Intinti Ramayanam Today Episode March 5th: నిన్నటి ఎపిసోడ్ లో.. మొన్న నువ్వు 47 సార్లు ఈ నెంబర్ కి కాల్ చేసావు అని అడగగానే పల్లవి దిమ్మతిరిగేలా షాక్ అవుతుంది.. ఆ నెంబర్ ఎవరితో నన్ను అడిగితే నేను ఎలా చెప్పను. అసలు నాకెందుకు ఆ నెంబర్ తో పని ఏంటి అని ఎంతగా పల్లవి బుకాయించాలని చూసినా.. అవని మాత్రం నువ్వు ఏంటో నిజాలని బయట పెడతాను అని అంటుంది.. అవనికి ఏవైనా పిచ్చి కింద ఏంటి పల్లవితో ఏం మాట్లాడుతుంది అర్థం కావడం లేదు అని పార్వతి అంటుంది. అయితే అవని ఏం మాట్లాడుతున్నావ్ అర్థం కావట్లేదు అని పల్లవి కూడా అంటుంది.
కానీ నేను నిజం చెప్పేస్తాను ఆగండి అని అవని అంటుంది. అయితే పల్లవి మాత్రం ఏం నిజం చెప్పాలి అని అడుగుతుంది. మా అమ్మని కిడ్నాప్ చేయించింది చక్రధరి అది పల్లవికి తెలుసు నువ్వు ఇలా చెప్పవని పల్లవి చంప పగలగొడుతుంది ఆవని.. మీనాక్షిని మా డాడీ నే కిడ్నాప్ చేశాడు అని చెప్పగానే అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు.. అది లొకేషన్ పంపించగానే అందరూ అక్కడికి వెళ్తారు. అప్పటికే చక్రధర్ అక్కడ ఉంటాడు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. అవని అక్షయ్ అలాగే కమల్ ముగ్గురు కూడా చక్రధర్ ఎక్కడున్నాడో తెలుసుకొని మీనాక్షి అత్తయ్యని కాపాడాలి అని అనుకుంటారు.. చక్రధర్ మాత్రం మీనాక్షిని ఎలాగైనా కాపాడి అవని వాళ్లకి నిజం చెప్పాలని. కానీ చక్రధర్ మీనాక్షి కాపాడడానికి వెళ్తాడు. మీనాక్షి నన్నేం చేయొద్దు నేను నీ గురించి ఎక్కడ నిజం చెప్పను నా పిల్లల కోసమే నేను బతుకుతున్నాను అని ప్రాధేయపడుతుంది. నేనేం చేయను నిన్ను కాపాడడానికే వచ్చాను ఇకనుంచి తీసుకొని వెళ్ళిపోయి నిజం చెప్తాను అని అంటున్న సరే మీనాక్షి మాత్రం అస్సలు నమ్మదు. మీనాక్షి కట్లు విప్పుతున్న టైం లో కమల్ అక్షయ్ వాళ్లు చూసి అతన్ని కొట్టేస్తారు. ఇక అవని తన తల్లి కట్లు విప్పేసి హక్కును చేర్చుకుంటుంది.. ఇక చక్రధర్ ని కొట్టి మీనాక్షిని తీసుకుని వెళ్తారు.. అవని ఎంత చెప్తున్నా సరే కమల్ మాత్రం చక్రధారిని చంపేస్తాను అని అంటాడు.. కానీ మొత్తానికి మీనాక్షిని తీసుకుని వెళ్తారు.
వాళ్ళ అలా వెళ్ళగానే పల్లవి అక్కడికి వస్తుంది.. డాడ్ ఏమైంది మీకు అసలు వాళ్లు మిమ్మల్ని కొట్టారా అని అడుగుతుంది పల్లవి.. మిమ్మల్ని ఎందుకిలా కొట్టారు డాడ్.. అవని ఆపుకున్నావ్ అంటే నన్ను కచ్చితంగా వాళ్ళు చంపేసే వాళ్ళు అని చక్రధర్ అంటాడు. అయితే మిమ్మల్ని వాళ్ళు కొట్టడానికి ఒక కారణం ఉంది డాడ్ అని పల్లవి అంటుంది. నన్ను నేను తప్పించుకోవడానికి మీనాక్షిని కిడ్నాప్ చేసింది నువ్వే అని చెప్పాను అందుకే వాళ్ళు నిన్ను బాగా కొట్టారు అని పల్లవి అంటుంది. ఆ మాట వినగానే చక్రధర్లేచి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు.. పల్లవి రౌడీల దగ్గరికి వెళ్లి మీకు డబ్బులు ఇచ్చింది మా డాడీ ని వాళ్ళు కొడుతుంటే చూడ్డానికి అనే సీరియస్ అవుతుంది.. కానీ చక్రధర్ అప్పటికే వెళ్లిపోతాడు..
