Intinti Ramayanam Today Episode December 20th: నిన్నటి ఎపిసోడ్ లో.. శ్రీకర్ ఇంకొద్ది రోజుల్లో ఆస్తి పంచక పోతే ఏం చేయాలో అది చేస్తాను అని అంటాడు. ఈ విషయాన్ని జైల్లో ఉన్న తన తండ్రితో చెప్తుంది పల్లవి. అవనికి ఆస్తి గురించి తెలియదు కదా ఆస్తిని ఎలాగైనా సరే మనమే సొంతం చేసుకోవాలని అంటుంది.. రాజేంద్రప్రసాద్ కూల్ గా ఉండడం చూసి పార్వతీ భానుమతి ఇద్దరూ కూడా ఏంటి మీరు ఇంత కూల్ గా ఉన్నారు ఆస్తి పంచొచ్చు కదా అని అంటారు. దాని గురించి నేను తర్వాత మాట్లాడుతానని అంటాడు. రాజేంద్ర ప్రసాద్ మాత్రం చాలా కూల్ గా ఉంటాడు. భానుమతి పార్వతిలో ఏమైందిరా ఇంత కూల్ గా ఉన్నావ్ అని అడుగుతారు. ఇప్పుడు నేను ఒక విషయం గురించి చెప్పాలనుకుంటున్నాను అని అంటాడు. పల్లవి కమల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది.. కమల్ రాగానే పల్లవి అతనిపై ప్రేమను కురిపిస్తుంది. నీకేం కావాలో చెప్పు నేను నీ కోరిక తీరుస్తాను అని పల్లవి అంటుంది.. పల్లవి మాట విన్న కమల్ తనని వదిలేస్తాడు. ఆ తర్వాత రాజేంద్రప్రసాద్ ఊరికి వెళ్లడానికి రాసిన ప్రసాద్ బట్టల సర్దుకోమని అందరికీ చెప్తాడు. ఆస్తి గురించి అక్కడ ప్రతి విషయాన్ని నేను చెప్తాను అని అంటాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. అక్షయ్ తన అత్తగారి బట్టలను ఐరన్ చేస్తానని చెప్తాడు. మీరు మా అమ్మ బట్టలు ఐరన్ చేస్తే బాగోదేమో అని అంటుంది అవని. కానీ అక్షయ్ మాత్రం అత్తయ్య అమ్మతో సమానం ఏం కాదు నేను ఆమె బట్టలు ఐరన్ చేస్తాను నువ్వు వెళ్లి ఐరన్ బాక్స్ తీసుకురా అని అంటాడు. అవని ఐరన్ బాక్స్ కి వెళ్ళగానే అక్షయ్ కి మీనాక్షి బ్యాగులోని ఒక ఫోటో కనిపిస్తుంది.. ఆ ఫోటో చూడగానే అక్షయ్ షాక్ అవుతాడు.. ఏంటి ఈ ఫోటో ఏంటి అని అవని అడుగుతాడు.. అవని ఆ ఫోటో గురించి చెప్పడానికి సంకోచిస్తుంది. ఈ ఫోటో ఏంటి అని అందరూ అక్కడికి వచ్చి అడుగుతారు. కానీ అవని మాత్రం ఆ ఫోటో గురించి అసలు విషయాన్నీ చెప్పకుండా దాస్తుంది.
భానుమతి నా అల్లుడికి నీ తల్లికి ఉన్న సంబంధం ఏంటి ఎందుకు వాళ్ళిద్దరూ కలిసి ఫోటో దిగారు అని అడుగుతుంది. కానీ అవని మాత్రం ఏమి చెప్పకుండా మౌనంగా ఉంటుంది. శ్రియ మీ అమ్మకు ఆయనకి ఏదో అక్రమ సంబంధం ఉంది అందుకే ఇలా దాచుకున్నారేమో అని అంటుంది. కానీ కమల్ మాత్రం ఎప్పుడు ఏం మాట్లాడాలో కూడా తెలీదా నీ నోటికి ఎంత వస్తే అంతే మాట్లాడతావా నిజ నిజాలు తెలుసుకోకుండా మాట్లాడను తప్పు అని అంటాడు. అక్షయ్ మీ అమ్మకు చక్రధర్ కి ఉన్న సంబంధం ఏంటో చెప్పకపోతే నేను చచ్చినంత ఒట్టు అని అంటాడు..
ఈ నిజాన్ని ఇన్ని రోజులు నా గుండెల్లోనే దాచుకున్నాను.. కానీ ఇప్పుడు ఈ నిజాన్ని మీకు చెప్పాలని అనుకుంటున్నాను అని అవని అంటుంది. మీరు అనుకున్నట్లు మా అమ్మకి ఆ చక్రధరికి ఏదో సంబంధం లేదు అయినా మా అమ్మ భర్త నాకు కన్న తండ్రి అని అవని అంటుంది. అయితే మీ అమ్మకి మా నాన్న భర్త ఏంటి ఏం మాట్లాడుతున్నావ్ అని అవని తో పల్లవి అంటుంది. అయితే పల్లవి మా నాన్నకి ఆస్తి ఉందని మీ అమ్మ వల్లో వేసుకుని అక్రమ సంబంధం పెట్టుకుందా అని అంటుంది. పల్లవి ఏం మాట్లాడుతున్నావ్ మా అమ్మకి అలాంటి బుద్ధులు లేవు అని అవని అంటుంది.
Also Read : మహాను ఇంప్రెస్ చేస్తున్న చక్రి.. మాధవ్ పెళ్లి క్యాన్సిల్.. భూషణ్ కు మహా షాక్..
మరి సంబంధం లేకపోతే మా అమ్మకి మాత్రమే మా నాన్న భర్త మీ అమ్మకు ఎలా భర్త అయ్యాడు అని పల్లవి అడుగుతుంది. వీళ్ళందరి ప్రశ్నలు విన్న అవని ఉలిక్కిపడి లేస్తుంది. కల ఇంత భయంకరంగా ఉంటే నిజం తెలిస్తే రేపు ఏం జరుగుతుందో అని టెన్షన్ పడిపోతూ ఉంటుంది.. ఆ తర్వాత అందరూ ఊరికి వెళ్లడానికి రెడీ అవుతూ ఉంటారు. అందరూ వచ్చిన సరే భానుమతి మాత్రం రాకపోవడంతో కమల్ ఏంటే ముసలి లోపల మీ ఊరికి వెళ్తున్నానని మేకప్ వేసుకుంటున్నావా అని అడుగుతాడు.. ఫోన్ చార్జింగ్ అయిపోయిందిరా అందుకే పెట్టుకుని వస్తున్నాను అని అంటుంది భానుమతి. సరే అక్కడ కూడా నువ్వు ఫోన్ పట్టుకున్నావంటే తీసుకెళ్లి గోదాట్లో వేస్తాను అని కమలంటాడు. నువ్వు ఎప్పుడూ నా మీద పడి ఏడుస్తావ్ ఏంట్రా అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా నన్ను వదలవా అని భానుమతి అంటుంది. వీరిద్దరికి ఈ గొడవలు ఎప్పుడూ ఉండేవే కదా పదండి వెళ్దామని రాజేంద్రప్రసాద్ అంటాడు.. ఊరి అందాలను చూస్తూ అక్కడ ఉన్న ప్రకృతిని ఆస్వాదిస్తూ ఊర్లోకి ఎంటర్ అవుతారు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో రాజేంద్రప్రసాద్ ఆస్తి గురించి ఏం చెప్తాడో చూడాలి..