Vishnu Priya Attends CID Hearing: బెట్టింగ్ యాప్ కేసులో పలువురు సినీ ప్రముఖుల ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. హీరో రానా, విజయ్ దేవరకొండ, ప్రకాశ్ రాజ్, మంచు లక్ష్మి, యాంకర్ విష్ణు ప్రియ, రీతూ చౌదరి ఇలా పలువురిపై కేసు కూడా నమోదైంది. ఇప్పటికే ఈ కేసులో పోలీసులు వీరిని విచారించి వారి స్టేట్ మెంట్ ని నమోదు చేశారు. ఇప్పటికే రానా నుంచి యాంకర్ విష్ణు ప్రియ వరకు పలువురు సీఐడీ విచారణకు హాజరయ్యారు.
తాజాగా మరోసారి ఈ కేసులో సీఐడీ విచారణకు పిలిచింది. ఈ క్రమంలో నేడు (శనివారం) సీఐడీ విచారణ యాంకర్ విష్ణు ప్రియ మరోసారి హాజరైంది. కాసేపటి క్రితం సీఐడీ కార్యాలయంలో సిట్ ఆమెను విచారించింది. ఈ సందర్భంగా విష్ణు ప్రియ మూడు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినట్టు అధికారులు గుర్తించారు. వీటికి సంబంధించి లావా దేవీలపై ఆరా తీశారు. అంతేకాదు ఆమె బ్యాంక్ అకౌంట్ వివరాలతో పాటు బ్యాంక్ స్టేట్మ్మెంట్ వివరాలను విష్ణు ప్రియ సీఐడీ సిట్ అందజేసినట్టు సమాచారం. బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ కోసం ఎంత తీసుకుంది, వాటి ద్వారా ఎంత సంపాదించింది వంటి ఆదాయంపై సిట్ విష్ణు ప్రియను విచారించినట్టు తెలిసింది.
Also Read: Actor Rayjan Rajan: అశ్లీల మెసేజ్ లు.. ఆరేళ్లుగా నటుడికి మహిళ వేధింపులు!
అలాగే స్టార్ హీరో రానా కూడా నేడు సిట్ విచారణకు హాజరైనట్టు తెలుస్తోంది. రానా నుంచి బ్యాంక్ ఖాతాలు, స్టెట్మెంట్ తీసుకున్నట్టు సమాచారం. కాగా ఈ బెట్టింగ్ యాప్ కేసులో టాలీవుడ్ నటీనటులు, యూట్యూబర్స్, సోషల్ మీడియా ఇన్ప్లూయేన్స్ ర్ ఇలా మొత్తం 29 మందిపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. వీరిలో రానా, మంచు లక్ష్మి, విజయ్ దేవరకొండ, ప్రకాశ్ రాజ్, నిధి అగర్వాల్, అనన్య నాగళ్ల, శ్రీముఖీలపై కేసు నమోదు చేయగా ఇటీవల సిట్ విచారణకు ప్రకాశ్ రాజ్ హాజరైన సంగతి తెలిసిందే.