ఇక తర్వాత అవని అక్షయులు చక్రధర్ కిడ్నాప్ చేశారని మీనాక్షి కోసం వెళ్ళినట్లు పార్వతి శ్రీకర్షియాలతో చెబుతుంది.. ఏంటమ్మా నువ్వు చెప్పేది చక్రధర్ మామయ్య మీనాక్షి అత్తయ్యని కిడ్నాప్ చేశాడా? ఎందుకు అని అడుగుతాడు శ్రీకర్. పల్లవికి వాళ్ళ నాన్న ఎక్కడ దాచాడు తెలిసి ఉంటుంది కదా మరి పల్లవి ఎక్కడ అని అంటాడు. పల్లవి వాళ్ళందరూ బయటికి వెళ్లగానే ఎక్కడికో వెళ్లిపోయింది అని పార్వతి చెప్తుంది. అప్పుడు అక్కడికి మీనాక్షి తీసుకొని అందరూ వస్తారు. పార్వతి వదిన గారు మీకేం కాలేదు కదా ఆగండి అని మంచినీళ్లు తీసుకుని వచ్చి ఇస్తుంది. ఆ చక్రధర్ ఈవిడని ఎందుకు కిడ్నాప్ చేశాడు అర్థం కావడం లేదు అని పార్వతి అంటుంది.
అప్పుడే అక్కడికి భరత్ ప్రణతిలు వస్తారు. వాళ్ళని చూసి మీనాక్షి ఎమోషనల్ అయిపోతుంది. మేము కొన్ని నిమిషాలు వెళ్లడం లేట్ అంటే మీనాక్షి అత్తయ్యని కచ్చితంగా వాడు చంపేసేవాడు అని కమలంటాడు. అయితే కమల్ ఆ మాట అనగానే అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అవునమ్మా వాడి చేతిలో కత్తి కూడా ఉంది. మేం వెళ్లడం ఆలస్యమై ఉంటే కచ్చితంగా కత్తితో పొడిచే వాడు అని కమలంటాడు. అప్పుడే అక్కడికి చక్రధర్ కూడా వస్తాడు… చక్రధారిని చూసిన కమల్ మళ్లీ ఇక్కడికి ఎందుకు వచ్చావురా? చంపేస్తాను నేను అని కొడతాడు. అది చూసిన మీనాక్షి బాధ పడిపోతూ ఉంటుంది..
Also Read :బీబీ జోడీ ప్రోమో.. మానస్ తలకు పెద్ద గాయం.. అయ్యో పాపం..
ఇక తర్వాత అందరూ కూడా చక్రధర్ నేను నానా మాటలు అంటారు. పార్వతి ఎన్ని రోజులు నువ్వు మంచి వాడివి అని అనుకున్నాను. నువ్వు జైలు నుంచి విడిపించాలని కూడా కోరుకున్నాను. కానీ నువ్వు ఇలా ఒక దుర్మార్గానికి దిగుతావని అస్సలు ఊహించలేదు అని అంటుంది. నువ్వు ఇకనుంచి వెళ్ళిపో లేదంటే నా కొడుకుని నేను చంపేస్తారు అని పార్వతి అంటుంది. నేను ఒక విషయం చెప్పాలి అని చక్రధరం అంటాడు. అవని ఏదో చెప్తాను అంటున్నాడు కదా అత్తయ్య చెప్పనివ్వండి అని అంటుంది. మీనాక్షిని దగ్గరికి తీసుకుని వచ్చి క్షమాపణ చెప్తాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి..