YS Vijayamma: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 77వ జయంతి వేడుకల్లో ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద ఆసక్తికర దృశ్యాలు కనిపించాయి. ఒకే వేదికపై ఇద్దరు పిల్లల పట్ల తల్లి విజయమ్మ చూపిన స్పందన ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తోంది. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు, కుమార్తె వైఎస్ షర్మిల ఘాట్ వద్ద నివాళులర్పించిన సమయంలో.. అక్కడ పక్కనే ఉన్న తల్లి విజయమ్మ వైపు కనీసం కన్నెత్తి కూడా చూడకుండా వెళ్ళిపోవడం గమనార్హం.
కానీ, కొడుకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విషయంలో మాత్రం సీన్ పూర్తిగా మారిపోయింది. వైసీపీ అధినేత జగన్ నివాళులర్పించేందుకు రావడం గమనించిన విజయమ్మ.. వెంటనే లేచి ఆప్యాయంగా కొడుకును దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లోనూ ఈ తేడా స్పష్టంగా కనిపించింది. ఒకే రోజు, ఒకే చోట కూతురితో అలా .. కొడుకుతో ఇలా ఎంతో ఆప్యాయంగా విజయమ్మ స్పందించిన తీరు ఇప్పుడు మనం చూద్దాం..