Gadwal Incident :గద్వాల మహిళ హత్య కేసులో మిస్టరీ వీడింది. ఈనెల 3న గద్వాలలోని శేరెల్లి వీధిలో బలిజ లక్ష్మి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. చనిపోయిన లక్ష్మీ మెడలో 4 తులాల బంగారు నగలు.. కాళ్ల పట్టీలు మిస్ అయ్యాయి. అయితే కేసుపై స్పెషల్ ఫోకస్ పెట్టిన గద్వాల పోలీసులు.. మర్డర్కు గల కారణమైన నిందితుడిని పట్టుకున్నారు.గార్లపాడుకు చెందిన రాంరెడ్డి అనే వ్యక్తి ఈ హత్యచేసినట్టు పోలీసులు గుర్తించారు.డబ్బులు ఇవ్వకపోవడంతో మహిళను హత్యచేశాడని జిల్లా ఎస్పీ తెలిపారు.