Illu Illaalu pillalu : తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకునేలా సీరియల్స్ ని అందిస్తున్న చానల్స్ లలో స్టార్ మా చానల్ ఒకటి.. ఈమధ్య ఈ ఛానల్ లో ప్రసారమవుతున్న ప్రతి సీరియల్ కూడా జనాలని బాగా ఆకట్టుకుంటున్నాయి.. ఇక్కడ ప్రసారమవుతున్న ప్రతి సీరియల్స్లలో టాప్ రేటింగ్ లో దూసుకుపోతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు. ఒక అనాధ అయిన వ్యక్తి ఒక కుటుంబాన్ని ఏర్పరచుకుంటాడు.. తన ముగ్గురు కొడుకులు తనని వదిలిపెట్టి వెళ్ళిపోకూడదని ఆ తండ్రి అనుక్షణం ఆరాటపడుతూ ఉంటాడు. అలాంటి తండ్రి కొడుకుల కోసం ఏం చేసినా సరే కొంతమంది మాత్రం అతను ఎక్కువ చేస్తున్నాడు అని అంటుంటారు. బొమ్మరిల్లు సినిమాని ఇక్కడ సీరియల్ గా చూపించారు అని నెటిజన్లు కూడా కామెంట్లు పెడుతున్నారు.. ప్రస్తుతం ఈ స్టోరీ కాస్త బోరింగ్ గా ఉండడంతో సీరియల్ కి శుభం కార్డు పడిపోతుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.. నిజంగానే సీరియల్ ఎండ్ అవుతుందా..? అయితే మరి ఏ సీరియల్ ఈ సీరియల్ ప్లేస్ లోకి వచ్చే అవకాశం ఉంది అన్నది మనం ఒకసారి వివరంగా తెలుసుకుందాం..
ప్రస్తుతం ఈ సీరియల్ స్టోరీలో సాగర్ ఐదు లక్షలు ఇవ్వడానికి టైం అడుగుతాడు. కానీ భాగ్యం ప్రసాదరావుని రెచ్చగొట్టడంతో ఆ ఐదు లక్షలు సాగరకి ఇస్తాడు. అయితే ఆ డబ్బులు నీ తీసుకొని సాగర్ రామరాజు మొహం పై విసిరి కొడతాడు. ఇక నర్మదా సాగర్ ఇంట్లోంచి వెళ్లిపోవాలని అనుకుంటారు.. రామరాజు నువ్వు నీ పెళ్ళాన్ని తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అంటాడు. ఇక నర్మదా ఎంత చెప్తున్నా సరే సాగర్ మాత్రం అసలు వినకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలని అనుకుంటాడు.. శ్రీవల్లి తన కడుపు అబద్ధమని ఎక్కడ తెలిసిపోతుందని కంగారు పడిపోతూ ఉంటుంది. కానీ నర్మదా సాగర్ ఇంట్లోంచి వెళ్లిపోవడం తన తల్లి ప్లాన్ ని తెలుసుకొని చాలా సంతోషంగా ఉంటుంది. ధీరజ్ ఒక్కడే సాగర్ నీ ఇంట్లో నుంచి వెళ్ళనివ్వకుండా ఆపుతాడని అర్థమవుతుంది. అటు చందు శ్రీవల్లి వాళ్ళ మాటలు విని తన కడుపు గురించి బయటపడడంతో తనని మళ్లీ ఇంట్లో నుంచి బయటికి గెంటేసే అవకాశాలు కూడా ఉన్నాయని తెలుస్తుంది. ఎటు చూసినా కూడా ఈ సీరియల్ శుభం కార్డు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సోషల్ మీడియాలో ఫాన్స్ కామెంట్లు పెడుతున్నారు. ఇప్పటికే సుకన్య అనే కొత్త క్యారెక్టర్ అని దించారు. ఇకముందు మరో కొత్త క్యారెక్టర్ ఏమైనా తీసుకొస్తారా లేదంటే అందరూ అనుకున్నట్లే సీరియల్ కి శుభం కార్డు పడిపోతుందా అన్నది మరికొద్ది రోజుల్లో తెలిసే అవకాశం ఉంది.
Also Read :ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను హర్ట్ చేసిన డైరెక్టర్ .. మళ్ళీ అదే ఫార్మాట్ లో గ్లింప్స్..
స్టార్ మా ఛానల్ ఎప్పటికప్పుడు కొత్త సీరియల్స్ ని ప్రచారం చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది.. ప్రతి మూడు నెలలకు ఒకసారి కొత్త సీరియల్ అనేది ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తూ ఉంటుంది. అయితే ఇప్పటివరకు ఉన్న సీరియల్స్ టైమింగ్స్ మారిన విషయం తెలిసిందే. ఒకవేళ ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ కనుక శుభం కార్డు వేసుకుంటే, ఈ సీరియల్ స్థానంలోకి గోదావరి టు అనే కొత్త సీరియల్ వచ్చే అవకాశాలు ఉన్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.. మరి ఈ సీరియల్ కాకుండా ఇంకేదైనా కొత్త సీరియల్ వస్తుందేమో చూడాలి. ఏది ఏమైనా కూడా ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియలు ఎండ్ అవుతుంది అని వార్తలు వినిపించడంతో అభిమానులు చాలా ఫీల్ అవుతున్నారు.. ఏం జరుగుతుందో మరో వారం రోజుల్లో తెలిసే అవకాశం ఉంది.