Illu Illalu Pillalu Today Episode june 3rd: ప్రేమ దగ్గరికి ధీరజ్ మల్లెపూలు హల్వా తో వస్తాడు. అయితే మై డియర్ ప్రేమ ఇవాళ మనకు శోభనం జరగాల్సిందే.. నువ్వు షాపింగ్ అని ఒప్పుకుంటావా లేదంటే ఎస్సై కోచింగ్ నేర్చుకుంటావా అని ధీరజ్ ప్రేమను బలవంతం చేస్తాడు.. ధీరజ్ ప్రవర్తన చూసి ఒక్కసారిగా భయపడిన ప్రేమ నర్మదని కేకలు వేసి పిలుస్తుంది. అయితే ప్రేమ పిలవగానే వచ్చిన నర్మదా ధీరజ్తో కమిట్ అయిపో అని చెప్తుంది.. మొత్తానికి ప్రేమ బలవంతంగా అయినా సరే ఎస్సై కోచింగ్ కి ఒప్పుకుంటుంది. శ్రీవల్లి ఎలాగైనా సరే తన తండ్రిని రైస్ మిల్లుకు పంపించాలి అని ప్లాన్ చేస్తుంది. ఇక చెందుతో ఎలాగైనా సరే బుట్టలో వేసుకొని ఒప్పించాలి అని ప్లాన్ చేస్తుంది.
శ్రీవల్లి ఎలాగైనా సరే ఆనందరావుని మళ్లీ తన రైస్ మిల్కీ పంపించాలని ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది.. చందు ని ఎలాగైనా తన నాటకాలతో బురిడీ కొట్టించి ఆనందరావుని రైస్ మిల్కీ పంపించాలని అనుకుంటుంది.. చందు రైస్ మిల్ కి వెళ్తున్న సందర్భంలో సుకన్యతో కలిసి కన్నీళ్లు పెట్టుకున్నట్లు నాటకం మొదలు పెడుతుంది.. అది చూసిన చందు ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతాడు. మా నాన్నకి గుండు మాత్రమే కాదు బావ గుండె వీక్నెస్ కూడా ఉంది. అతను వడదెబ్బకి కింద పడిపోయాడట అని శ్రీవల్లి అనగానే అవునా నిజమా అని చందు అమాయకంగా అడుగుతాడు. నమ్ముతున్నాడు కదా అని ఇంకాస్త రెచ్చిపోయి మాట్లాడుతుంది శ్రీవల్లి..
మీరు మా నాన్నని క్షమించి మళ్లీ రైస్ మిల్లుకి తీసుకోవాలి బావ అని వల్లి కన్నీళ్లు పెట్టుకొని మరీ చందు ని ఒప్పించే ప్రయత్నం చేస్తుంది. నిజంగానే ఆనందరావుకి వడదెబ్బ తగిలింది ఏమో అనుకొని చందు కాసేపు కంగారు పడతాడు. వల్లి ఏడుస్తున్న ఏడుపును చూసి నిజమే అనుకొని నమ్ముతుంటాడు చందు అప్పుడే ధీరజ్ ఇడ్లీ పార్సెల్ తీసుకొని వస్తాడు. వదిన నువ్వు టిఫిన్ చేయలేదంట కదా ఇదిగో టిఫిన్ చెయ్యి అసలు వట్టి మనిషి కూడా కాదు ప్రెగ్నెంట్ వే అని టిఫిన్ ఇస్తాడు. నేను ఇప్పుడు మీ అన్నయ్య తో చాలా ముఖ్యమైన విషయం మాట్లాడుతున్నాను తర్వాత తింటాను అని అంటుంది. కానీ చందు కూడా నువ్వు ఇప్పుడు తినాల్సిందే నీ కండిషన్ పెట్టడంతో ఆ ఇడ్లీ ని తింటే అచ్చం మా నాన్న లాగే ఉంది మా నాన్నకు కాపీ కొట్టాడేమో అని అంటుంది. మీ నాన్న లాగే కాదు మీ నాన్నది బయట బాగా పాటలు పడుకుంటూ ఇడ్లీలు అమ్మే ప్రయత్నం చేస్తున్నాడు కానీ అక్కడ ఎవరు కొనలేదని నేనే ఒక పార్సెల్ తీసుకొని ఇంటికి వచ్చాను అని అంటాడు. అవునా నిజమా? మీ నాన్నకి ఇంకా బాగా లేదేమో అని రైస్ మిల్ లోకి రమ్మని చెబుదామనుకున్నాను అని చందు అంటాడు. దారుణంగా ప్లాన్ ఫెయిల్ అయింది అని శ్రీవల్లి ఫీలవుతూ ఉంటుంది.
