PAK VS ENG LORDS TEST: పాకిస్తాన్ వర్సెస్ ఇంగ్లాండ్ (Pakistan vs England) మధ్య ఇవాల్టి నుంచి రెండు టెస్ట్ ( Pakistan tour of England 2026) ప్రారంభం కాబోతున్న సంగతి తెలిసిందే. లండన్ లోని లార్డ్స్ వేదికగా ( Lord’s, London) ఈ మ్యాచ్ మధ్యాహ్నం మూడున్నర గంటలకు ప్రారంభం కావాల్సి ఉంది. అయితే వర్షం పడుతున్న నేపథ్యంలో ఇప్పటి వరకు మ్యాచ్ ఇంకా షురూ కాలేదు. ఇవాళ మ్యాచ్ జరగడం కూడా డౌట్ అని అంటున్నారు. ఇలాంటి నేపథ్యంలో పాకిస్తాన్ ప్లేయర్లను ఇంగ్లాండ్ అవమానించినట్లు సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్ అవుతున్నాయి. లార్డ్స్ లో ఫోటోషూట్ లో పాల్గొనేందుకు వచ్చిన పాకిస్తాన్ ప్లేయర్లతో కుర్చీలు మోయించింది ఇంగ్లాండ్. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి.
పాకిస్తాన్ వర్సెస్ ఇంగ్లాండ్ (England vs Pakistan, 2nd Test) మధ్య లార్డ్స్ వేదికగా ఇవాళ రెండో టెస్టు ప్రారంభం కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నిన్న సాయంత్రమే పాకిస్తాన్ ప్లేయర్లు లార్డ్స్ స్టేడియంలో ఫోటోషూట్ లో పాల్గొన్నారు. సౌరవ్ గంగూలీ జెర్సీ విడిచిన బాల్కనీ దగ్గర ప్లేయర్ లందరూ సందడి చేస్తూ ఫోటోలు దిగారు. ఆ తర్వాత మైదానంలో కుర్చీలు వేసుకొని కూడా ఫోటోలు దిగి సందడి చేశారు.
అయితే ఈ కుర్చీలను కెప్టెన్ బాబర్ ఆజం, సల్మాన్ అలీ, మహమ్మద్ రిజ్వాన్ లాంటి కీలక ప్లేయర్లు తీసుకువచ్చారు. టెంట్ హౌస్ లో పనిచేసే లేబర్ ల తరహాలో ఈ పాకిస్తాన్ క్రికెటర్లు కుర్చీలు మోశారు. దీనికి సంబంధించిన ఫోటోలు బయటకు వచ్చాయి. ఇది చూసిన నెటిజెన్స్ పాకిస్తాన్ ప్లేయర్ల పరువు తీస్తున్నారు. మీరు క్రికెట్ ఆడడానికి వెళ్లారా ? లేక లేబర్ పని చేసేందుకు వెళ్లారా ? అంటూ దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు. అక్కడే బాత్రూంలు కూడా క్లీన్ చేయండి అంటూ ఆడుకుంటున్నారు.
ఫోటోషూట్ కోసం ఎగబడ్డ పాకిస్తాన్ ప్లేయర్లను సోషల్ మీడియాలో దారుణంగా ట్రోలింగ్ చేస్తున్న క్రమంలో.. మరో అంశం కూడా తెరపైకి వచ్చింది. మ్యాచ్ ఆడడం కంటే ఫోటోలు దిగడం పైన పాకిస్తాన్ క్రికెటర్లు ఫోకస్ పెట్టారని.. అందుకే కుర్చీలు కూడా మోసుకుని వచ్చారని సెటైర్లు పేల్చుతున్నారు. మ్యాచ్ ఆడమంటే చేతకాదు కానీ.. ఫోటోలు మాత్రం దిగుతున్నారని ఫైర్ అవుతున్నారు. ఫోటోల కోసం బాబర్ ఆజం, మహమ్మద్ రిజ్వాన్ లాంటి ఆటగాళ్లు ఉండడం పాకిస్తాన్ పరుగులు మరింత దిగజార్చుతున్నాయి. ఫోటోల పైన ఉన్న పిచ్చిని.. పాకిస్తాన్ జట్టును గెలిపించడంలో చూపించాలని చురకలు అంటిస్తున్నారు.