Telugu TV Serials : బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న వాటిలో ఎక్కువగా సీరియల్స్ ఉన్నాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు.. ఒక్కో సీరియల్ ఒక్కో స్టోరీ తో రావడంతో ఆడియన్స్ ఎక్కువగా సీరియల్స్ చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.. ఇటీవల కొత్త సీరియల్స్ బాగానే వస్తున్నాయి.. టీఆర్పీ రేటింగ్ ను పెంచుకోవడం కోసం సరికొత్త సీరియల్స్ ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేస్తున్నాయి.. ప్రతి సీరియల్ కూడా స్టోరీ తో పాటుగా కొన్ని గ్రాఫిక్స్ తో కూడా ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి.. స్టార్ మా చానల్లో ప్రసారమవుతున్న ప్రతి సీరియల్ కూడా జనాలను బాగా ఆకట్టుకుంటున్నాయి.. అలాగే మంచి టీఆర్పీ రేటింగ్ ఉండటంతో జనాలు వీటిని చూసేందుకు ఎగబడుతున్నారు. కొత్త సీరియల్ రావడంతో మిగిలిన సీరియల్స్ రేటింగ్ పడిపోయింది..ఇప్పుడు కొన్ని సీరియల్స్ స్టోరీలు బోరింగ్ గా ఉండటంతో వాటికి త్వరలోనే శుభం కార్డు వేసుకోబోతున్నాయని ఓ వార్త చక్కర్లు కొడుతుంది.. ఆ సీరియల్స్ ఏవి? ఆ స్టోరీ ఏంటో ఒకసారి తెలుసుకుందాం..
ప్రముఖ తెలుగు ఛానెల్ స్టార్ మా ప్రేక్షకులను అలరించడానికి ముందుంటుంది. ఈ ఛానెల్ లో ప్రసారం అవుతున్న ప్రతి సీరియల్ ఆడియన్స్ ను అలరిస్తున్నాయి. అందులో కొన్ని సీరియల్స్ కు ప్రత్యేకత ఉంటుంది. అలాంటి వాటిలో ఇల్లు ఇల్లాలు పిల్లలు ఒకటి.. ఈ సీరియల్ టిఆర్పి రేటింగ్ విషయంలో ముందు ఉంటుంది. ఇక్కడ ప్రసారం అవుతున్న వాటిలో కార్తీకదీపం 2 మొదటి స్థానంలో ఉండగా.. రెండో స్థానంలో ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఉంది. తండ్రి తన పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకుంటాడు. ఎవరు ఎంతగా అవమానించిన సరే అతను మాత్రం ఎక్కడ తగ్గకుండా కుటుంబం కోసం నిలబడతాడు.. ఆ ఇంటికి కోడలుగా వచ్చిన పెద్ద కోడలు అధికారం మొత్తం తన చేతిలోకి రావాలని విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటాది. ఇప్పుడు ఆమె చదువు గురించి బయట పడటంతో పాటుగా ఇంగ్లీష్ రాకపోయిన టీచర్ గా సెలెక్ట్ అవుతుంది. ఆ కక్ష్యతో అందుకు కారణమైన ప్రేమను నర్మదాలను ఇబ్బంది పెట్టాలని అనుకుంటుంది.. ఇక అమూల్య ప్రేమ గురించి ఇంట్లో బయట పెడతారు. అమూల్యని వేరే వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేయాలని ఇంట్లోని వాళ్ళందరూ ఫిక్స్ అవుతారు. ప్రేమ ధీరజ్ మధ్య దూరం మాత్రం పెరిగి పోయి ఉంటుంది. ఈమధ్య కొన్ని ఎపిసోడ్లలో బోరింగ్ సీన్లు ఉండడంతో వెంటనే టిఆర్పి రేటింగ్ పడిపోతుంది అన్న ఫీలింగ్ జనాలతో వస్తుంది. మరి ఈ సీరియల్ కొద్ది రోజుల్లోనే శుభం కార్డు వేసుకోబోతుంది అని వార్తలు వినిపిస్తున్నాయి.. ప్రస్తుతం ఈ సీరియల్ టిఆర్పి రేటింగ్ 13 ఉంది. మరి ఇకముందు దీని టిఆర్పి రేటింగ్ పెరుగుతుందా లేదా అన్నది చూడాలి..
తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న సీరియల్స్ లలో స్టార్ మా ఛానల్ లో ప్రసారమవుతున్న ఇంటింటి రామాయణం ఒకటి. ఇప్పటివరకు ఏ సీరియల్ రివెంజ్ స్టోరీ తో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.. పల్లవి, చక్రధర్ పాత్రలు జనాల నుంచి విమర్శలు కూడా అందుకున్నాయి. విలన్స్ గా ఇద్దరు కూడా జనాలకు కోపాన్ని తెప్పిస్తున్నారు. తను ప్రేమించిన వ్యక్తి దక్కలేదు నీ పల్లవి తను కోడలు పెట్టిన ఇంటిని ముక్కలు చేయాలని అనుకుంటుంది. కానీ ఆ ఇంటి పెద్ద కోడలు మాత్రం తన కుటుంబాన్ని ఎప్పటికప్పుడు కాపాడుకుంటూ వస్తుంది. ప్రస్తుతం ఈ సీరియల్ లో ఆస్తి కోసం ఇంటి సభ్యులు కూడా పడుతూ ఉంటారు. రోజు ఇంట్లో జరుగుతున్న గొడవల కారణంగా చింటూ రోజు రోజుకి టీఆర్పి రేటింగ్ తగ్గిపోతుందని తెలుస్తుంది. ఆస్తి కోసం ఇంట్లో జరిగే కొన్ని డ్రామాలు జనాలని ఆకట్టుకోలేదు. దాంతో ఈ సీరియల్ త్వరలోనే శుభం కార్డు పడిపోతుందని ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.. ప్రస్తుతం ఈ సీరియల్ టిఆర్పి రేటింగ్ 12.23 ఉన్నట్లు తెలుస్తుంది.
మరి ఈ రెండు సీరియల్స్ కూడా టాప్ రేటింగ్ తో దూసుకుపోతున్నాయి.. కానీ ఈ వారం మాత్రం ఈ సీరియల్ రేటింగ్ పడిపోయినట్లు తెలుస్తుంది. ఈమధ్య స్టార్ మా లో పొదిరిల్లు, నువ్వు లేక నేను లేను అనే సీరియల్ కొత్తగా ప్రసారమవుతున్నాయి. వీటి వల్లే టిఆర్పి రేటింగ్ తగ్గిపోతుందని వార్తలు ప్రచారంలో ఉన్నాయి. మరి ఈ సీరియల్స్ ఈ వారంలో రేటింగ్ పెరుగుతుందో లేదో చూద్దాం..