Guppedantha Manasu Rishi : బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న వాటిలల్లో సీరియల్స్ ముందు వరుసలో ఉంటాయన్న విషయం తెలిసిందే.. ఒకప్పుడు సీరియల్స్ ఒకే స్టోరీ లైన్ ని సాగదీసి మరీ చూపించేవారు. ఈమధ్య వచ్చే సీరియల్స్ మాత్రం సినిమాలను మించిన ట్విస్టులతో, యాక్షన్ సీన్లతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. దాంతో ఆడవాళ్లు మాత్రమే కాదు మగవాళ్ళు కూడా సీరియల్స్ ను చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ప్రస్తుతం స్టార్ మా లో ప్రసారమవుతున్న ప్రతి సీరియల్ కూడా జనాలను బాగా అలరిస్తూ వస్తుంది.. ఈ ఛానల్ లో ప్రసారమైన సీరియల్స్ లలో గుప్పెడంత మనసు సీరియల్ కూడా ఒకటి. ఇందులో హీరో రిషి పాత్రలో ముకేష్ గౌడ నటించారు. ఈ సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో దీనికి సీక్వెల్ గా మరో సీరియల్ రాబోతుందని గతంలో వార్తలు వినిపించాయి.. ఇదిలా ఉండగా ఈ సీరియల్ హీరో ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పబోతున్నట్లు ఓ వార్త చక్కర్లు కొడుతుంది. అందులో నిజమేంత ఉందో ఒకసారి తెలుసుకుందాం..
ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న టాప్ రేటింగ్ సీరియస్లలో గుప్పెడంత మనసు సీరియల్ కూడా ఒకటి. ఇందులో హీరో పాత్రలో నటించిన వ్యక్తి రిషి అలియాస్ ముఖేష్ గౌడ. ఈయన బుల్లితెర సీరియల్స్ ద్వారా బాగా పాపులర్ అయ్యాడు. ఈ సీరియల్ తర్వాత వెండితెరపై అడుగుపెట్టాడు.. గీతా శంకర్ సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. అయితే ఈ సినిమా షూటింగ్కి గ్యాప్ రావడంతో ఇక సీరియల్ కి రాడు అని అందరూ అనుకున్నారు. ఇక సినిమాలు మాత్రమే చేస్తానని ఆ మధ్య ముఖేష్ కూడా అనడంతో ఇక సీరియల్స్ కంప్లీట్ గా మానేసాడని అందరూ ఫిక్స్ అయ్యారు. అయితే ఈ మధ్య అతని కన్నతండ్రి చనిపోయిన తర్వాత సినిమాలకు కూడా దూరంగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దాంతో ఈ హీరో ఇక నటనకు గుడ్ బై చెప్పేసాడు అన్న వార్తలు సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్నాయి.. ఇందులో నిజం ఎంత ఉందో తెలియదు కానీ ప్రస్తుతం స్క్రీన్ పై ఈ హీరో కనిపించకపోవడంతో ఆ మాట వాస్తవమని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇందులో నిజం ఎంత ఉందో తెలియాలంటే ఈ హీరో రెస్పాండ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే..
Also Read :పాన్ ఇండియా సినిమాలకు షాక్ .. 3 రోజుల్లోనే చిరు మూవీ నయా రికార్డ్..
గుప్పెడంత మనసు సీరియల్ కార్తీకదీపం సీరియల్ తో పోటీపడి మరి ప్రేక్షకులను అలరించింది అని చెప్పడంలో సందేహం లేదు.. లవ్ స్టోరీ తో జనాలను ఆకట్టుకున్న ఈ సీరియల్ కు సీక్వెల్ గా మరో సీరియల్ రాబోతుందని ఓ వార్త ఇండస్ట్రీలో వినిపిస్తుంది. కేవలం హీరో మాత్రమే కాదు ఈ సీరియల్ హీరోయిన్ రక్షా గౌడ కూడా ఆ తర్వాత ఏ ఒక్క సీరియల్ లోను కనిపించలేదు. కేవలం కన్నడ ఇండస్ట్రీలో మాత్రమే పలు సీరియల్స్ వాళ్ళు నటిస్తూ బిజీగా ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. మరి వీళ్ళిద్దరూ కలిసి మరోసారి ప్రేక్షకులను అలరిస్తారేమో చూడాలి. ఇక ముఖేష్ మొదటి సీరియల్ తోనే మంచి రెమ్యూనరేషన్ ని కూడా అందుకున్నాడు. రోజుకు గాను ఈయన దాదాపు 40 వేలు అందుకున్నారు. బుల్లితెరపై ప్రసారమయ్యే సీరియల్స్ అన్నీ కూడా ప్రతిరోజు షూటింగ్ ఉండడంతో రెమ్యూనరేషన్ నెలకు లక్షల్లో ఉంటుందని చెప్పనక్కర్లేదు. బుల్లితెరా కనిపించే హీరోలు కన్నా బుల్లితెరపై కనిపించే హీరోలే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు..