Bengaluru ATM Van: బెంగళూరులో పట్ట పగలే జరిగిన ఏటీఎం వాహనంలో చోరీ కేసును ఛేదించారు పోలీసులు. ఈ కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మెుత్తం 7.11 కోట్లు నగరు చోరీ అవ్వగా.. అందులో 5.76 కోట్లు పోలీసులు రికవరీ చేశారు. అయితే నగదు తరలించే ప్రాంతంలో సీసీ కెమెరాలు లేవని దొంగలు ముందుగా గుర్తించారని తెలుస్తోంది. దొంగతనంలో మెుత్తం ఏడుగురు పాల్గొన్నట్లు గుర్తించారు. చోరీ కోసం ఉపయోగించిన వాహనాన్ని చిత్తూరు శివాలో గుర్తించగా.. ఆ వాహనానికి సంబంధించిన నెంబర్ ప్లేటు అనేక సార్లు మార్చినట్లు పోలీసులు తెలిపారు. దొంగలు ఈ చోరీకి మూడు నెలల ముందే ప్లాన్ సిద్దం చేసుకుని చోరీకి పాల్పడినట్టు తెలుస్తోంది.