Intinti Ramayanam Today Episode September 5th : పల్లవి రాజేంద్రప్రసాద్ వస్తే ఎక్కడ తన బండారం బయట పడుతుందో అని టెన్షన్ పడిపోతూ ఉంటుంది. అయితే పల్లవి మాత్రం ఇంట్లోనే వాళ్ళందరూ సరదాగా గడుపుతూ ఉంటే తాను మాత్రం టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇక అక్షయ్ కమలికి కాల్ చేసి నువ్వు అర్జెంటుగా అమ్మ నాన్న తప్ప మిగిలిన వాళ్ళందరినీ ఇక్కడికి తీసుకొని రా అని చెప్తాడు. ఏమైందన్నయ్య ఎందుకు అంత కంగారు పడిపోతున్నావు అని కమల్ ఎంతగా చెప్తున్నా సరే అక్షయమాత్రం ఒంటరిగా ఇక్కడికి రా అని చెప్తాడు..
అక్షయ్ అవనీలు ఆశ్రమానికి వెళ్లడంతో అక్కడున్న డాక్టర్ సారీ అక్షయ్ గారు మేము చాలా ప్రయత్నాలు చేసాము. మీ నాన్నకి ఆల్రెడీ పరిస్థితి క్రిటికల్ గా ఉండడంతో ఆయనను మేము కాపాడలేకపోయాము అని చెప్తారు . అదేంటి డాక్టర్ ఎలా చెప్పారు ఒకరోజు ట్రీట్మెంట్ ఉంది అని చెప్పారు కదా మరి ఇప్పుడు ఎందుకు మీరు ఇలా అంటున్నారు అని అక్షయ్ అడుగుతాడు. మీ నాన్న పరిస్థితి అస్సలు బాగోలేదు.. మీ నాన్న బాడీ లోపల ఉన్న ఆర్గాన్స్ ఒక్కొక్కటి పాడవడంతో ఆయన పరిస్థితి తీవ్రంగా మారిపోయింది గత నాలుగు రోజుల నుంచి ఆయన ఆరోగ్యం అస్సలు బాగోలేదు. చిన్న ప్రయత్నం గా నేను చేసాము కానీ ఆయన బ్రతకలేదు అని చెప్పగానే అవని అక్షయ ఇద్దరు ఒక్కసారిగా గుండెలు పగిలేలా ఏడుస్తారు. ఇక రాజన్న ప్రసాద్ ని చూసి అవని అక్షయలు ఇద్దరూ బోరును ఏడ్చేస్తారు. మీరు ఏడిస్తే అందరికీ ధైర్యం ఎవరు చెప్తారు అని అవని ఎంతగా కంట్రోల్ చేయాలని చూసినా సరే అసలు వినకుండా ఏడుస్తూనే ఉంటాడు అక్షయ్.
అందరూ ఇంట్లో సరదాగా గడుపుతూ ఉంటారు ప్రణతి రావడంతో.. కమల్ ప్రణతితో బాగా ఆడుకోవాలని అనుకుంటాడు. ఇంట్లోని వాళ్ళందరూ సరదాగా ఉన్నప్పుడు అక్షయ్ కమల్ కి ఫోన్ చేసి నువ్వు వెంటనే అన్నని తీసుకుని ఆశ్రమానికి రావాలి అని చెప్తాడు. ఏముంది అన్నయ్య ఎందుకు ఆశ్రమానికి రమ్మంటున్నావు? ఏం జరిగిందో చెప్పు అని అక్షయ్ ని కమల్ ఎన్నిసార్లు అడిగినా అందర్నీ తీసుకుని ఆశ్రమానికి రావాలి అని అంటాడు. సరే అన్నయ్య నేను వందను తీసుకుని ఆశ్రమానికి వస్తాను అని అందరిని ఆశ్రమానికి వెళ్తారు. అయితే బయటే ఉన్న అవని అక్షరాలు మాత్రం ఏం జరిగిందో అన్న విషయాన్ని చెప్పకుండా లోపలికి లోపలికి వెళ్లి చూడండి అని చెప్తాడు. ఏమైంది అని ఇంట్లోని వాళ్ళందరూ టెన్షన్ పడిపోతూ ఉంటారు కానీ అక్షయ్ మాత్రం మీరందరూ లోపలికి వెళ్లి చూడండి అని చెప్తారు..
