AP Congress: ఏపీలో బలహీనంగా ఉన్న కాంగ్రెస్పై హైకమాండ్ ఫోకస్ పెంచిందా? పీవీ మోహన్ను కొత్త ఇంఛార్జ్గా నియమించడం ఇప్పుడు ఇదే చర్చకు దారితీస్తోంది. పక్క రాష్ట్రం కర్ణాటకకు చెందిన మోహన్కు రాష్ట్ర బాధ్యతలు అప్పగించడంతో సంస్థాగతంగా పార్టీని పునర్నిర్మించే ప్రయత్నాలు మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయ్. మరోవైపు పీసీసీ చీఫ్గా వైఎస్ షర్మిలే కొనసాగుతున్నారు. అయితే ఏపీలో ప్రజా సమస్యలపై కాంగ్రెస్ పోరాటం ఆశించిన స్థాయిలో కనిపిస్తోందా? ఇటీవల సంచలనంగా మారిన ఇష్యూల విషయంలో ప్రభుత్వంపై బలమైన రాజకీయ ఒత్తిడి తీసుకురాగలిగిందా? వైసీపీ, టీడీపీ మధ్యే ప్రధాన పోరు సాగుతున్న ఏపీలో కాంగ్రెస్కు కొత్త ఇంఛార్జ్ ఏం చేయబోతున్నారు? క్యాడర్ను కదిలిస్తారా? ఇతర పార్టీల్లోని అసంతృప్త నేతలను ఆకర్షిస్తారా? లేక ముఖ్య నాయకత్వంలోనే కీలక మార్పులకు శ్రీకారం చుడతారా? 2029కు ముందు ఏపీ కాంగ్రెస్కు ఇది చివరి పెద్ద అవకాశం కాబోతోందా?