Illu Illalu Pillalu Today Episode May 28th:అందరూ రాత్రి భోజనానికి కూర్చోవడంతో ప్రేమ కూడా అక్కడ భోజనం తినడానికి అని కూర్చుంటుంది.. అయితే నేనంటే కడుపుతో ఉన్నాను కడుపులో ఆకలిస్తే పిల్లలు ఏడుస్తాడని ముందే వచ్చి తింటున్నాను మరి ప్రేమ ఎందుకు ఇంత ముందు తింటుంది అని మళ్ళీ ప్రేమని ఇండైరెక్టుగా అడుగుతుంది. అయితే ప్రేమ నా సంగతి నీకెందుకు నోరు మూసుకొని నువ్వు తినాలనుకుంటే తిను అని అంటుంది. వదిన ప్రేమ తిక్క గురించి మీకు తెలియదు ఇలాగే ఒకడు ఏదో అంటే వాడి రాయి తీసుకొని బుర్ర పగలగొట్టేసింది అని ధీరజ్ చెబుతాడు.. ప్రేమ ఆనంద పనైనా చేస్తుంది అసలే తింగరిది మీరు దూరంగా ఉండండి అని శ్రీవల్లికి ధీరజ్ చెపుతాడు. నర్మదా ఆకలేస్తుంది అని అటు ఇటు తిరుగుతూ ఉంటుంది అది చూసిన ప్రేమ అక్క ఇంకా భోజనం చేయలేదేమో అని బాధ పడిపోతుంది..
అందరు కూర్చుని భోజనం చేస్తూ ఉండగా నర్మదా మాత్రం ఆకలిగా ఉందని అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. వేదవతికి చెప్తే తను భోజనం చేద్దువు రావే అని అంటుంది కానీ అందరూ ఉన్నారు అని చెప్పగానే నర్మదా మొదట షాక్ అవుతుంది. ఇక అప్పుడే ఇంట్లో కూర్చున్నా సాధారణ చూసి ఏంటది అని అడుగుతుంది. ఇంట్లో ఒక పెళ్ళాం ఉంటుంది అది ఫస్ట్ పడుకొని ఉంటుంది దానికి ఏదైనా ఫుడ్ తీసుకొని రావాలి అని ఆలోచన లేదని కడిగి పడేస్తుంది నర్మదా. అదేంటి నువ్వంటే చేయలేదా అని సాగర్ అడుగుతాడు. ఎలా చేయాలి? నువ్వేమైనా సర్కిల్ తెచ్చి ఇచ్చావా ఏం చేయాలి చెప్పు అని నర్మదా కౌంటర్ ఇస్తూ వస్తుంది. నీకు పెళ్ళాం ఆకలితో పనిలేదు. రోజంతా కష్టపడి ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చినప్పుడు కనీసం భోజనం అయిన తీసుకురావాలి అన్న ఆలోచన కూడా లేదు అని నర్మదా ఫీల్ అయిపోతుంది.
కోపంగా లోపలికి వెళ్లిన నర్మదా అంటే కోపంగా మళ్లీ బయటకు తిరిగి వస్తుంది. ఏవండీ వేదవతి గారు ప్లేట్ ఇవ్వండి అని అడుగుతుంది. ప్లేట్లు అన్నం పెట్టమని అడుక్కోవాలా అని నర్మదా అనగానే అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. ఏంటి అలా మింగుతున్నావ్ గొంతుకట్టపడితే నీళ్లు తాగి మరి మింగు అని శ్రీవల్లికి సమాధానం చెప్తుంది నర్మదా. మొత్తం హడావిడి చేసిన నర్మదా అడిగి మరి అన్ని పెట్టించుకుని తింటుంది. ఇక ప్రేమ వెధవది ఇద్దరు కూడా కోసరి కోసరు వడ్డించి మరి నర్మదకు ఆ భోజనం పెడతారు. అది చూసి రా సాగర్ షాక్ అవుతాడు.
