నారా?అనే విషయం తెలియాల్సి ఉంది.

Also Read: Rashmika Mandanna: ఆ ఫీలింగ్ లో తేలిపోతున్న రష్మిక.. ఆగలేక పోతున్నానంటూ పోస్ట్!

Related News

Telugu Tv Serials : ఈ వారం సీరియల్స్ రౌండప్.. టాక్ ఆఫ్ ది సీరియల్ ఏదంటే..?

ఇంద్రజకు ఒక్కరోజు రెమ్యూనరేషన్ ఎన్ని లక్షలో తెలుసా..? సినిమా కన్నా ఎక్కువే..

Gundeninda GudiGantalu Today episode: సంబరాలు చేసుకున్న ప్రభా.. చింతామణి కుట్ర తెలిసిపోతుందా..? బాలుకు షాక్..

Podarillu Today Episode : విగ్నేశ్వరి దెబ్బకు మహా ఫ్యూజుల్ అవుట్.. మహా కోసం సర్ప్రైజ్ ప్లాన్.. నిజం తెలిసిపోతుందా..?

Intinti Ramayanam Today Episode: అయ్యో పాపం శ్రీయ.. పల్లవి నగలను కొట్టేసిందా..? అక్షయ్ సీరియస్..

Illu Illalu Pillalu Today Episodes: ధీరజ్ కు షాక్.. వల్లి ఫిట్టింగ్ అదిరిపోయింది.. నెక్స్ట్ ఏం జరుగుతుంది..?

Sunday Movies in Tv : ఆదివారం టీవీ సినిమాలు.. మాస్ ఫ్యాన్స్ కు పునకాలే..

Nindu Noorella Saavasam Serial Today Episode July 18th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్లాన్ ప్రకారం బుజ్జమ్మ చంపాలనుకున్న ప్రచండ

Big Stories

Advertisement
×