Adithya Parasri Swamy: మన ఇంటి గోడలపై బల్లులు ఉండటం అనేది సర్వసాధారణం. అయితే కొన్నిసార్లు అవి అకస్మాత్తుగా శబ్ధం చేస్తుంటాయి. దీంతో చాలామందికి ఇంట్లో బల్లి పలకడం శుభమా? అశుభమా? అనే సందేహం ఉంటుంది. దీని గురించి తెలంగాణ అంబాత్రయ క్షేత్రం వ్యవస్థాపకుడు శ్రీ శ్రీ శ్రీ ఆదిత్య పరశ్రీ స్వామిజీ ఏం చెబుతున్నారో ఆయన మాటల్లోనే విందాం..
‘బల్లి పలికేటువంటి శబ్దం సత్యం. అది శుభం, అశుభాలు రెండింటి మీద ఆధారపడి ఉంటుంది. కానీ దీనిని నమ్మవచ్చు కదా అని భావించి.. నమ్మకానికి బానిసలై మూఢత్వంలోకి వెళ్లొద్దు. శకున శాస్త్రం మీద అనుభవం పొందిన వాళ్లు, ప్రకృతి ధర్మం మీద రిసెర్చ్ చేసిన వాళ్లు ఏం చెప్పారంటే.. మనం మాట్లాడుతున్నప్పుడు, ఏదైనా పని చేస్తున్నప్పుడు, లేదా ఏదైనా ఆలోచిస్తున్నప్పుడు ఈ మూడు వ్యవహారాల్లో గనుక బల్లి పలికితే దానిని అపశకునంగానే భావించాలని’. తెలిపారు. అలాగే దీనిని తప్పు అనడానికి ఆస్కారం లేదు. ఎందుకంటే.. బ్రహ్మ దేవుడే స్వయంగా బల్లికి స్వతంత్రం ఇచ్చాడు పలకమని. కాబట్టి.. పై మూడు పనులు చేసేటప్పుడు బల్లి పలికితే అపశకునం అని స్వామీజీ తెలిపారు.