Gundeninda GudiGantalu Today episode march 19th: నిన్నటి ఎపిసోడ్ లో.. అందరూ కలిసి పార్టీ స్టార్ట్ అవుతుందని చాలా సంతోషంగా ఉంటారు బాలు మీనా ఇద్దరు కూడా చాలా సంతోషంగా ఫోటోలు దిగుతుంటే ఫోన్ కింద పడిపోతుంది. విద్య రోహిణి అక్కడికి రావడంతో బాలు మాత్రం ఆ ఫోన్ ఇవ్వడానికి అస్సలు ఒప్పుకోడు. ఏంటి ఎప్పుడు లెండి ఇప్పుడు కొత్తగా ఇలా మర్యాదలు చేస్తున్నారు ఏమైంది మీకు అని బాలు అనుమానంగా అడుగుతాడు.. కింద పడింది కదా అని ఇద్దామని అనుకున్నాను అంతే అని విద్య అంటుంది.. అప్పుడే అక్కడికి వచ్చిన రోహిణి ఫోన్ పగిలినట్టు ఉంది ఒకసారి ఇలా ఇవ్వు బాలు చూస్తాను అని అంటుంది.. మీ ఇద్దరి ఫోటోలు లేదు తీస్తాడు ఇవ్వు అనగానే మాకేం వద్దు మేము సెల్ఫీలు తీసుకుంటామని బాలు మీనా ఇద్దరు అంటారు..
ఇవాళ బాలు మనకు దొరికేలా కనిపించడం లేదు అని రోహిణి అనుకుంటుంది. ఆ తర్వాత నువ్వు ఎటు పీక్కోలేక చచ్చిపోవాలి అని విద్య అంటుంది. ఎలాగైనా సరే ఇవాళ బాలు దగ్గర నుంచి ఫోన్ కొట్టేసి ఆ వీడియోని కొట్టేయాలి అని రోహిణి అంటుంది. విద్య మాత్రం వాళ్ళిద్దరూ చాలా బాగున్నారు బాలు ఎంత అందంగా ఉన్నాడు అని అంటుంది. తనకి పార్టీ చాలా గ్రాండ్ గా జరిగిందని ప్రభావతి సత్యం ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు.. బాలుని ఎంతగా తాగొద్దని వార్నింగ్ ఇచ్చిన సరే బాలు కంట్రోల్ చేసుకోలేక పోతాడు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. బాలు ఫారిన్ బ్రాండ్ ఎలా ఉంటుంది అని మణికంఠను అడిగి తెలుసుకుంటాడు.. మొత్తానికి బాలు తాగడానికి ఫిక్స్ అవుతాడు.. భోజనాలు చాలా బాగున్నాయి నీ ప్రభావతి సత్యం కామాక్షి ముగ్గురు మాట్లాడుకుంటూ వెళ్తారు.. బాలు మీనా ఇక ఇంటికి వెళ్దాం పదండి అని అనగానే.. నువ్వు ఇక్కడ ఉండకపోతే మీ ముగ్గురు మధ్య ఏదో గొడవలు ఉన్నాయని వాళ్ళు అనుకుంటారు. నువ్వు ఇక్కడే ఉండాలని అంటాడు. ఆ తర్వాత ప్రభావతి నువ్వు ఏదైనా అనగానే అంటుంది.. ఇక ముఖేష్ పార్టీకి మనోజ్ నీ రమ్మని పిలుస్తాడు. ముఖేష్ రాదని మణికంఠ అతనికి మందు సర్వ్ చేస్తాడు. మనోజ్ ఎంత వద్దని చెప్పినా సరే అతను వినకుండా మందు పోస్తాడు. మనోజ్ మందు తాగడం వద్దని అంటున్న కూడా అతను బలవంతం చేయడంతో తాగుతాడు.
