Telugu Serials : తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న సీరియల్స్ కు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒక్కో సీరియల్ ఒక్కో స్టోరీ తో రావడంతో జనాలు వీటిని చూసి ఎందుకు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు.. ఇటీవల కాలంలో వచ్చిన సీరియల్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి.. ప్రతి సీరియల్ కూడా డిఫరెంట్ కాన్సెప్ట్ రావడంతో అన్ని సీరియల్స్ కి జనాలు ఓట్లు వేస్తున్నారు.. ముఖ్యంగా ప్రముఖ తెలుగు ఛానల్ స్టార్ మా లో ప్రసారమవుతున్న ప్రతి సీరియల్ కూడా జనాల నుంచి మంచి రెస్పాన్స్ ని అందుకోవడంతోపాటుగా టిఆర్పి రేటింగ్ కూడా సొంతం చేసుకుంటున్నాయి. మరి ఈవారం సీరియల్స్ టాక్ ఎలా ఉంది..? టాక్ ఆఫ్ ది సీరియల్ ఏది అన్నది ఒకసారి మన వివరంగా తెలుసుకుందాం..
స్టార్ మా ఛానల్ లో ప్రసారమవుతున్న సీరియల్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఈవారం టాప్ లో ఉన్న సీరియల్ అంటే కార్తీకదీపం సీరియల్ అనే వినిపిస్తుంది.. రెండో స్థానంలో ఎప్పటిలాగే గుండెనిండా గుడి గంటలు సీరియల్ కొనసాగుతుంది. ఈవారం మూడవ స్థానంలోకి ఇంటింటి రామాయణం వచ్చింది.. గత కొన్ని రోజులుగా ఈ సీరియల్ ప్రేక్షకులను సస్పెన్స్ లతో ఆకట్టుకుంటుంది.. పల్లవి మారిపోవడం సీరియల్ కి పెద్ద ట్విస్ట్ అనే చెప్పాలి.. ఏదో ప్లాన్ లో భాగంగానే ఆమె మారిపోయినట్టు నటిస్తుంది అని జనాలకి అర్థం అయిపోతుంది.. మరి ఈ సీరియల్ లో నిజంగానే పల్లవి మారిపోయిందా లేదా అన్నది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది.. ఇక నాలుగవ స్థానంలో ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ కొనసాగుతుంది.. స్థానంలో ఎప్పటిలాగే పొదరిల్లు కొనసాగుతుంది.. మొత్తానికి ఈ వారంలో టాప్ రేటింగ్ తో దూసుకుపోతుంది మాత్రం కార్తీక దీపం 2.. మరి వచ్చే వారం అయినా ఈ సీరియల్ ప్లేస్ ని రీప్లేస్ చేస్తే సీరియల్ ఉంటుందేమో చూడాలి..
తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఇంటింటి రామాయణం సీరియల్ ఎన్నో ఏళ్లుగా ప్రసారమవుతుంది.. అవినీ క్యారెక్టర్ ప్రతి తెలుగు ప్రేక్షకులను కనెక్ట్ అయ్యేలా చేస్తుంది.. తన మంచితనం కుటుంబాన్ని కాపాడుకోవాలన్న ధైర్యం అందరిని ఆకట్టుకుంటుంది.. ఆమె చేసే ప్రతి ప్రయత్నం కూడా ఇంట్లోని ప్రతి ఒక్క కోడలు చేయాలి అని అనుకుంటారు.. ఇక సెకండ్ విలన్ పాత్రలో నటిస్తున్న పల్లవి ఈ సీరియల్కు హైలెట్గా నిలిచింది.. ఎప్పుడూ కుటుంబంలో వాళ్లకి సంతోషం లేకుండా చేయాలని చూసే పల్లవి మాత్రం ఇప్పుడు మారిపోయిందని తెలుస్తుంది. ఈ సీరియల్ లో పల్లవి చేసే ప్రతి పని కూడా అవనీకి తెలుస్తుంది.. పల్లవి మారిపోవడం అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.. పల్లవిని టార్గెట్ చేస్తున్న అశ్విన్ మాత్రం ఎలాగైనా సరే తన జీవితాన్ని నాశనం చేయాలని అనుకుంటాడు.. ఇకపోతే పూర్తిగా మారిపోయిన శ్రీయ అవనికి సపోర్ట్ గా నిలుస్తూనే ఉంటుంది.. మరి రేపటి ఎపిసోడ్ లో శ్రేయ బాబుని కిడ్నాప్ చేసేందుకు దొంగలు ప్లాన్ చేస్తారు.. ఒకవేళ బాబు కిడ్నాప్ అయితే ఇంట్లో పరిస్థితులు ఎలా ఉంటాయి? అసలు ఏం జరుగుతుంది అన్నది ఊహించలేని పరిస్థితిలో కనిపిస్తుంది.. సస్పెన్స్ కి తెరపడాలి అంటే సోమవారం ఎపిసోడ్ ని మిస్ అవ్వకుండా చూడాల్సిందే..