Illu Illalu Pillalu Today Episode April 21st: శ్రీవల్లి తన భర్తని ఎలాగైనా తన వైపు తిప్పుకోవాలని ప్రయత్నాలు చేస్తుంది. క్రమంలో తన భర్తని వశీకరణం చేసుకోవడానికి ఒక స్వామిజిని కలుస్తుంది ఆయన తన బాధను అర్థం చేసుకొని ఆమెకు ఒక తాయత్తు ఇస్తాడు. ఎలాగైనా సరే చందుకి కట్టాలని ఫిక్స్ అవుతుంది. సాగరు సేటు దగ్గరికి వెళ్లి డబ్బులు విసిరికొట్టి అవమానించేలా మాట్లాడుతాడు. ఆ సేటు నర్మదకు ఫోన్ చేసి అసలు విషయం చెప్పడంతో షాక్ అవుతుంది..
సాగర్ ఇంటికి రాగానే చాలా కోపంగా ఉంటాడు. నర్మదా సాగర్ దగ్గరికి వెళ్లి ఏంటి సాగర్ ఏమైంది అలా ఉన్నావు అని అడిగితే ఏం కాలేదు అని చెప్తాడు. ఎందుకు సాగర్ ఏమైంది నీ నువ్వు ఇంతగా బాధపడుతున్నావు నాకు అర్థం కావడం లేదు అని నర్మదా అంటుంది.. నన్ను మాత్రం విసిగించద్దు అని సాగర్ ఎంత చెప్తున్నా సరే నర్మదా మాత్రం నువ్వు వెళ్లి ఫ్రెష్ చేయరా నేను అన్నం పెడతాను అని పదే పదేతనని మాట్లాడేలా చేస్తుంది. నన్ను విసిగిస్తూనే ఉంటావు కాసేపు నన్ను ఒంటరిగా వదిలేయవని సాగర్ అంటాడు. ఆ మాట వినగానే నర్మదా సెట్ మీద ఉన్న కోపాన్ని నా మీద చూపిస్తావ్ ఏంటి అని అడుగుతుంది. అయితే ఈ విషయం నీకు ఎలా తెలుసు అని అడుగుతాడు..
ఆ సేటు దగ్గరికి వెళ్లి మర్యాదగా మాట్లాడకుండా డబ్బులు విసిల్ కొట్టి మాట్లాడావు. మర్యాదగా మాట్లాడాల్సింది పోయి ఎందుకు ఇలా చేశావు అని నర్మద అడుగుతుంది. ఒళ్లంతా కాలిపోతుంది టాబ్లెట్ వేసుకొమని నర్మదా సాగర్ కి ఇచ్చిన సరే తనని వేసుకొని అని అంటాడు. నర్మద మాత్రం సాగర్ కి ముద్దు పెట్టగానే నోరు తెరుస్తాడు దాంతో నోటు టాబ్లెట్ వేసి నీళ్లు పోస్తుంది నర్మదా. నీకోసం అందర్నీ వదులుకొని వచ్చాను అయితే నువ్వు ఇలా నన్ను దూరం పెడితే నేను అసలు ఊరుకోను అని అంటుంది..
వశీకరణ తాయత్తుని ఎలాగైనా సరే చందు కి కట్టాలని నర్మదా భాగ్యం ఆనందరావు రామరాజు ఇంటికి వెళ్తారు.. అక్కడ వల్లి వెళ్తే కచ్చితంగా దొరికిపోతుంది అని ఆనంద్ రావు ఆ తాయితం తీసుకుని వెళ్లి చందుకి కట్టాలని అనుకుంటాడు. ఈ క్రమంలో ఆ గదిలో పడుకుని ఉన్న తిరుపతికి ఆ తాయత్తుని కడతాడు. వెంటనే తిరుపతి అక్కడ నుంచి పరిగెత్తుకుంటూ నా వశీకరణ ఎక్కడ అని వస్తాడు. వశీకరణ తాయత్తు తేడా కొట్టేసింది అని వాళ్ళు అక్కడి నుంచి పరిగెత్తే ప్రయత్నం చేస్తారు. కానీ ఈ క్రమంలో ఇంట్లోకి వెళ్లి అడ్డంగా దొరికిపోతారు.
తిరుపతి నుంచి తప్పించుకోడానికి లోపలికి వెళ్లిన వల్లి బ్యాచ్ అక్కడ నర్మదా ప్రేమ ధీరజ్ లకు దొరికిపోతారు. వాళ్లని దొంగలు అని చెప్పి ముసుగేసి మరి వాళ్ళ ముగ్గురు ఒక్క దెబ్బతో ఆడుకుంటారు.. మీరు వశీకరణ అని చెప్పేసి ఇలా తీసుకొని వచ్చారు సిగ్గు లేదా అని ప్రేమ నర్మదా ఇద్దరు కూడా దిమ్మ తిరిగిపోయేలా వాళ్ళని తిడతారు.. ఎందుకు ఇలాంటి బుద్ధి లేని పనులు చేస్తున్నారు అని అరుస్తారు.. ఈ మాత్రం తన బాబు కోసమే నేను ఇదంతా చేశాను అని ఎమోషనల్ అయిపోతుంది.
రాత్రి రైస్ మిల్లుకు వెళ్లిన చందు ఇంటికి రాగానే నర్మదా ప్రేమలు ఒక్కసారిగా చందు బావ చాలా బాధపడుతున్నాడు అని అనుకుంటారు.. వల్లి కూడా తన భర్త కోసం చాలా ప్రయత్నాలు చేస్తుంది కదా వీరిద్దరిని కలిపే ప్రయత్నం చేద్దాం అని నర్మద ప్రేమలు అనుకుంటారు.. చందు ఇచ్చిన కాఫీ ప్లాన్ ని అమలు చేస్తారు కానీ చందు చాలా ఫీల్ అయిపోతాడు.. కాఫీ ఇవ్వగానే అందరూ అక్కడికి వెళ్లి కాఫీ ఎలా ఉంది అని అడుగుతారు. అయితే కాఫీ ఎంత బాగా పెట్టిన వల్లి ఎంత బాగా పెట్టరు అని అనగానే చందు ఒక్కసారిగా నవ్వుకున్న సరే అమూల్య విషయంలో తన చేసింది గుర్తు చేసుకుని బాధపడిపోతాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.. రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి…