E-Paper
Advertisement

Uttam Kumar Reddy : రూ.56 వేల కోట్ల నష్టాల్లో పౌరసరఫరాల శాఖ.. గత పాలకుల వైఫల్యమే..

Uttam Kumar Reddy : రూ.56 వేల కోట్ల నష్టాల్లో పౌరసరఫరాల శాఖ.. గత పాలకుల వైఫల్యమే..
Advertisement

Uttam Kumar Reddy : గత పాలకుల వైఫల్యం వల్లే పౌరసరఫరాల శాఖ రూ. 56 వేల కోట్ల నష్టాల్లో ఉందని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ లో సివిల్ సప్లై అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ధాన్యం సేకరణ, మిల్లింగ్ సామర్థ్యం, బియ్యం నాణ్యతపై అధికారులు మంత్రికి వివరించారు. అనంతరం మీడియాతో మంత్రి మాట్లాడుతూ గత పాలకుల వైఫల్యం వల్లే పౌరసరఫరాల శాఖలో తప్పిదాలు జరిగాయన్నారు.

పేదలకు నాణ్యమైన బియ్యం ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. మరో వంద రోజుల్లో రూ. 500కే గ్యాస్ సిలిండర్ ను అందజేస్తామని మంత్రి తెలిపారు. గత పాలకుల వైఫల్యం వల్ల పౌరసరఫరాల శాఖ ఆర్థిక పరిస్థతి ఆందోళనకరంగా ఉందన్నారు. 12 శాతం మంది వినియోగదారులు రేషన్ కార్డులు ఉపయోగించలేదని పేర్కొన్నారు. ప్రజలకు ఉచితంగా ఇచ్చే బియ్యాన్ని వారు ఉపయోగించుకుంటున్నారా లేదా అన్నది అధికారులు గమనించాలన్నారు. అవి పేదలు తినకపోతే ఉచిత బియ్యం పథకం నిరుపయోగం అవుతుందన్నారు. మొక్కుబడిగా బియ్యం పంపిణీ కాకుండా.. లోపాలు ఎక్కడ ఉన్నాయో వెతకాలన్నారు.

Advertisement

రేషన్ బియ్యాన్ని వినియోగదారులు వినియోగించుకోకపోవడం వల్ల కొందరు దళారులు బియ్యాన్ని పక్కదారి పట్టించి సొమ్ము చేసుకుంటున్నారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. దీనిని తక్షణమే అరికట్టాలని అధికారులను మంత్రి ఆదేశించారు. రైతుల నుంచి ధాన్యం సేకరణ పారదర్శకంగా జరగాలన్నారు. మిల్లర్ల సమస్యలపై అధికారులతో చర్చించానని తెలిపారు. కొత్త రేషన్ కార్డు దరఖాస్తులపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని అన్నారు. ప్రజలకు అవినీతిలేని.. పారదర్శకమైన పాలన అందిస్తామని స్పష్టం చేశారు. వరికి రూ.500 బోనస్ ను మరో 100 రోజుల్లో అమలు చేస్తామని మంత్రి తెలిపారు.

Tags

Related News

తెలంగాణలో కొత్త పింఛన్‌‌దారులకు బిగ్ రిలీఫ్.. ఆపై ప్రభుత్వం ప్రకటన

కాంగ్రెస్‌కు కొండా‌ గుడ్‌బై? త్వరలో భారీ అప్‌డేట్ అంటూ పోస్ట్, వాస్తవం ఏమిటంటే?

తెలంగాణ సీఎం భద్రతా సమాచారం లీక్.. తెలుగు స్క్రైబ్ నిర్వాహకులపై కేసు, అసలేం జరిగింది?

రేవంత్‌ కేబినెట్‌లోకి మరో ఫైర్‌బ్రాండ్.. హైకమాండ్‌తో విజయశాంతి మంతనాలు, ఆ శాఖ కోసం పట్టు

సొంత పార్టీని ముంచేస్తున్న నేతల దూకుడు.. కాంగ్రెస్‌ పార్టీలో నెక్స్ట్ ఏ సీనియర్ టార్గెట్?

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

Big Stories

Advertisement
×