Shalibanda: హైదరాబాద్లోని శాలిబండ బ్లాస్టింగ్ కేసు విచారణ యూటర్న్ తీసుకుంది. గోమతి ఎలక్ట్రానిక్స్ పేలుడుపై పోలీసుల విచారణ.. కొత్త కోణంలో ప్రారంభమైంది. నిన్న బ్లాస్టింగ్ సీసీ ఫుటేజ్ను.. BIG TV ఎక్స్క్లూజివ్గా బయటపట్టింది. దాంతో కేవలం ఏసీలు, ఫ్రిడ్జ్ లే అయితే.. ఇంత పేలుడు జరిగే అవకాశం ఉందా అని స్థానికులు ప్రశ్నించిన వీడియోలను బిగ్టీవీ ప్రసారం చేసింది. దీంతో ఈ కేసును అనేక కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
గోమతిలో 12 సీసీ కెమెరాలు ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. దీంతో సీసీ కెమెరా డిజిటల్ వీడియో రికార్డర్ కోసం వెతుకుతున్నారు. బ్లాస్ట్లో షాపు యజమాని శివకుమార్ బన్సాల్ మృతిచెందారు. దీంతో డివిఆర్ కోసం శివకుమార్ భార్యను విచారిస్తున్నారు పోలీసులు.
DVR దొరికితే.. ప్రమాదం ఎలా జరిగిందో తెలుస్తుందన్నారు మొఘల్పుర సీఐ శ్రీనివాస్. మంటల్లో కాలిపోయిన వస్తువులను.. ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపామని.. వాటి నివేదిక వస్తే.. మరిన్ని వివరాలు తెలుస్తాయంటున్నారు.