Nindu Noorella Saavasam Serial Today Episode: ఆరు నగలు ఎలాగైనా కొట్టేయాలనే కసితో ఉన్న మనోహరి ఆ బాధ్యతలను చంభాకు అప్పగిస్తుంది. అయితే చంభా బీరువా తాళాలు ఉంటేనే తాను ఆ పని చేయగలనని చెబితే.. అయితే నేను తాళాలు తీసుకొచ్చి ఇస్తాను. ఎవ్వరూ లేని టైంలో నగలు కొట్టేయమని మనోహరి సలహా ఇస్తుంది. చంభా సరే అంటుంది.
ఇక బీరువా తాళాలు తీసుకురావడానికి మిస్సమ్మ రూంలోకి వెళ్తుంది మనోహరి. రూం మొత్తం వెతుకుతుంది. ఎవరైనా వస్తే చెప్పమని డోర్ దగ్గర చంభాను కాపలా ఉంచుతుంది. చంభా ఇల్లు క్లీన్ చేస్తున్నట్టు డోర్ దగ్గర నిలబడి ఉంటుంది. అప్పుడే మిస్సమ్మ వెళ్తుంది. చంభాను నోరు తెరవొద్దని వార్నింగ్ ఇచ్చి రూంలోకి వెళ్తుంది మిస్సమ్మ. వెళ్లగానే.. రూంలో వెతుకుతున్న మనోహరిని చూసి ఏం వెతుకుతున్నావు మనోహరి అని అడుగుతుంది.
మిస్సమ్మ వాయిస్ వినగానే.. మనోహరి షాక్ అవుతుంది. భయంతో వణికిపోతుంది. ఇప్పుడు దీనికి ఏం చెప్పాలి అని మనసులో ఆలోచిస్తుంది. మిస్సమ్మ మాత్రం నిన్నే అడిగేది నా రూంలోకి వచ్చి ఏం వెతుకుతున్నావు మనోహరి అనగానే.. మనోహరి తడబడుతూ.. అది సేప్టీ పిన్ను కోసం వచ్చాను కనిపించడం లేదు అంటుంది.. నాకు నువ్వు వేరే ఏదో వెతుకుతున్నట్టు అనిపిస్తుంది అంటూ తన బెడ్ కింద ఉన్న నగలు తీసి బెడ్ మీద పెడుతుంది మిస్సమ్మ.
మిస్సమ్మ నగలు పైన పెట్టడం చూసి మనోహరి షాక్ అవుతుంది. ఏంటి అంత ఖరీదైన నగలు ఇంత నిర్లక్ష్యంగా బెడ్ కింద పెట్టావేంటి..? అని అడిగితే.. ఎందుకు దొంగలేమైనా వస్తారా..? మనోహరి.. ఒకవేళ వచ్చినా బీరువాలో చూసి వెళ్లిపోతారు.. కదా అంటూ నగలు తీసి బీరువాలో పెడుతూ.. మనోహరికి సేప్టీ పిన్ను ఇస్తుంది. పిన్ను తీసుకున్న మనోహరి కంగారుగా బయటకు వస్తుంది. మనోహరి బయటకు రాగానే..
చంభా భయంతో ఆ మిస్సమ్మకు దొరికిపోయావా మనోహరి అని అడుగుతుంది. లేదు కానీ అది నగలు బయట బెడ్ కింద దాచింది అంటూ చెప్పగానే.. అయ్యో మంచి చాన్స్ మిస్ అయ్యాము కదా మనోహరి అని చంభా అంటే ఇంకా ఏం కాలేదు కదా..? మేమంతా బయటకు వెళ్లాకి ఆ నగలు నువ్వు కొట్టేయ్ అని చెప్పి మనోహరి వెళ్లిపోతుంది. చంభా మాత్రం అందుకేనా నేను ఎదురుచూసేది నగలు కొట్టేసి కొల్కతా చెక్కేస్తాను అని మనసలో అనుకుంటుంది చంభా.
తర్వాత మనోహరి ఏర్పాటు చేసిన రౌడీలు పార్థును చంపేందుకు ఫారెస్టులో రెడీగా ఉంటారు. పార్థు రాగానే ఎలా చంపాలి..? చంపిన తర్వాత ఏం చేయాలి అనే విషయాలు రౌడీలకు చెప్తుంటాడు వాళ్ల బాస్. అప్పుడే మనోహరి రౌడీలకు ఫోన్ చేసి తాను పార్థుతో కలిసి కారులో వస్తున్నట్టు ఇన్డైరెక్టుగా చెప్తుంది. రౌడీలు మనోహరి మాటలు అర్థం చేసుకుని మరింత అలెర్ట్ గా ఉంటారు.
ఇక అమర్, మిస్సమ్మ కూడా లాంగ్ డ్రైవ్కు వెళ్తుంటారు. కారులో ఎఫ్ఎం ఆన్ చేయబోతుంది మిస్సమ్మ. అమర్ వద్దని నీ ఎఫ్ఎం ఉండగా మరోటి ఎందుకు అంటాడు. తాను వర్క్ చేయడం మానేసి చాలా రోజులైంది మళ్లీ ఇప్పుడు నా ఫ్రోగ్రాం ఎలా వస్తుందని మిస్సమ్మ అడిగితే.. అదే నీ నోరు ఉంది కదా కబుర్లు చెప్పమంటాడు అమర్. మిస్సమ్మ కోపంగా అమర్ను తిడుతుంది. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.