Brahmamudi Serial : ప్రముఖ తెలుగు చానల్స్ స్టార్ మాలో ప్రసారం అవుతున్న టాప్ రేటింగ్ సీరియల్స్ లో బ్రహ్మముడి సీరియల్ కూడా ఒకటి.. ఒకప్పుడు ఈ సీరియల్ కి ఉన్న క్రేజ్ తో మంచి టిఆర్పి రేటింగ్ ని సొంతం చేసుకుంది. ప్రతిరోజు డిఫరెంట్ ట్విస్టులతో జనాల ముందుకు వచ్చిన ఈ సీరియల్ మంచి రేటింగ్ కూడా నమోదు చేసుకుంటూ వచ్చింది. అయితే ఈమధ్య సీరియల్ పరిస్థితి కాస్త దారుణంగా ఉందని చెప్పాలి.. ముందున్న క్యారెక్టర్లు చనిపోవడంతో కొత్త క్యారెక్టర్లు ఎంట్రీ ఇచ్చారు.. వీళ్ళ మధ్య కన్వర్జేషన్ సరిగ్గా లేకపోవడంతో స్టోరీ కాస్త బోరింగ్ అనిపిస్తుందని జనాల నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈమధ్య సీరియల్ కి శుభం కార్డు పడిపోయింది అంటూ చాలాసార్లు సోషల్ మీడియాలో వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఇప్పుడు మరోసారి సీరియల్ పడబోతుంది అంటూ ఓ వార్త షికారు చేస్తుంది. అందులో నిజం ఎంత ఉందో ఇప్పుడు ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం..
ప్రస్తుతం ప్రసారమవుతున్న బ్రహ్మముడి సీరియల్ స్టోరీ విషయానికి వస్తే ఇందు రాజ్ వివాహం చేసుకుంటారు. ఒకసారి బ్రహ్మముడి పడితే వాళ్ళిద్దరిని విడగొట్టడం ఎవరి వల్ల కాదు అని హైలెట్ గా చూపించారు. వీరిద్దరి మధ్య జరిగిన పెళ్లి కొంచెం కొత్తగా ఉన్నా సరే స్టోరీలో పెద్దగా ట్విస్టులు లేకపోవడంతో జనాలు దీన్ని చూసేందుకు ఇంట్రెస్ట్ చూపించడం లేదని తెలుస్తుంది. అందుకే ఈ మధ్యకాలంలో కొన్ని ఎపిసోడ్లు హైలైట్ గా నిలిచినా సరే టిఆర్పి రేటింగ్ మాత్రం పెద్దగా పెరిగినట్టు కనిపించలేదు.. కాన్సెప్ట్ కొత్తగా ఉండాలని క్రియేట్ చేసిన కూడా అధి కాస్త తేడా కొట్టడంతో జనాలు దీన్ని చూడకుండా కొత్త సీరియల్స్ పై మొగ్గు చూపిస్తున్నారు.. దాంతో సీరియల్ పరిస్థితి దారుణంగా మారింది అని తెలుస్తూనే ఉంది. అందుకే ఈ సీరియల్ ప్లేస్ లో కొత్త సీరియల్ ని తీసుకురావడానికి స్టార్ మా యాజమాన్యం కసరత్తులు చేస్తున్నట్లు ఓ వార్త వినిపిస్తుంది. ఇదే కనుక నిజమైతే ఈ సీరియల్ కి త్వరలోనే శుభం కార్డు పడిపోతుంది అని మరో వార్త కూడా ప్రచారంలో ఉంది.. ఏది ఏమైనా కూడా దీనిపై ఒక క్లారిటీ రావాలంటే ఇంకొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే..
Also Read :‘ఇల్లు ఇల్లాలు పిల్లలు ‘ టీఆర్పీ రేటింగ్.. మే హైలెట్ ఎపిసోడ్స్..
సీరియల్ నటుడు మానస్, తమిళ బుల్లితెర నటి దీపిక రంగరాజు ప్రధాన పాత్రలో నటించిన ఈ సీరియల్ మొదలైన కొద్ది రోజుల్లో మంచి క్రేజ్ ని సంపాదించుకుంది. కానీ కొద్దిరోజులు బాగానే సాగిన స్టోరీ ఇప్పుడు కాస్త బోరింగ్ గా ఉంది అని జనాల నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. డైరెక్టర్ ఏదో ప్లాన్ చేసి ఇంకాస్త హైప్ ని క్రియేట్ చేయడానికి కొత్త క్యారెక్టర్ అని ఎంటర్ అయ్యేలా చేశాడు.. క్యారెక్టర్ వల్ల జనాలకు విపరీతంగా విసుగు పుట్టింది అని నెట్టింట కామెంట్స్ ని బట్టి చూస్తే అర్థమవుతుంది. సింక్ లేకుండా జరిగిన ఈ స్టోరీ ప్రస్తుతం ఏదో ప్రసారమవుతుంది. స్టోరీలో పస లేకపోవడంతో ఈ సీరియల్ కి రేటింగ్ కూడా ఈ వారం బాగా తగ్గినట్లు తెలుస్తుంది. మరి డైరెక్టర్ చేసిన ఈ మిస్టేక్ ని మళ్లీ కరెక్ట్ చేస్తాడా? లేదంటే శుభం కార్డు వేస్తాడా అన్నది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది.. ఏది ఏమైనా కూడా మరి కొద్ది రోజుల్లో ఈ సీరియల్ గురించి పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది..