Illu Illalu Pillalu Today Episode August 30th : మార్చి ఇలా మాట్లాడుతుందా అని అనుకుంటాడు. అసలు ఇది ఎందుకు ఈ ఫోన్ నుంచి ఫోన్ చేస్తుంది ఏదైనా డౌట్ వచ్చిందా అని అనుకుంటాడు.. తన ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు కాబట్టి తను ఈ ఫోన్ నుంచి చేసింది గొంతు మార్చినా కూడా దీని గొంతుని గుర్తుపట్టలేదని అనుకుంటుంది అని ధీరజ్ ప్రేమ గొంతుని గుర్తుపట్టి ఒక ఆట ఆడుకుంటారు. కానీ ప్రేమ మాత్రం ధీరజ్ ఆ అమ్మాయి మధ్యలో ఏదో ఉంది అని అనుమాన పడుతుంది. మొత్తానికి వీళ్లిద్దరు ఫైట్ కాస్త ఎపిసోడ్కి హైలైట్ గా నిలుస్తుంది. కానీ ముగ్ధ మాత్రం వీళ్ళిద్దరి మధ్య నేను ఇరుక్కున్నాను అని టెన్షన్ పడిపోతూ ఉంటుంది..
శ్రీవల్లి వేదవతి దగ్గరికి వచ్చి తిరుపతి గురించి చెప్పాలి అని అనుకుంటుంది. అయితే శ్రీవల్లి సుకన్యకు తిరుపతి గిఫ్ట్ ఇచ్చాడని తెలుసుకుని ఆ విషయాన్ని ఎలాగైనా సరే వేదవతికి తెలియజేయాలి అని వీడియో కాల్ చేసి మాట్లాడుతూ ఉంటుంది. నిజంగానే తిరుపతి బాబాయిని మోసం చేస్తున్నావా అంత లక్షలు ఖరీదు పెట్టిన చైన్ నీకెలా గిఫ్ట్ ఇచ్చారు అని మాట్లాడుతూ ఉండగా వేదవతి ఏం మాట్లాడుతున్నావే అని అంటుంది. ఇక సుకన్య చూపించిన ఆ చైన్ ని చూసి వేదవతి షాక్ అవుతుంది. ఇద్దరి అంతు చూస్తాను అని వేదవతి వార్నింగ్ ఇస్తుంది. ఆ తర్వాత ఎక్కడ దాపరించారు మీరు మా కొంపలు నాశనం చేయడానికి అంటూ శ్రీవల్లికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడంతో పాటుగా దారుణంగా తిట్టేస్తుంది వేదవతి.
అసలు రైస్ మిల్లులో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు అని వేదవతి ఆలోచిస్తూ ఉంటుంది. రైస్ మిల్లు కని వెళ్లిన వీళ్ళు ఇంకా రాలేదు ఏంటి అని వేదవతి తో పాటు బల్లి కూడా వెయిట్ చేస్తూ ఉంటుంది. ఏంటి వీలు ఇంకా రాలేదు అక్కడ ఏమి జరగలేదా దాన్యం వస్తుందని ఈయన గారు చెప్పారు కదా మరి అక్కడ డబ్బులు కోసం పెద్ద రచ్చ జరిగింది కదా అని శ్రీవల్లి అనుకుంటుంది. మీ శ్రీవల్లి అనుకున్నట్లుగానే రామరాజు చాలా కోపంగా రావడంతో శ్రీవల్లి నా ప్లాన్ సక్సెస్ అయింది అని చాలా సంతోష పడిపోతూ ఉంటుంది. రామరాజు రాగానే తను ఏదో మంచిది అన్నట్లుగా మావయ్య గారు అప్పుడే వచ్చేసారా అని ఆశీర్వాదం తీసుకుంటుంది అది చూసినా రామరాజు శ్రీవల్లి గ్రేట్ అంటూ మనసులో అనుకుంటాడు. కానీ చందు మాత్రం ఏ అవతలికి వెళ్ళు అని కసురుకుంటాడు అది చూసిన రామరాజు ఇప్పుడు తన్నెందుకు అరుస్తున్నావ్ రా అని చందు పై సీరియస్ అవుతాడు.
