Ye devi varamo Neevu : ఒకప్పుడు టీవీ సీరియల్స్ అంటే కాస్త బోరింగ్ గా అనిపించేవి. కానీ ఇప్పుడు మాత్రం సినిమాలను మించిన స్టోరీలతో జనాలని విపరీతంగా ఆకట్టుకుంటూ వస్తున్నాయి. డిఫరెంట్ స్టోరీలతో పాటుగా ఫైటింగ్ సీన్లు కూడా సీరియల్స్ లో ఉండడంతో జనాలు ఇంట్రెస్టింగా ఈ సీరియల్ ని చూసేందుకు ముందుకు వస్తున్నారు. నువ్వా నేనా అంటూ పోటీ పడుతూ మరి సీరియల్స్ అలరిస్తున్నాయి. ప్రతిరోజు వచ్చే సీరియల్స్ విపరీతంగా ఆకట్టుకోవడంతో జనాలు వీటిని చూడడానికి ఎప్పుడు సిద్ధంగానే ఉంటున్నారు. మరి స్టార్ మా లో ప్రసారమవుతున్న సీరియల్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. కొత్తగా వచ్చిన సీరియల్స్ కూడా జనాలని ఆకట్టుకోవడంతో ఇక్కడ వచ్చే సీరియల్స్ కి డిమాండ్ ఎక్కువగానే ఉంటుంది. ఇటీవల కాలంలో ప్రారంభమైన ఏ దేవి వరమో నీవు సీరియల్ ప్రస్తుతం వార్తలో నిలిచింది.. ఈ సీరియల్ లో హీరో కొన్ని కారణాల వల్ల తప్పుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అందులో నిజం ఎంత ఉందో తెలియదు గానీ ఇదైతే హాట్ టాపిక్ గా మారింది. నిజంగానే ఈ సీరియల్ హీరో ఇకమీదట కనిపించడం అన్న వార్త జనాల్లో టెన్షన్ క్రియేట్ చేసింది. అందులో నిజం ఎంత ఉందో తెలియాలంటే కాస్త వివరాల్లోకి వెళ్లి తెలుసుకోవాల్సిందే..
ప్రముఖ తెలుగు ఛానల్ స్టార్ మా లో ప్రసారమవుతున్న ప్రతి సీరియల్ కూడా జనాలని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఇందులో నటిస్తున్న యాక్టర్లు అందరూ కూడా తెలిసిన వాళ్ళే అవ్వడంతో ఎక్కువ మంది జనాలు ఈ సీరియల్ ని చూస్తే ఎందుకు ముందుకు వస్తున్నారు. సీరియల్ లో హీరోగా నటిస్తున్న శ్రావణ్ కుమార్ ఇకమీదట కనిపించడు అన్న వార్త జనాలకు మింగుడు పడడం లేదు. అసలేం జరిగింది ఎందుకు హీరో సీరియల్ నుంచి సడన్గా తప్పుకుంటున్నాడు అని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. ఇటీవల తనకు ఒక యాక్సిడెంట్ జరిగిందని వీడియోని షేర్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు దానివల్లే సీరియల్స్ కి కొంత గ్యాప్ తీసుకోబోతున్నాడు అని తెలుస్తుంది.. మరి నిజంగానే అతను గ్యాప్ తీసుకుంటున్నాడా లేదా సీరియల్ నుంచి శాశ్వతంగా తప్పుకున్నాడు అన్నది తెలియలేదు కానీ ప్రస్తుతం ఇదైతే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.. ఏది ఏమైనా కూడా హీరోయిన్ హీరో బాగున్నారు అనుకున్నప్పుడు ఇలాంటి వార్తలు వినడంతో అభిమానులు చాలా ఫీల్ అవుతున్నారు. మరి దీనిపై త్వరలోనే ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం..
బుల్లితెర హీరో శ్రావణ్ కుమార్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. గతంలో ఈయన తెలుగులో అనేక సీరియల్స్ లలో నటించి ప్రేక్షకులను తన నటనతో మెప్పించాడు. ఈ హీరో గురించి ఇప్పటివరకు ఎన్నో రకాల వార్తలు వినిపించాయి. మగువ ఓ మగువ, అత్తారింటికి దారేది, అమ్మకు ప్రేమతో, పల్లకిలో పెళ్లికూతురు వంటి సూపర్ హిట్ సీరియల్స్ లలో నటించారు. ఈ సీరియల్స్ అన్నీ కూడా మంచి టాక్ ని సొంతం చేసుకోవడంతో ఇతనికి డిమాండ్ కూడా కాస్త ఎక్కువగానే ఉంది.. ఇప్పుడొచ్చిన కొత్త సీరియల్ లో కూడా తన నటనతో ప్రేక్షకులను మెప్పించాడు. అయితే సడన్గా తనకి ఒక యాక్సిడెంట్ అవ్వడంతో సీరియల్ కి దూరమైనట్లు తెలుస్తుంది. ఇప్పటివరకు ఈ సీరియల్ ద్వారా మంచి క్రేజీన అందుకున్న శ్రావణ్ కుమార్ సడన్గా సీరియల్ నుంచి తప్పుకోవడంతో అభిమానులు చాలా ఫీల్ అవుతున్నారు. ఈ సీరియల్ పై ఒక క్లారిటీ రావాల్సి ఉంది..
Also Read :అమ్మబాబోయ్.. మనీష బాగా రిచ్.. హీరోయిన్ల కంటే ఎక్కువే..