ఇక అక్కడికొచ్చిన రవి నాన్న ఏం చెప్పాడురా ఎందుకు ఇలా తాగుతున్నావు అని మనోజ్ ని అంటున్నా సరే. అతను పార్టికల్చర్ తెలియదా అని అంటున్నాడు అందుకే తాగుతున్నాను అని మనోజ్ అంటాడు. అవును అంత పెద్ద హోటల్ కి ఓనర్ అయ్యుండి మీరు పార్టీ కల్చర్ తెలియకుండానే ఉన్నారా మీరు కూడా తాగాల్సిందేనని ముఖేష్ అనడంతో రవికి కూడా పెగ్గు కలిపి పోస్తారు. ఇక మీనా బాలు వాళ్ళు ఎక్కడున్నారో తెలుసుకోవాలని అనుకుంటారు. ఎక్కడున్నారు నేను చూసొస్తాను మీరు ఇక్కడే ఉండండి అని రోహిణి అంటుంది.. రోహిణి బాలు చేత ఎలాగైనా తాగించి ఫోన్ కొట్టేయాలి అని అనుకుంటుంది. మొత్తానికి బాలు తాగడం మొదలుపెట్టడం చూసి రోహిణి చాలా సంతోషంగా ఉంటుంది.
బాలు ఎంతగా వద్దని చెప్పినా సరే ఆ ముఖేష్ బలవంత పెట్టి తాగాల్సిందేనని కూర్చుంటాడు. ఏంటి నన్ను తాగొద్దని అంటున్న కూడా మీరు తాగమని బలవంతం చేస్తున్నారు అని అనగానే రవి.. మా అన్నయ్య ఒక పెగ్గుతో తాగడు అసలు ఆగడు మొత్తం తాగేస్తాడు అని రవి అంటాడు. ఇక బాలుకి పెగ్గు కలపగానే క్షణాల్లో పెగ్గు తాగేస్తాడు. మళ్లీ పోయేలా అని అంటే పొయ్యడం ఎందుకు నేనే పోసుకుంటాను అని అక్కడున్న బాటిల్ నెత్తి మొత్తం తాగేస్తాడు. బాలు ఇక పాటలతో రచ్చ రచ్చ చేస్తాడు. అయితే విద్య ఇదే కరెక్ట్ టైం అని తన ఫోన్ కొట్టేయాలని అనుకుంటుంది.. అయితే వీడియో తీస్తాను అని విద్య ఫోన్ తీసుకొని వస్తుంది కానీ మళ్ళీ బాలు వచ్చి వెంటనే ఫోన్ తీసుకొని వెళ్ళిపోతాడు.
Also Read :శైలుకు దిమ్మతిరిగే ట్విస్ట్.. కన్నీళ్లు పెట్టుకున్న గాయత్రి.. మాధవ్ పెళ్లి కోసం మహా నిర్ణయం..?
ఇక ముగ్గురు కూడా కంట్రోల్ లేకుండా తాగేస్తారు. ముఖేష్ కి అసలు నిజాన్ని చెప్పేస్తాడు బాలు రవి. మేము మీరు అనుకున్నట్టు పెద్దవాళ్ళం కాదు మామూలు వాళ్ళము అని చెప్పగానే ముఖేష్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ ముఖేష్ కి ఏం చెప్పారు అతను ఇకనుంచి వెళ్ళిపోయాడు ఏంటి అని మనోజ్ అడుగుతాడు. ముగ్గురూ కలిసి ఇంటికి వెళ్లడానికి వచ్చేస్తారు. వాళ్ళ భార్యలు వాళ్ళని మోయలేక చచ్చిపోతారు. ఎలాగోలాగా ఇంటికి తీసుకొని వెళ్తారు అయితే మనోజ్ దగ్గర వేసిన బాలు ఫోన్ని రోహిణి కొట్టాలని అనుకుంటుంది. కానీ మనోజు ఆ ఫోన్ ని తీసుకుని ఇవ్వకుండా అడ్డుపడతాడు. ఆ తర్వాత ఇంట్లోకి వెళ్ళగానే సత్యం ప్రభావతి ఇద్దరూ కూడా ముగ్గురు. సత్యం వాళ్ళ ముగ్గురిని చూసి ఏంట్రా ఇలా తాగారు అంటూ సీరియస్ అవుతాడు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్లో బాలు నిజం చెప్పిన విషయం మనోజ్ కి తెలిసిపోతుంది ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి…