Intinti Ramayanam Today Episode May 29th : అవని అందరికీ మజ్జిగ తెచ్చి ఇస్తూ ఉంటుంది. పల్లవిని తీసుకోమని చెప్పిన కూడా పల్లవి వినకపోవడంతో తీస్కో చల్లబడతావని అవని ఎంత చెప్పినా సరే వినదు. ఎదురుగా రాజేశ్వరి వాళ్ళు రావడం చూసి పల్లవి ఒక్కసారేగా షాక్ అయిపోతుంది.. వీళ్ళు వచ్చారని అవని అందర్నీ పిలుస్తుంది. పల్లవి మాత్రం రాజేశ్వరిని పక్కకు తీసుకుని వెళ్లి మాట్లాడడానికి ప్రయత్నం చేస్తుంది కానీ తను మాట్లాడుకున్న మౌనంగా లోపలికి వెళ్తుంది. అందరూ కూడా రాజేశ్వర్ రావడం చూసి షాక్ అవుతారు.. జరిగినవన్నీ పక్కన పెట్టేసి నువ్వు రావడం మాకు చాలా సంతోషంగా ఉంది అని అందరూ అంటారు కానీ రాజేశ్వరి మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది.. ఇక చక్రధర్ మీనాక్షి ఇద్దరు కలిసి ఆరాధ్య కోసం బట్టలు తీసుకొని వస్తారు. ఇద్దరు కలిసి జంటగా బట్టలు పెట్టాలి అని పార్వతి చెప్పగానే రాజేశ్వరి షాక్ అవుతుంది.. పల్లవి మా అమ్మని అవమానించడానికే అవని పిలిచింది అని అనుకుంటుంది..
చక్రధర్ అలాగే మీనాక్షి ఇద్దరు కలిసి ఆరాధ్యకు బట్టలు పెట్టాలని అనుకుంటారు. పార్వతీ వల్లనే ఆరాధన కూర్చోబెట్టి అక్షంతులు వేసి ఒడిలో బట్టలు పెడతారు అక్షింతలు వేసి ఆశీర్వదిస్తారు చక్కధర్, మీనాక్షిలు. వీరిద్దరూ అలా వెయ్యగానే రాజేశ్వరి మీ భార్యగా అన్ని హక్కులు నాకు ఉన్నాయి అలాంటివి మీరు ఆవిడ గారితో కలిసి ఇలా చేస్తారా అని రెచ్చిపోతుంది.. అన్ని అధికారులలో నాతో కాకుండా మీరు ఆవిడతో కలిసి ఇలా చేయడం నాకు నచ్చలేదు. నాకన్నా మీకు ఆవిడే ఎక్కువైందా అని రాజేశ్వరి అనగానే పిన్ని అని అవని ఒక్క మాటతో సైలెంట్ అయ్యేలా చేస్తుంది.. ఇక రాజేశ్వరి మాట కూడా మాట్లాడుకున్న బయటికి వెళ్లిపోవాలని అనుకుంటుంది.. పల్లవికి రాజేశ్వరిపై అనుమానం మొదలవుతుంది.. అవని చెప్పగానే రాజేశ్వరి మౌనంగా ఉంది అంటే ఏదో జరిగింది అని అనుకుంటుంది.
రాజేశ్వరి బయటికి వెళ్తూ ఉండగా పల్లవి కూడా వెనకాలే వస్తుంది.. మామ్ ఆగండి అని పల్లవి అనగానే రాజేశ్వరి ఆగుతుంది.. ఏంటి అసలు ఏం జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు. నన్ను ఆ ఇంటి నుంచి ఇంటికి పంపించావు.. అవని వల్లే ఇదంతా జరిగింది.. అవని వచ్చా ఆ రోజు నీతో ఒంటరిగా ఏదో మాట్లాడింది ఆ తర్వాత రోజు నుంచే మీరు ఇలా తేడాగా ఉన్నారు అసలు ఏం చెప్పింది ఏం జరిగింది చెప్పండి మామ్ అని పల్లవి గుచ్చి గుచ్చి అడుగుతుంది.. రాజేశ్వరి మాత్రం పల్లవికి ఎక్కడ నిజం తెలిసిపోతుందని కంగారు పడిపోతూ ఉంటుంది.. భరత్, ప్రణతి లను నువ్వే దగ్గరని రూల్స్ తీసుకొచ్చావు అంటే ఏదో జరుగుతుంది అదేంటో నాకు చెప్పు అని పల్లవి ఎంత అడిగినా కూడా రాజేశ్వరి టెన్షన్ పడుతూ అక్కడే ఉండిపోతుంది కానీ నిజం చెప్పదు..
