Intinti Ramayanam Serial : తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న టాప్ రేటింగ్ సీరియల్స్లలో ఇంటింటి రామాయణం సీరియల్ కూడా ఒకటి.. ఈ సీరియల్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. సోమవారం నుంచి శనివారం వరకు ప్రసారమవుతున్న ఈ సీరియల్ డిఫరెంట్ స్టోరీ తో ఫ్యామిలీ ఆడియన్స్ ని ఎంతగా ఆకట్టుకుంటుందో చెప్పనక్కర్లేదు.. ఫ్యామిలీ డ్రామా తో జనాలని కనెక్ట్ అయ్యేలా చేసిన ఈ సీరియల్ ఇకమీదట కనిపించదు అన్న వార్త ప్రస్తుతం సంచలనంగా మారింది.. ఈమధ్య ఈ సీరియల్ అనుకోని ట్విస్టులతో జనాలని విపరీతంగా ఆకట్టుకుంటుంది.. ప్రస్తుతం టాప్ రేటింగ్ తో దూసుకుపోతున్న సీరియల్ కు శుభం కార్డు పడబోతుందని అభిమానులు ఫీల్ అవుతున్నారు. ఇందులో నిజం ఎంత ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఇదైతే హాట్ టాపిక్ గా మారింది. మరి ఇందులో నిజమేంత ఉందో తెలియాలంటే కాస్త వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం..
తెలుగు ఆడియన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంటున్న ఇంటింటి రామాయణం సీరియల్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. ప్రముఖ తెలుగు ఛానల్ స్టార్ మా లో ప్రసారమవుతున్న టాప్ రేటింగ్ సీరియల్స్లలో ఇంటింటి రామాయణం సీరియల్ కూడా ఒకటి.. మొన్నటి వరకు కార్తీకదీపం ని ఓడించిన ఈ సీరియల్ ఇప్పుడు త్వరలోనే శుభం కార్డు పడబోతుంది అని ఓ వార్త నెట్టింట ప్రచారంలో ఉంది. అలాంటి వార్తలు వినిపించడానికి కారణం ఈ సీరియల్ లో రాజేశ్వరి క్యారెక్టర్ ని లేపేయడమే.. పల్లవికి తల్లి పాత్రలో నటించిన రాజేశ్వరి చనిపోవడం సీరియల్ కి అనుకోని ట్విస్ట్ అని చెప్పాలి. ఈమె ఉన్నంతవరకు ఎత్తుకు పై ఎత్తు అని పల్లవి రాజేశ్వరి ఇద్దరు కూడా ప్లాన్లు వేస్తూ అవని వాళ్ళ కుటుంబాన్ని ఇబ్బందులు పెట్టేవారు.. ఇప్పుడు రాజేశ్వరి చనిపోవడంతో సీరియల్ శుభం కార్డు వేసుకునే అవకాశాలు ఉన్నాయి అంటూ కొందరు నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు పెడుతున్నారు.. అందులోనూ కొత్త సీరియల్స్ కూడా ప్రారంభం అవ్వడానికి రెడీగా ఉండడంతో నిజంగానే ఇంటింటి రామాయణం సీరియల్ ఇక ప్రసారం అవ్వదు అని కొందరు ఫీలవుతున్నారు.. ఏది ఏమైనా కూడా టాప్ రేటింగ్ లో ఉన్న ఈ సీరియల్ వెళ్ళిపోతుంది అని అర్థమవుతుంది. ఇందులో నిజం ఎంత ఉందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే..
పల్లవి తన తల్లి చనిపోవడానికి కారణం చక్రధర్ అవని అని వాళ్లపై కక్ష పెంచుకుంటుంది.. వాళ్లని ఇక జీవితంలో క్షమించను అని అనుకుంటుంది. భరత్ తలకొరివి పెట్టడంతో తన తల్లి ఆత్మ శాంతించి ఉంటుంది అని అవని కూడా అనుకుంటుంది.. ప్రస్తుతం రాజేశ్వరి చనిపోవడంతో పల్లవి ఇంకా కోపంగా మారిపోతుంది.. అటు అవని అక్షయలను విడగొట్టి వాళ్లకి కూడా ఇలాంటి బాధలు క్రియేట్ చేయాలి అని అనుకుంటుంది.. అందుతున్న సమాచారం ప్రకారం.. పల్లవి తన తల్లి చనిపోవడానికి కారణం అవనినేని పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడానికి వెళుతుంది.. మరి రేపటి ఎపిసోడ్ లో రాజేంద్రప్రసాద్ ఇంటికి పోలీసులు వచ్చి అవనిని అరెస్ట్ చేస్తారని తెలుస్తుంది.. అయితే మీనాక్షి వల్ల ఇదంతా జరగడంతో తనని అరెస్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. ఏది ఏమైనా కూడా రేపటి ఎపిసోడ్ మాత్రం ప్రేక్షకులను బాగా ఎంటర్టైన్ చేస్తుందని అర్థమవుతుంది.. రేపటి ఎపిసోడ్లో ఎలాంటి ట్విస్టులు ఉండబోతాయో తెలియాలంటే అసలు మిస్ అవ్వకుండా ఎపిసోడ్ని చూడాల్సిందే..
Also Read :Podarillu Today Episode : చక్రీ కిడ్నాప్.. లలితకు దిమ్మతిరిగే కౌంటర్.. చక్రీ కోసం మహా టెన్షన్..