Vennam Vijay Reddy: తెలుగు న్యూస్ మీడియా చరిత్రలో ‘బిగ్ టీవీ’ తన రీలాంచ్తో ఒక సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. నేటి తరానికి నిఖార్సయిన జర్నలిజం విలువలను చూపిస్తూ.. ఆధునిక మార్పులకు అనుగుణమైన ప్రజెంటేషన్తో ప్రసారాలను ప్రారంభించింది. సామాన్యుడి గొంతుకగా, నిస్సహాయులకు ఒక నిజమైన ప్రతినిధిగా ఈ ఛానెల్ కొత్తగా ప్రజల ముందుకు వచ్చిందని, ఇవాళ బిగ్ టీవీ గ్రూప్కు ఒక బిగ్ డే అని ఛైర్మన్ వెన్నం విజయ్రెడ్డి గారు తెలిపారు.
గత రెండు దశాబ్దాలుగా తెలుగు టీవీ మీడియా రంగంలో పెద్దగా ఎలాంటి మార్పులు రాకపోవడాన్ని గమనించి, మారుతున్న సొసైటీకి తగ్గట్లుగా గత ఆరు నెలలుగా తమ ఛానెల్లో అనేక మార్పులు చేసామన్నారు. కేవలం ఛానెల్ స్క్రీన్ లుక్ మాత్రమే కాకుండా, గ్రూప్లోని అన్ని విభాగాల ఉద్యోగులకు ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చామని వెల్లడించారు. ప్రజలు టీవీలకు దూరమవుతున్న ఈ రోజుల్లో, సాంకేతికతతో పాటు సోషల్ మీడియాలో వస్తున్న మార్పులను జోడించి, మారుమూల పల్లెటూరి వారికి సైతం చాలా సులభంగా అర్థమయ్యే రీతిలో వార్తలను అందించాలన్నదే తమ ముఖ్యమైన ఆలోచన అని ఆయన స్పష్టం చేశారు.