ఉదయం లేవగానే నర్మదా వంటగదిలోకి వెళ్లి వంట చేస్తూ ఉంటుంది. అయితే అదే టైంలో అంత పొగలు రావడంతో వేదవతి వంటగదిలో ఏదైనా మంటలు ఏమైనా అంటుకున్నాయా ఏంటి..? పొగలు వస్తున్నాయి అంటే ఏదో జరుగుతుంది అని కంగారు పడిపోతూ అక్కడికి వెళ్తుంది.. అయితే అక్కడ నర్మదా ఉప్మా చేస్తూ కనిపించడం చూసి వేదవతి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇది ఉప్మా కాదే మాడిపోయిందని నర్మదని ఎంతగా అంటున్న సరే తను మాత్రం అస్సలు మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతుంది. నాకు వంట రాదు అత్తయ్య ఇన్ని రోజులు మీరు చేశారు కదా అందుకే బాగా తిని కూర్చున్నాను అని నర్మదా అంటుంది. వామ్మో నా కొడుకుని వంటతో చంపేస్తావా ఏంటి అని వేదవతి అంటూ ఉండగా సాగర్అ క్కడికి వస్తాడు.
సాగర్ నర్మదని పిలిచి రెండు నెలలు కావలసిన సరుకులను తీసుకొని వచ్చాను అని అంటాడు. అది సరేగాని ఇప్పుడు నువ్వు ఎందుకు సరుకులు తీసుకొచ్చావు అని ధీరజ్ అంటాడు. నన్ను సరుకులు తీసుకురాలేదు అని ఎన్నెన్నో అన్నారు కదా అందుకే రెండు నెలలకు సరిపోని తీసుకొని వచ్చాను అని అంటాడు. అయితే నర్మద తెచ్చిన ఉప్మాను చూసి షాక్ అవుతాడు. ఇక వేదవతి ఆ ఉప్మా తింటే నా కొడుకు చచ్చిపోతాడు అని వేరే ఉప్మా తెచ్చి ఇస్తాను అని అంటుంది.. కానీ ధీరజ్ నర్మదా ఇద్దరు కూడా సాగర్ నీ రెచ్చగొట్టి ఉప్మా చేస్తారు..వీరిద్దరూ కలిసి నన్ను ఉప్మా తినకుండా చేస్తున్నారు అని సాగర్ లోపలికి వెళ్లి బాధపడిపోతూ ఉంటాడు..
భద్ర ధీరజ్ ని ఎలాగైనా ఇరికించాలి అని పక్కా ప్లాన్ ప్రకారం రెడీగా ఉంటుంది. ధీరజ్ ని డ్రగ్స్ కేసులో ఇరికించేందుకు అన్ని ఏర్పాట్లు కూడా చేసుకుని ఎప్పుడెప్పుడు ధీరజ్ పోలీసులు అరెస్ట్ చేస్తారని ఎదురు చూస్తూ ఉంటుంది. తన మేనల్లుడికి జరిగిన అవమానం ధీరజ్ కి జరిగితే పనోడు చస్తాడు . అప్పుడు నా కడుపు మంట చల్లారుతుంది అని భద్రావతి సేన ఇద్దరు అనుకుంటూ ఉంటారు.. అయితే ఇతను వెళుతున్న కారులోనే ప్రేమ కూడా వెళ్లడంతో ఏదైనా అవుతూనే మనిషి సేనా టెన్షన్ పడిపోతూ ఉంటాడు.. కానీ పోలీసులు మనవాళ్లే కదా అని భద్ర చెప్పడంతో సైలెంట్ గా ఉంటాడు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..
Also Read :తెలుగు సీరియల్స్ లలో టాప్ 5 బ్యూటీలు.. ఆ ఇద్దరికే డిమాండ్ ఎక్కువ..