E-Paper
Advertisement

Viral Video: రైలు ఇంజిన్ పైకి ఎక్కిన మహిళ, రైల్వే స్టేషన్ లో టెన్షన్ టెన్షన్!

Viral Video:  రైలు ఇంజిన్ పైకి ఎక్కిన మహిళ, రైల్వే స్టేషన్ లో టెన్షన్ టెన్షన్!
Advertisement

Women on Train Engine: చెన్నైలోని తాంబరం రైల్వే స్టేషన్‌ లో కాసేపు తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. ఓ మహిళ ఏకంగా  రైలు ఇంజిన్ పైకి ఎక్కడంతో అందరూ షాకయ్యారు. ప్రయాణీకులు వెంటనే ఈ విషయాన్ని రైల్వే అధికారులకు చెప్పడంతో అలర్ట్ అయ్యారు. రైల్వే పోలీసుల సహకారంతో సదరు మహిళను సేఫ్ గా కిందికి దించారు. ఒకవేళ ఆ మహిళ పైన ఉన్న విద్యుత్ వైర్లను ముట్టుకుంటే బూడిదయ్యేది. కానీ, లేచిన సమయంలో బాగుండి బయటపడింది.

రైలు ఇంజిన్ ఎక్కిన గుర్తు తెలియని మహిళ

Advertisement

రైలు వచ్చి స్టేషన్ లో ఆగిన వెంటనే ఓ మహిళ నేరుగా రైలు ఇంజిన్ మీదికి ఎక్కింది. పైకి ఎక్కి అటు ఇటూ చూస్తూ ఉంది. అంతేకాదు, ఇంజిన్ మీద ఉన్న కరెంటు తీగలను పట్టుకునే ప్రయత్నం చేసింది. ప్లాట్ ఫారమ్ మీద ఉన్న ప్రయాణీకులు గమనించి వెంటనే రైల్వే అధికారులకు సమాచారం అందించారు. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ తో పాటు ప్రభుత్వ రైల్వే పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రెస్క్యూ టీమ్ కూడా స్పాట్ కు చేరుకుంది. వెంటనే, అధికారులకు సమాచారం అందించింది కరెంటు సరఫరాను నిలిపివేయించారు. ఆ తర్వాత  ఇంజిన్ పైకి ఎక్కి సదరు మహిళకు ఎలాంటి హాని కలగకుండా కిందికి దించారు. ఆ తర్వాత ఆమెను ఓ ఆశ్రమానికి తరలించారు.  ఆమెకు సంబంధించిన ఎలాంటి వివరాలు తెలియదని రైల్వే అధికారులు తెలిపారు. ఆమె మతి స్థిమితం బాగాలేని కారణంగానే రైలు ఇంజిన్ పైకి ఎక్కినట్లు గుర్తించారు. త్వరలోనే పూర్తి వివరాలు తెలుస్తాయన్నారు. ఈ ఘటనతో కాసేపు రైళ్ల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తాయి.

కొద్ది రోజుల క్రితం పట్టాల మీద కారు నడిపిన యువతి

Advertisement

గత నెలలో తెలంగాణలో ఆశ్చర్యకర ఘటన జరిగింది. కొండకల్ రైల్వే గేట్- శంకర్‌పల్లి మధ్య రైల్వే పట్టాల మీదికి ఓ యువతి తన కారును ఎక్కించింది. ఈ నేపథ్యంలో పలు రైల్వే సేవలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది.  సదరు యువతి శంకర్‌పల్లి నుంచి హైదరాబాద్ వైపు నేరుగా పట్టాలపై కారు నడుపుతున్నట్లు గుర్తించారు. రైల్వే సిబ్బంది ఆమెను ఆపడానికి ప్రయత్నించినప్పటికీ,  అత్యంత వేగంతో ముందుకు వెళ్లిపోయింది. ముందు జాగ్రత్త చర్యగా అధికారులు ఎదురుగా వస్తున్న రైలును ఆపారు. ఈ ఘటనతో ఇతర రైళ్లపై తీవ్ర ప్రభావం పడింది. పలు రైళ్లు ఆలస్యంగా నడవాల్సి వచ్చింది. బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు వచ్చే రైళ్లలోని ప్రయాణీకులు ఇబ్బందులు పడ్డారు. సగటున, పలు రైళ్లు 45 నిమిషాల పాటు ఆలస్యం అయ్యాయి.

సుమారు గంట పాటు ఇబ్బందులు

సదరు యువతి వాహనాన్ని ఆపి పట్టాల పై నుంచి కారును క్లియర్ చేయడానికి దాదాపు గంట సమయం పట్టింది. ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో ఆమె మద్యం సేవించి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వైద్య పరీక్షల కోసం హాస్పిటల్ కు తరలించారు. అక్కడి నుంచి రైల్వే అధికారులు ఆమెను స్టేషన్ కు తరలించారు. ఆమెపై పలు రైల్వే సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

Read Also: ఆ నగరాలకూ బుల్లెట్ రైళ్లు.. జాబితాలో ఏపీ, తెలంగాణ ఉన్నాయా? ప్రాజెక్ట్ డిటైల్స్ ఇవే!

Related News

ఈ తప్పులు చేస్తే తిరుమలలో రూమ్ దొరకదు.. టీటీడీ కొత్త గైడ్‌లైన్స్ ఇవే!

చివరి నిమిషంలోనూ కన్ఫర్మ్ సీట్.. రైల్వేలో సీక్రెట్ రూల్ గురించి తెలుసా?

12 రోజుల ఆధ్యాత్మిక యాత్ర.. అదీ EMIలో.. IRCTC ప్యాకేజ్ అదిరింది భయ్యా!

నల్లగొండ జిల్లాలో దాగిన ఉన్న అద్భుతాలు.. ఒక్కో చోట ఒక్కో విశేషం!

దుబాయ్ 5 ఏళ్ల మల్టిపుల్ ఎంట్రీ విజిట్ వీసా.. తక్కువ ధరలోనే.. భారతీయులకు అర్హత వివరాలు

హోటళ్లలో చెక్ ఇన్.. చెక్ అవుట్ ఆ సమయాల్లో ఎందుకు? దీని వెనుక అసలు కారణాలివే?

తాజ్ మహల్ కింద ఉన్న ఆ 22 గదులను ఎందుకు తెరవరు? నిజంగానే అక్కడ నిధులు, విగ్రహాలు ఉన్నాయా?

మాన్సూన్ రోడ్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ క్రేజీ రివర్‌ సైడ్ స్పాట్స్ అస్సలు మిస్ అవ్వకండి!

Big Stories

Advertisement
×