ఆయనొచ్చేసారు అని వేదవతి చాలా సంతోషంగా రామరాజు దగ్గరికి వెళ్ళిపోతుంది. అయితే అప్పుడే అక్కడికి వచ్చిన వల్లి మావయ్య గారి కోపం చూస్తుంటే అత్తయ్య గారికి ఈరోజు ముడినట్లే ఉంది అని ఆలోచిస్తూ ఉంటుంది. ఏవండీ మీరు వచ్చేసారా అదేంటండీ డైరెక్ట్ గా మీరు ఇంటికి రాకుండా రైస్ మిల్లులోకి వెళ్లారు అని వేదవతి మాట్లాడుతూ ఉండగా రామరాజు తన చేయని వదిలించుకొని చాలా కోపంగా ఉంటాడు అది చూసిన వేదవతే షాక్ అవుతుంది. కానీ పక్కనే ఉన్న వల్లి మాత్రం మావయ్య గారి కోపం చాలా ఎక్కువగా ఉంది అని నవ్వుకుంటూ ఉంటుంది.
రైస్ మిల్లులో ఎప్పుడు లేని ఈమధ్య డబ్బులు పోతున్నాయి నడిపాడు లాగా మీరు కూడా చేస్తున్నారా అని రామరాజు చందు పై చాలా సీరియస్ అవుతాడు. అయితే అరె తిరుపతి నువ్వేమైనా డబ్బులు తీసి ఉంటే చెప్పరా.. ఇది నీన్లే నీకు ఇష్టమైనట్టు డబ్బులు తీసుకోవచ్చు. కానీ దాని గురించి ఒక మాట చెప్పు రా అని వేదవతి అడుగుతుంది. ఆ మాట విన్న రామరాజు కూడా నీకు ఏదైనా సమస్య ఉంటే చెప్పురా ఇది నీన్లే కదా ఎందుకు నువ్వు దాస్తున్నావు చెప్పు అని తిరుపతిని అనుమానించేలా మాట్లాడుతుంది.. ఆ మాట విన్న తర్వాత తిరుపతి చాలా బాధపడిపోతాడు. అటు రామరాజు చెప్పురా నీకు ఏదైనా అవసరమైతే తీసావా అని అనగానే తిరుపతి కన్నీళ్లు పెట్టుకుంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతారు వల్లి నా ప్లాన్ సక్సెస్ అయింది తింగరి తిరుపతి ఇరుక్కున్నాడు అని మురిసిపోతూ ఉంటుంది.
అమూల్య విశ్వం ధీరజ్ ప్రేమను కలిపేందుకు ప్లాన్ గురించి మాట్లాడుకోవాలని ఒక ఐస్ క్రీమ్ పార్లర్ కి వెళ్తారు. అక్కడే ఉన్న తన ఫ్రెండ్స్ వాళ్ళిద్దర్నీ ఆడపటిస్తారు. కానీ వాళ్ళిద్దరూ ఏదో ఒక విధంగా మాట్లాడుకుంటారు ఇంటికి వెళ్దాం అనుకునే లోపల ధీరజ్ అక్కడికి రావడంతో ఇద్దరు దాక్కుంటారు. ఆ తర్వాత అమూల్య నర్మద ప్రేమలు రావడం చూసి ఏం జరుగుతుందని అనుకుంటుంది. ఫైనల్ గా వాళ్ళిద్దరినీ కలపడానికి చేసిన ప్రయత్నం అని తెలుసుకుంటుంది. కానీ అక్కడ కూడా ప్రేమ ధీరాజులు ఇద్దరు గొడవపడడంతో నర్మదా షాక్ అవుతుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..