భోజనం చేసి వెళ్తున్న తర్వాత నర్మదా రామరాజుకి మావయ్య గారు నేను భోజనం చేశారని మీరు కోపంగా ఉన్నారా అని అడుగుతుంది.. నేనెందుకు కోపంగా ఉంటానమ్మ దూరం పెట్టింది మీ ఆయన మేము కాదు అని రామరాజు అంటాడు. ఇక అందరూ కూడా నర్మద మాటకు నోరు వెళ్ళబెట్టి చూస్తూ ఉంటారు. నర్మదలు ఆపిన సాగర్ ఏంటి నువ్వు చేసింది నువ్వు వెళ్లి మళ్లీ అక్కడ తినేసి వస్తావా అని అడుగుతాడు. పాతికేళ్ళు నువ్వు మెయింటైన తిన్నావు కదా అప్పుడు నీకు గుర్తుకు రాలేదని నర్మదా సాగర్ కి దిమ్మ తిరిగిపోయేలా కౌంటర్ ఇస్తుంది.. నీలాగ నేను ఆకలిగా తట్టుకొని ఉండలేను అందుకే తినేసి వచ్చాను అని నర్మదా అంటుంది. ఇప్పుడు నాకు గొడవపడి మూడు కూడా లేదు అని నర్మదా లోపలికి వెళ్ళిపోతుంది.
సాగర్ ఆకలి దంచేస్తుంది కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి అని బయట ఒంటరిగా తిరుగుతూ బాధపడిపోతూ ఉంటాడు. ఇలాంటి సిచువేషన్ వస్తుంది అని నేను అసలు ఊహించలేదు అని సాగర్ తనలో తానే మాట్లాడుకుంటూ ఆకలితో కడుపు మంటతో బాధపడిపోతూ ఉంటాడు. అరేయ్ ఇది కూడా నడిపోడు భోజనం చెయ్యవని వేదవతి ప్లేట్లో భోజనం పెట్టుకుని వచ్చిన సాగర్ కి ఇస్తుంది.. ఏంటమ్మా ఈ నాటకాలు నువ్వు మీ ఆయన కొత్తగా నటిస్తున్నారా అని సాగర్ అడుగుతాడు. నాటకాలు ఏంట్రా ఏం మాట్లాడుతున్నావ్ రా అని వేదవతి అంటుంది. నువ్వు మీ ఆయన మాటకి సపోర్ట్ చేస్తూ ఉంటావు నేను పడుకోరా నా సంగతి కూడా నువ్వు మర్చిపోయావు. పాతికేళ్లు పెంచిన కర్ణ ప్రేమ ఎలా పోయిందమ్మ ఈరోజు నువ్వు భోజనం చేయాలి అని దొంగతనంగా ఇస్తున్నావు కదా.. అదేదో అప్పుడే ఇవ్వచ్చు కదా అని వేదవతి తో దారుణంగా మాట్లాడతాను సాగర్. దయచేసి ఇంకెప్పుడు నాకు ఇలా భోజనాన్ని తీసుకురావద్దు అమ్మ అని వేదవతి ఘోరంగా సాధన మాట్లాడుతాడు. వేదవతి కొడుకు మాటలు విని కన్నీళ్లు పెట్టుకుంటుంది.
వేదవతి ఏడుస్తూ గదిలోకి వెళ్లడంతో రామరాజు ఇప్పుడు నీకు చాలా సంతోషంగా ఉందా అని అంటాడు. ఏం మాట్లాడుతున్నారండి మీరు నేనెందుకు సంతోషంగా ఉంటాను అని వేదవతి అంటుంది. నువ్వు సంతోషంగా ఉన్నావా లేదా నీ మొహం చూస్తేనే అర్థమవుతుంది నీ కొడుకు బాగానే గడ్డి పెట్టాడు కదా ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నావు కదా అని రామరాజు అంటాడు.. మన ప్రేమ వాడికి అర్థం కావడం లేదు బుజ్జమ్మ నువ్వు ఏమీ బాధపడకు అని రామరాజు ఎంతగా ఓదారుస్తున్న సరే తన కన్నతల్లి ప్రేమ అడ్డు వచ్చి వేదవది అంతకు ముందు బాధపడుతూ ఉంటుంది. వేదవతి కొడుకు కోసం పెట్టుకునే కన్నీళ్లు సీను ఎపిసోడ్కి హైలైట్ గా తెలుస్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ప్రేమ ధీర ఇద్దరు కూడా రొమాంటిక్గా కొట్టుకుంటారు ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి…