Revanth Reddy: తెలంగాణ రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం ముదిరింది. ఖమ్మం జిల్లా జగన్నాథపురం వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబంపై నిప్పులు చెరిగారు. రాబోయే ఎన్నికలను ‘కురుక్షేత్రం’తో పోల్చిన ఆయన.. అధర్మ కౌరవ వంశాన్ని (కేసీఆర్ కుటుంబాన్ని) తెలంగాణ గడ్డ నుంచి పాతాళానికి తొక్కుతామని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘పాపాల భైరవుడిని’ ఫామ్హౌస్లోనే బంధించామని, అతనికిక విముక్తి లేదంటూ ఘాటుగా విమర్శించారు.
భద్రాద్రి రాముడి సాక్షిగా రాబోయే ఎన్నికల్లో 117 స్థానాలు గెలుచుకుని, తెలంగాణలో రెండోసారి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని సీఎం ధీమా వ్యక్తం చేశారు. దొంగ సర్వేలను నమ్ముకునే కేసీఆర్ కుటుంబం, వారి భజనపరులు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలన్నారు. అలాగే, ముందస్తు ఊహాగానాలకు తెరదించుతూ.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2028లో జరగవని, 2029 మే-జూన్ నెలల్లోనే వస్తాయని రేవంత్ స్పష్టం చేశారు. అప్పటివరకు కాంగ్రెస్ కార్యకర్తలు విశ్రమించరని కేడర్లో జోష్ నింపారు.