రాజేంద్రప్రసాద్ నీ బెడ్ మీద అలా చూసి కమల్ శ్రీకర్ తో పాటు ఎవ్వరూ కూడా అస్సలు తట్టుకోలేక పోతారు నాన్నకి ఏమైంది నాన్న ఎందుకు లేవలేదు అంటూ ఎమోషనల్ అయిపోతారు. అసలు ఎందుకు నాన్న ఇలా ఉన్నాడు అని కమల్ అందరికన్నా ఎక్కువగా ఏడ్చేస్తూ ఉంటాడు. కమల్ని చూస్తున్నా మిగిలిన వాళ్ళందరూ కూడా చాలా బాధపడిపోతూ ఉంటారు. కానీ పల్లవి మాత్రం ఈ ముసలోడు చచ్చాడు కాబట్టి నేను చాలా సంతోషంగా ఉన్నాను అని అంటుంది.. లేకున్నా అంటే నా గురించి అన్ని విషయాలను బయటపెట్టి నన్ను బయటికి పంపిస్తానని అన్నాడు. ఇప్పుడు ఈడ లేకుండా పోయాడు అని పల్లవి చాలా సంతోషంగా ఉంటుంది కానీ అందరూ ఏడుస్తున్నప్పుడు ఏడవకుండా ఉంటే, నాపై డౌట్ వస్తుందని పల్లవి కూడా ఏడ్చినట్టు నాటకం ఆడుతుంది..
అందరూ అంతగా ఏడుస్తున్నాడు అని చూసిన డాక్టర్ ఇక్కడ వేరే పేషెంట్ కూడా ఉన్నారు ఒక మనిషి చనిపోయాడు అని అనుకుంటే రేపు మా పరిస్థితి కూడా ఇలానే ఉంటుంది అని బాధ పడిపోతారు. మీరు వెంటనే ఇక్కడి నుంచి తీసుకొని వెళ్లి అంత్యక్రియలు నిర్వహించండి అని డాక్టర్ చెప్తాడు. ఇక రాజేంద్ర ప్రసాద్ ని తీసుకొని వెళ్లి ఈ విషయం ఎవరికీ చెప్పకుండా ఆయన అంత్యక్రియలు నిర్వహించాలి అని అక్షయ్ అంటాడు. అక్షయ్అంత్యక్రియలు నిర్వహించేస్తారు. తండ్రి చివరి చూపు కూడా తన తల్లి చూడలేదు అని అందరూ చాలా బాధపడిపోతూ ఉంటారు. రాజేంద్రప్రసాద్ తో ఉన్న బాండింగ్ గురించి ఒకసారి గుర్తు చేసుకుని కన్నీళ్లు పెట్టుకుంటారు.
రాజేంద్రప్రసాద్ కాలిపోతున్నాడు అని చాలా ఎమోషనల్ అవుతారు. ముగ్గురు అన్నదమ్ములు కూడా తన తండ్రితో గడిపిన ప్రతి క్షణాన్ని గుర్తుచేసుకొని చాలా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటారు.. ఇక కమల్ తన తండ్రి చనిపోయాడు తల్లి పరిస్థితి ఎలా ఉంటుందో అని బాధ పడిపోతూ ఉంటాడు. అసలు తన తల్లికి ఎలా చెప్పాలి. ఆమె పరిస్థితి ఎలా మారుతుంది అని బాధ పడిపోతూ ఉంటాడు. పల్లవి మాత్రం రాజేంద్రప్రసాద్ చనిపోయాడని చాలా ఆనందంగా ఉంటుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..
Also Read :ప్రభుదేవా ‘మూన్ వాక్ ‘ రిలీజ్ డేట్ లాక్.. టైం చూసి దిగుతున్నాడే..!