BigTV English
Advertisement

Jairam Ramesh Counter: బీజేపీ లెక్క తప్పడం ఖాయం.. జైరామ్ కౌంటర్.. లోగుట్టు బయటకు!

Jairam Ramesh Counter:  బీజేపీ లెక్క తప్పడం ఖాయం.. జైరామ్ కౌంటర్.. లోగుట్టు బయటకు!
Congress Jairam Ramesh counter on BJPs 400 seats slogan for LS polls
Congress Jairam Ramesh counter on BJPs 400 seats slogan for LS polls

Jairam Ramesh Counter to BJP: లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 400 సీట్లు గెలుస్తుందా? ఇంతకీ కమలం పార్టీకి ఆ సత్తా ఉందా? కేవలం ఎన్నికల్లో ప్రత్యర్థులను భయపెట్టడానికే ఆ నినాదం ఇచ్చిందా? అసలు సౌత్‌లో బీజేపీ ఉనికే లేదు. అలాంటప్పుడు అన్ని సీట్లు ఎలా వస్తాయన్నది కాంగ్రెస్ ప్రశ్న. దీనికి కౌంటర్ ఇవ్వడం మొదలుపెట్టింది కాంగ్రెస్. లెక్కలతో సహా విడమరిచి చెప్పారు కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్‌రమేష్.


ప్రస్తుతం బీజేపీ నినాదం ఒక్కటే. నాలుగు వందల సీట్లు గెలవడమే లక్ష్యం. ఏ ప్రాంతంలో సభలు పెట్టినా ప్రధాని నరేంద్రమోడీ మొదటగా చెప్పే మాటే ఇది. బీజేపీ స్లోగన్‌పై కాంగ్రెస్ ఎదురుదాడి మొదలుపెట్టింది. ముఖ్యంగా రాహుల్‌గాంధీ ఓ అడుగు ముందుకేసి కేవలం ఈవీఎంల వల్ల మాత్రమే బీజేపీ నాలుగు వందల సీట్లు సాధ్యమన్నారు. అంత కచ్చితంగా చెబుతున్నారంటే కారణం అదేనని అన్నారు కూడా.

ఇప్పుడు కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేష్ వంతైంది. గతంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన స్లోగన్ చిట్టాను బయటపెట్టారు. బీజేపీ సీట్ల నినాదం ఎప్పుడిచ్చినా ఆ పార్టీ అమాంతంగా సీట్లు తగ్గిన సందర్భాలు న్నాయని గుర్తు చేశారు. ఈ క్రమంలో గుజరాత్ మొదలు ఢిల్లీ, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, తమిళనాడు ఇలా వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సమయంలో కమలనాధులు ఇచ్చిన నినాదాలను బయటపెట్టారు. ఈ లెక్కన లోక్‌సభ ఎన్నికల్లో వారి లెక్క తప్పడం ఖాయమని కుండబద్దలు కొట్టేశారు. జైరామ్ లెక్కలు చూస్తుంటే నిజమేనన్న భావన చాలా పార్టీల్లో కూడా వ్యక్తమవుతోంది.


Also Read:  దేశ రాజకీయాల్లో సంచలనం.. మోదీపై పోటీకి సిద్ధమైన.. ప్రపంచంలోనే తొలి ట్రాన్స్‌జెండర్‌..!

Tags

Related News

Obesity Awareness: దేశంలో పెద్ద సమస్య ఊబకాయం.. ఫిట్ ఇండియానే పరిష్కారమా? కేంద్రం ప్లానేంటి?

Fire Accident: ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం.. వందల ఇళ్లు మంటల్లో పూర్తిగా ధ్వంసం

Jammu Kashmir Encounter: కశ్మీర్ లో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు టెర్రరిస్టులను లేపేసిన భారత ఆర్మీ

Vandemataram 150 Years: వందేమాతరం కోట్ల మంది భారతీయులకు స్ఫూర్తి.. భవిష్యత్తుకు సరికొత్త భరోసా: ప్రధాని మోదీ

Myanmar Cyber Fraud Victims: మయన్మార్ నుంచి స్వదేశానికి 270 మంది భారతీయులు

Supreme Court On Street Dogs: వీధి కుక్కల కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. స్కూళ్లు, రైల్వే స్టేషన్లకు 8 వారాల్లోగా ఫెన్సింగ్

Delhi IGI Airport: దిల్లీ ఇందిరా గాంధీ ఎయిర్ పోర్టులో సాంకేతిక సమస్య.. 100కి పైగా విమానాలు ఆలస్యం

150 Years of Vande Mataram: వందేమాతరం గీతానికి 150 ఏళ్లు.. రేపు రాష్ట్రవ్యాప్తంగా సామూహిక గానం

Big Stories

×