రాజేశ్వరి టెన్షన్ పడిపోతూ కనిపిస్తుంది.. మామ్ ఎందుకు మీరు అంత టెన్షన్ పడుతున్నారు అసలు ఏం జరుగుతుందో చెప్పండి మామ్. నాకు చెప్పడం రహస్యం మీద ఉందా అని అడుగుతుంది పల్లవి.. అప్పుడే అక్కడికి వచ్చిన అవని ఏంటి పిన్ని టెన్షన్ పడుతున్నారా? మీకు ఆల్రెడీ బిపి ఉందని తెలుసు కదా ఎందుకు మీరు ఇలా టెన్షన్ పడుతూ కనిపించారు.. అయితే మీరు బీపీని తెచ్చుకోకండి మీకు చూసే మన తీసుకురమ్మంటారా అని అవని వెటకారంగా మాట్లాడుతుంది. నాకు ఏ జ్యూస్ అవసరం లేదు అని రాజేశ్వరి అనగానే అవని పల్లవితో మీ అమ్మకి బీపీ ఉంది అని సంగతి తెలుసు కదా. ఎక్కువైనా ప్రమాదమే తక్కువైనా ప్రమాదమే నువ్వు అనుకున్నట్లుగా మీ అమ్మ ఏ నిజమో నీకు చెప్పదు అని అవని అంటుంది.. మామ్ నువ్వు నాకు ఏ నిజమో చెప్పవ నాకు అర్థం అయిపోయింది అని అనగానే రాజేశ్వర ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంది.. పల్లవి మాత్రం రాజేశ్వరిపై అనుమానంతో ఉంటుంది.
రాజేశ్వరిపై పల్లవి సీరియస్ గా ఉండడం విన్న కమల్.. పల్లవి ఎలాగైనా సరే ఏదో ఒకటి చేయాలి అని అనుకుంటాడు. పల్లవి అలా ముందుకు వెళుతూ ఉండగా కమల్ కావాలని అరటి తొక్క వేస్తాడు.. చూసుకోకుండా పల్లవి తొక్కపై కాలు వేసి కింద పడిపోతుంది.. ఏంటి పల్లవి కింద పడ్డావు ఏమైంది నీకు అని కావాలనే కమల్ అడుగుతాడు. అరటి తొక్క మీద కాలు వేసి కింద పడ్డాను బావా అని పల్లవి అంటుంది.. నీకోసం బామ్ తీసుకొని వస్తాను అని ఎంతగా అడుగుతున్నా సరే పల్లవి మాత్రం నాకు ఏది అవసరం లేదు అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.
చక్రధర్ అలాగే మీనాక్షి పెట్టిన డ్రస్సుని ఆరాధ్య వేసుకొవాలని అనుకుంటుంది.. నాకు ఈ డ్రెస్ బాగా నచ్చింది అమ్మ ఇవాళ నేను ఇదే వేసుకుంటాను అని ఆరాధ్య ఎంత చెప్తున్నా సరే.. అవని మాత్రం సరే నీ ఇష్టం వచ్చినట్లు వేసుకో అని అంటుంది.. అయితే అది వేసుకున్న తర్వాత చాలా లూజ్ గా ఉందని ఆరాధ్య ఫీల్ అవుతుంది.. కానీ మీనాక్షి మాత్రం నువ్వేం బాధపడకు నీకు కావాల్సినట్లుగా నేను స్టిచ్ ఇస్తాను అని అంటుంది.. సూది దారం ఎక్కడ పెట్టానో నాకు అర్థం కావడం లేదు అని వెతకడానికి వెళ్తుంది మీనాక్షి.. మీరిచ్చిన డ్రెస్ ని ఆరాధ్య ఎలా వేసుకుంటుందో నేను చూస్తాను అని లోపలికి వచ్చిన పల్లవి అడ్రస్ ని కత్తిరించేస్తుంది. అది చూసిన మీనాక్షి ఫీలవుతుంది..
కమల్ అలాగే శ్రీకర్ ఇద్దరు కూడా వంట దగ్గర చూసుకుంటూనే బొండంలో వోడ్కా కలుపుకొని తాగాలని అనుకుంటారు.. కొబ్బరి బొండంలో వోడ్కా కలిపి ఎవరికీ తెలియకుండా తాగాలని అనుకుంటాడు అయితే వీరిద్దరూ తాగుతూ ఉండగా.. అక్కడికి భానుమతి అలాగే పల్లవి ఇద్దరు ఒకరి తర్వాత ఒకరు వస్తారు.. ఆ బొండంను చెరోకటి తీసుకొని ఇద్దరు తాగుతారు. అందులో మందు కలిపారు అని తెలియకుండానే వాళ్ళు తాగడంతో వీళ్ళిద్దరూ టెన్షన్ పడిపోతూ ఉంటారు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి…
Also Read :‘గుండెనిండా గుడిగంటలు’ టీఆర్పీ రేటింగ్.. మే హైలెట్ ఎపిసోడ్స్..