Bigg Boss:బుల్లితెర ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 మరికొద్ది రోజుల్లో షురూ కాబోతోంది. కింగ్ నాగార్జున హోస్ట్గా రాబోతున్న ఈ కొత్త సీజన్ కోసం ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే కామన్ మ్యాన్ ఎంట్రీ కోసం జరుగుతున్న ‘అగ్ని పరీక్ష’ రసవత్తరంగా సాగుతుండగా, హౌస్లోకి వెళ్లే సెలబ్రిటీల జాబితాపై రోజుకో కొత్త వార్త నెట్టింట హల్చల్ చేస్తోంది. ఈ క్రమంలోనే ఒక క్రేజీ సీరియల్ నటి మైండ్ బ్లాకింగ్ పారితోషికంతో ఎంట్రీ ఇస్తోందనే వార్త లీక్ అయి గ్లామర్ ప్రియుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది.
సామాన్యులకు హౌస్లో అవకాశం కల్పించేందుకు నిర్వహిస్తున్న ‘అగ్ని పరీక్ష’ షోలో ఇప్పటికే గొడవలు, రచ్చ మొదలయ్యాయి. జడ్జిలుగా ఉన్న నవదీప్, బిందు మాధవిల తీర్పులపై కంటెస్టెంట్లతో పాటు మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ నటరాజ్ మాస్టర్ కూడా సీరియస్ అవ్వడం చూశాం. దీంతో షో ప్రారంభానికి ముందే వాతావరణం బాగా వేడెక్కింది.
ఈసారి కంటెస్టెంట్ల లిస్టులో చాలామంది క్రేజీ నేమ్స్ వినిపిస్తున్నాయి. ఇటీవల ట్రెండింగ్లో నిలిచిన ఈశ్వర సాయి, మాధురి రాథోడ్లతో పాటు జబర్దస్త్ పవిత్ర, వర్ష, ముఖేష్ గౌడ, రామ్ ప్రసాద్, పొట్టి నరేష్ పేర్లు ప్రచారంలో ఉన్నాయి. వీరి ఎంట్రీతో షోలో కామెడీ, డ్రామా పుష్కలంగా ఉండబోతోందని తెలుస్తోంది.
ఇక ఈ లిస్టులోకి తాజాగా చేరిన మరో హాట్ పేరు ‘ఎన్నెన్నో జన్మల బంధం’ సీరియల్ ఫేమ్ దేబ్జానీ మోదక్. తన అందచందాలతో, నటనతో బుల్లితెరపై ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న ఈ బెంగాలీ భామ, ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లోకి అడుగుపెట్టబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈమె రాకతో షోకి గ్లామర్ డోస్ మరింత పెరగడం ఖాయం.
also read:జిమ్ వర్కౌట్స్ తో సెగలు రేపుతున్న అనసూయ.. వీడియో వైరల్..!
దేబ్జానీకి ఉన్న పాపులారిటీని దృష్టిలో పెట్టుకుని బిగ్ బాస్ టీమ్ ఆమెకు భారీ ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం. వారానికి ఏకంగా రూ.4 లక్షల వరకు రెమ్యూనరేషన్ ఇచ్చేందుకు మేకర్స్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్. ఈ ఆఫర్కు ఆమె కూడా ఓకే చెప్పడంతో బిగ్ బాస్ ఎంట్రీ దాదాపు ఖాయమైపోయినట్లేనని ప్రచారం జరుగుతోంది.
అత్యంత భారీ రెమ్యూనరేషన్తో హౌస్లోకి ఎంట్రీ ఇస్తున్న ఈ గ్లామరస్ బ్యూటీ, తన ఆటతీరుతో ప్రేక్షకులను ఎలా మెప్పిస్తుందో, షోలో ఎలాంటి హంగామా సృష్టిస్తుందో చూడాలంటే సీజన్ 10 మొదలయ్యే వరకు ఆగాల్సిందే.