Local Elections: స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ.. టీడీపీ అధినేత చంద్రబాబు ఎమ్మెల్యేలకు స్పష్టమైన టార్గెట్లు పెట్టారు. స్థానిక ఎన్నికలను లైట్ తీసుకోవద్దని.. కూటమిగా సమిష్టిగా పనిచేసి విజయం సాధించాలని దిశానిర్దేశం చేశారు. ఇక్కడే అసలు రాజకీయ లెక్క మొదలవుతోంది. 2024లో వచ్చిన ఫలితాలను మించి స్థానిక ఎన్నికల్లో ఓటు శాతం పెంచుకోవాలని టార్గెట్ పెట్టడం వెనుక.. 2029కు ఇప్పటి నుంచే క్యాడర్, ఓటు బ్యాంక్ను పటిష్టం చేయాలన్న వ్యూహం కనిపిస్తోంది. ప్రతి నియోజకవర్గంలో 25 ప్రాధాన్యతా అంశాలను గుర్తించి అభివృద్ధిపై ఫోకస్ పెట్టాలని ఎమ్మెల్యేలకు సీఎం సూచించారు. అయితే కూటమిలో సీట్ల సర్దుబాటు, స్థానిక నేతల మధ్య విభేదాలు.. ఇవన్నీ అధిగమించి టార్గెట్లు చేరుకుంటారా? స్థానిక ఎన్నికల్లో వచ్చే ఫలితాలే.. ఎమ్మెల్యేల పనితీరుకు రిపోర్ట్ కార్డుగా మారబోతున్నాయా?