Intinti Ramayanam Today Episode june 1st : మీనాక్షి కేక్ తినిపిస్తూ ఉండగా పల్లవి వచ్చి కొంచమైనా సిగ్గు ఉందా నీకు అని చంప పగలగొడుతుంది. నీ మనవరాలు చేత అమ్మమ్మ అని పిలిపించుకున్నావు ఈ వయసులో నీకు మొగుడు కావాల్సి వచ్చాడా అని పల్లవి మీద క్షీణి దారుణంగా అవమానించేలా మాట్లాడుతుంది.. అయితే మీనాక్షి పల్లవి మాట్లాడుతుండగా బాధపడిపోతూ ఉంటుంది. 30 ఏళ్లుగా బతికి దూరంగా ఉన్నావు ఇప్పుడు మాత్రం మీకు భర్త గుర్తుకు వచ్చారా? ఉండలేకపోతున్నావా..? కొంచెం కూడా నీ భర్తని వదలలేకపోతున్నావా మామ్ కి భర్తని దూరం చేస్తావని దారుణంగా అందరూ షాక్ అయ్యేలా మాట్లాడుతుంది.. అంతేకాదు మీనాక్షిని కొట్టడంతో తను చాలా బాధ పడిపోతూ ఉంటుంది. నీ కన్న తల్లి లాంటి మనిషిని పట్టుకుని నువ్వు ఇంత దారుణంగా మాట్లాడతావా అని పల్లవిని అవని చంపలు వాయించేస్తుంది.. మా అమ్మని కొట్టడానికి అసలు నువ్వు ఎవరు? ఎంత ధైర్యం ఉంటే నువ్వు మా అమ్మని కొడతావని పల్లవి కి అవని దిమ్మతిరిగిపోయేలా షాక్ ఇస్తుంది.
అసలు నువ్వు సిగ్గు లేకుండా ఇప్పుడు మొగుడుతో పలుకుతున్నావా అని పల్లవి మీనాక్షిని దారుణంగా అవమానిస్తూ మాట్లాడుతుంది. కొంచెమైనా సిగ్గు లేకుండా ఇప్పుడు మొగుడుతో కాపురం చేస్తున్నవని పల్లవి చాలా దారుణంగా మాట్లాడుతుంది. మా మామ కి తన భర్తని దూరం చేసుకునే పరిస్థితి వచ్చింది అంటే దానికి కారణం నువ్వే. నా తల్లిని అవమానించడానికి నువ్వు ఇక్కడికి పిలిచావా అని అవనిపై పల్లవి సీరియస్ అవుతుంది. పల్లవి మాటల్ని గమనించిన చక్రధర్ అసలు ఏం మాట్లాడుతున్నావో అర్థం అవుతుందా అని ఆవేశపడతాడు. అసలు నువ్వు ఇంతగా అవమానిస్తున్న ఈ మీనాక్షి ఎవరో తెలుసా నీకు ఏమవుతుందో తెలుసా అని చక్రధర్ నిజం చెప్పబోతాడు కానీ అవని మాత్రం మీరు ఆగండి నాన్న ఆవేశ పడకండి అని ఆపుతుంది..
కన్నయ్య అందరూ ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళు అని అవని అందని బయటికి పంపిస్తుంది. మీనాక్షి కూడా బయటికి వెళ్లి వంటరిగా కూర్చుని బాధ పడిపోతూ ఉంటుంది. రాజేశ్వరి ఇంట్లో గొడవలు జరుగుతుండడానికి కారణం నువ్వే. నీ మీద మోజుతోనే నా మొగుడు కాపురం చేశాడు.. ఇప్పుడు నీ మీద మోజు లేదు కాబట్టే నిన్ను వదిలేసి నాతో ఉంటున్నాడు. అయినా నువ్వు మళ్ళీ ఇప్పుడు వచ్చి నా మొగుడు అని ఉన్నావా కొంచమైనా సిగ్గుందా నీకు అని దారుణంగా మాట్లాడుతుంది రాజేశ్వరి.. నువ్వే బతికుంటే ఈ సమస్యలన్నీ ఇంకాస్త పెరిగిపోతాయి నిన్ను చంపేస్తాను అని రాజేశ్వరి మీనాక్షి గొంతు పట్టుకొని చంపబోతుంది.. ఎంతగా వదిలించుకోవాలని ప్రయత్నించిన సరే.. రాజేశ్వరి మాత్రం ఎలాగైనా సరే ఇవాళ మీనాక్షిని చంపి తీరాల్సిందే అని అనుకుంటుంది.. అయితే రాజేశ్వరి మీనాక్షిని చంపబోతున్నప్పుడు అవని వచ్చి పిన్ని ఏం చేస్తున్నారు.. వదలండి అంటూ పక్కకు తోసేస్తుంది. పక్కకు వెళ్లిన రాజేశ్వరి మళ్ళీ వస్తుంది.. అక్కడ ఉన్న కర్రపై కాలు వేసి రాయి పై పడుతుంది.
రాజేశ్వరి కింద పడిపోవడం చూసిన పల్లవి ఒక్కసారిగా ఏమైంది నీకు అంటూ పరిగెత్తుకుంటూ వస్తుంది. మా మమ్మీ చంపాలని చూస్తావా అని పల్లవి తన తల్లిని చూసి బాధ పడిపోతుంది. ఎందుకిలా చేసావ్ మా అమ్మ నీకు ఏమి అన్యాయం చేసిందని ఇలా చేస్తావని రాజేశ్వరి మీరు చూసిన పల్లవి అవనితో గొడవ పడుతుంది. అయితే ముందు పిన్నికి ఏమైందో అర్థం కావడం లేదు అని అవని కంగారు పడిపోతూ ఉంటుంది. పల్లవి బ్లడ్ కూడా వస్తుంది. అందరు కలిసి ఆసుపత్రికి తీసుకుని వెళ్తారు. అక్కడ రాజేశ్వర్ కి ఏమవుతుందని అందరూ టెన్షన్ పడిపోతూ ఉంటారు. పల్లవి తన తల్లికి ఇలా అయిందని కన్నీళ్లు పెట్టుకుని బాధ పడిపోతూ ఉంటుంది.
తను ఎంత ప్రయత్నించినా సరే స్పృహలోకి రావడంతో రాజేశ్వర్ కి ఏమవుతుందని టెన్షన్ పడిపోతూ ఉంటారు.. రాజేశ్వరి ఈ పరిస్థితుల్లో ఉన్నాడని కారణం అవనీని మా మామకి ఏదైనా జరిగింది అంటే కచ్చితంగా మిమ్మల్ని ఎవరిని బతకనివ్వను అని పల్లవి సీరియస్గా అంటుంది. రాజేశ్వరి కండిషన్ మాత్రం సీరియస్ గా ఉంటుంది. అందరూ ఏమవుతుందని టెన్షన్ పడిపోతూ ఉంటారు.. ఆమెని చూసిన డాక్టర్లు ఆమె చనిపోయింది అని నిర్ధారించుకుంటారు.. బయటికి వచ్చి ఆమె చనిపోయింది అని చెప్పగానే పల్లవి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. తన కన్నతల్లి ఇక లేదు అని తెలుసుకుని కన్నీరు మున్నీరుగా వినిపిస్తుంది. పల్లవిని చూసిన అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కన్నీళ్లు పెట్టుకుంటారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి…
Also Read : ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు ‘ టీఆర్పీ రేటింగ్.. మే హైలెట్ ఎపిసోడ్స్..