Podarillu pratap: బుల్లితెర ప్రేక్షకులను సీరియల్స్ ఎంతగానో అలరిస్తూ వస్తున్నాయి. ఈమధ్య ఒకదానికి మించి మరొక సీరియల్ రావడంతో ఎక్కువమంది టీవీ సీరియల్స్ ని చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ప్రముఖ తెలుగు ఛానల్ స్టార్ మా లో ఎన్నో కొత్త సీరియల్స్ ప్రసారం అవుతున్నాయి.. ఇక్కడ ప్రసారమవుతున్న ప్రతి సీరియల్ కూడా జనాలని బాగా ఆకట్టుకున్నాయి. అయితే ఇటీవల ప్రారంభమైన కొత్త సీరియల్ పొదరిల్లు.. గత నెల 22న ఈ సీరియల్ ప్రారంభమైంది. మొదటి రోజు నుంచి ఇప్పటివరకు కూడా సీరియల్ రోజుకో ఉత్కంఠతో ముందుకు సాగుతుంది. దాంతో ఈ సీరియల్ టిఆర్పి రేటింగ్ కూడా పాత సీరియల్ తో పోటీపడుతుంది. ఇందులో మహాలక్ష్మి తండ్రి పాత్రలో ప్రతాప్ నటించారు. ఆయన అసలు పేరు ఆనంద్. ఈయన చాలా సినిమాల్లో నటించి నటుడిగా మంచి ముద్ర వేసుకున్నారు.. ఒకరోజు ఇప్పుడు సీరియస్లలోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే సినిమాలనుంచి సీరియల్స్ కి చాలామంది సీనియర్ యాక్టర్లు వస్తూనే ఉన్నారు. ఇక్కడ కూడా వాళ్లకు రెమ్యూనరేషన్ ఎక్కువగానే ఉంది. మరి పొదరిల్లు సీరియల్ గాను ఈయన ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు ఒకసారి మనం తెలుసుకుందాం…
ఒకప్పుడు సినిమాల్లో యాక్టర్స్ గా మంచి క్యారెక్టర్లలో నటించి బిజీగా ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు వరుసగా ఒక్కొక్కరు సీరియల్స్ వల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఈమధ్య వస్తున్న కొత్త సీరియల్ అన్నిట్లలో సీనియర్ నటులు హీరోలకు తండ్రిగానూ హీరోయిన్లకు తండ్రిగానూ వచ్చేస్తున్నారు.. అలాంటి వారిలో నటుడు ఆనంద్ ఒకరు. ఈయన ప్రస్తుతం ప్రముఖ తెలుగు ఛానల్ స్టార్ మా లో ప్రసారమవుతున్న పొదరిల్లు సీరియల్ లో కీలక పాత్రలో నటిస్తున్నారు.. ఈ సీరియల్లో హీరోయిన్గా మహాలక్ష్మి నటిస్తుండగా ఆమెకు ఫాదర్గా ఈయన నటిస్తున్నాడు. ఆనంద్ ఒకప్పుడు సీరియస్లలో హీరోకి ఈక్వల్ పాత్రలో నటించారు.. ఎన్నో సినిమాల్లో నటించిన ఈయన ఇప్పుడు సీరియల్స్ లో కి సెకండ్ ఇన్నింగ్స్ ఎంట్రీ ఇచ్చారు.. ఈ సీరియల్ మంచి టాక్ ని అందుకోవడంతో ఇతనికి మంచి క్రేజ్ వచ్చేసింది. ప్రస్తుతం మరో సీరియల్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
Also Read : ‘గుండెనిండా గుడిగంట’ బాలు ఇప్పటికీ ఆ పని చేస్తున్నాడా..? గ్రేట్ కదా..
నలుగురు పెళ్ళికాని యువకులు మధ్యలోకి ఒక అమ్మాయి వస్తే ఎలా ఉండగలుగుతుంది. ఆ ఇంటి తండ్రి తాగుబోతుగా ఉంటే ఆ అమ్మాయి ఎలా తనని తాను కాపాడుకోబోతుంది.. ఇంట్లో వాళ్ళందరినీ తను మారుస్తుందా..? ఆ అమ్మాయి ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటుంది. అన్న స్టోరీ తో ఈ సీరియల్ ప్రారంభమైంది.. ప్రస్తుతం ఇందులో అమ్మాయి పాత్రలో నటిస్తున్న మహాలక్ష్మి తన పెళ్లి నుంచి తప్పించుకోవడానికి ఆ నలుగురు అన్నదమ్ముల్లోని ఒకరైన చక్రితో బయటకు వచ్చేస్తుంది. చక్రి నీ చంపేసి అమ్మాయిని తీసుకురమ్మని ప్రతాప్ చెప్తాడు. ఇందులో ప్రతాప్ పరువు కోసం ప్రాణాలు ఇచ్చే మనిషి లాగా కనిపిస్తాడు.. ప్రతాప్ అలియాస్ ఆనంద్ సినిమాల్లో కీలక పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. ఇప్పుడు ఈ సీరియల్ ద్వారా మరోసారి తెలుగు ప్రేక్షకులకు దగ్గర అయ్యారు. ఈ సీరియల్ లో ఈయన ఒకరోజు నటించినందుకు గాను 50 వేల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం.. ప్రతిరోజు షూటింగ్ ఉండడంతో ఆయన రెమ్యూనరేషన్ లక్షల్లోనే ఉంటుంది..