E-Paper
Advertisement

Ajanta Express: మెదక్ లో అకస్మాత్తుగా ఆగిపోయిన అజంతా ఎక్స్‌ ప్రెస్, గంటల తరబడి ప్రయాణీకుల అవస్థలు!

Ajanta Express: మెదక్ లో అకస్మాత్తుగా ఆగిపోయిన అజంతా ఎక్స్‌ ప్రెస్, గంటల తరబడి ప్రయాణీకుల అవస్థలు!
Advertisement

Ajanta Express Engine Problem:

అజంతా ఎక్స్ ప్రెస్ రైలు ప్రయాణ సమయంలోనే అకస్మాత్తుగా నిలిచిపోయింది. మెదక్ జిల్లా అక్కన్నపేటలో ఈ ఘటన జరిగింది. సుమారు 5 గంటల పాటు రైలు ఆగిపోయింది. వెంటనే స్పందించిన అధికారులు మరో ఇంజిన్ తెప్పించి రైలు అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇంజిన్ లో సాంకేతిక సమస్యల కారణంగానే ఆగిపోయినట్లు అధికారులు వెల్లడించారు. టెక్నికల్ టీమ్ స్పాట్ కు చేరుకుని బాగు చేసేందుకు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. ఈ నేపథ్యంలో మరో రైలు ఇంజిన్ ను తీసుకొచ్చి రైలును అక్కడి నుంచి పంపించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. సికింద్రాబాద్ నుంచి ఇంకో రైలును ఇంజిన్ ను తీసుకెళ్తున్నారు.

ప్రయాణీకుల అవస్థలు..

అక్కన్న పేటలో అంజతా ఎక్స్ ప్రెస్ సుమారు 5 గంటలకు పైగా నిలిచిపోవడంతో రైల్లోని ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా చిన్న పిల్లలు, మహిళలు పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారింది. రైలును అక్కడి నుంచి తరలించేందుకు అధికారులు ప్రయత్నాలు స్పీడప్ చేశారు. మరికొద్ది సేపట్లో రైలు ప్రయాణం మొదలయ్యే అవకాశం ఉన్నట్లు  వెల్లడించారు.

అజంతా ఎక్స్‌ ప్రెస్ గురించి..  

Advertisement

ఇక అజంతా ఎక్స్‌ ప్రెస్ తెలంగాణలోని  కాచిగూడ జంక్షన్ నుంచి మహారాష్ట్రలోని  మన్మాడ్ జంక్షన్ వరకు ప్రతిరోజు నడుస్తుంది. సౌత్ సెంట్రల్ రైల్వే నడిపించే ఈ రైలు.. మరాఠ్వాడ ప్రాంతం, తెలంగాణను కనెక్ట్ చేస్తుంది. మొత్తం 676 కిలో మీటర్ ప్రయాణిస్తుంది.  అజంతా గుహల పేరిట దీనికి అజంతా ఎక్స్‌ ప్రెస్ అని పేరు పెట్టారు. ఈ రైల్లో మొత్తం 22 కోచ్ లు ఉంటాయి. AC 2-టైర్, AC 3-టైర్, స్లీపర్, జనరల్, ఫుడ్ ప్యాంట్రీ కార్ కోచ్ లు ఉంటాయి

అంజతా ఎక్స్ ప్రెస్ షెడ్యూల్ వివరాలు..

⦿కాచిగూడ-మన్మాడ్ అంజంతా ఎక్స్ ఎక్స్ ప్రెస్(17063) రైలు ప్రతి రోజు సాయంత్ర 6.25 గంటలకు కాచిగూడ నుంచి బయల్దేరుతుంది. మరుసటి రోజు ఉదయం 10.25 గంటలకు మన్మాడ్ చేరుకుంటుంది.

Advertisement

⦿ మన్మాడ్- కాచిగూడ అంజంతా ఎక్స్ ఎక్స్ ప్రెస్(17064) రైలు ప్రతి మధ్యాహ్నం 1.30 గంటలకు మన్మాడ్ నుంచి బయల్దేరుతుంది. మరుసటి రోజు ఉదయం 10.25 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది.

అజంతా ఎక్స్ ప్రెస్ ఏ స్టేషన్లలో ఆగుతుందంటే?

ఇక అజంతా ఎక్స్ ప్రెస్ కాచిగూడ, మల్కాజ్‌ గిరి, కామారెడ్డి, నిజమాబాబ్, ముద్ఖేడ్, నాందేడ్, పర్బణితో పాటు, మన్మాడ్ లో ఆగుతుంది. ఈ రైలు 1990లలో మొదలైంది. ముద్ఖేడ్-సికింద్రాబాద్ లైను మీటర్ గేజ్ నుంచి బ్రాడ్ గేజ్‌కు మార్చిన తర్వాత 2007లో  దీని రూట్ మారింది. మొదట్లో వికారాబాద్-పరళి మార్గంలో నడిచింది. ఆ తర్వాత నిజామాబాద్-ముద్ఖేడ్ మార్గానికి మార్చారు. కర్నాటక, తెలంగాణ మధ్య రాకపోకలకు ఈ రైలు ఎంతగానో ఉపయోగపడుతుంది.

Read Also: పండుగ వేళ 973 ప్రత్యేక రైళ్లు, ప్రయాణీకులకు సౌత్ సెంట్రల్ రైల్వే గుడ్ న్యూస్!

Related News

వందే భారత్ రైళ్లలో రొటేటింగ్ సీట్లు తొలగింపు? ఈ 3 సమస్యలే కారణమట!

వందే భారత్ రైలు చక్రాలకు తాళాలు వేసిన లోకో పైలెట్.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 250కి పైగా వందే భారత్ స్లీపర్ రైళ్లు వచ్చేస్తున్నాయ్!

ప్రయాణికులకు అలర్ట్.. 36 రోజుల పాటు రైళ్లకు అంతరాయం!

రైలులో సిగరెట్ తాగిన వేస్ట్ ఫెలో.. ఒక్కసారే రైల్లో అలజడి, ఏమైందా అని చూస్తే..

రూ.50 వేల బడ్జెట్‌లో ఫారిన్ ట్రిప్.. భారతీయుల కోసం ఈ 7 దేశాలు బెస్ట్

200 ఏళ్ల తర్వాత ఆ ఇంట్లో ఆడపిల్ల.. రథంపై ఊరేగించి ఘన స్వాగతం!

అందంగా కనిపిస్తాయి.. కానీ, అడుగు పెడితే అంతే సంగతులు!

Big Stories

Advertisement
×