Godavari Pollution: గోదావరి.. కోట్లాది మంది నమ్మకానికి, జీవనానికి ఆధారం. కానీ ఈ నదిలో పారిశ్రామిక వ్యర్థాలపై చాలాకాలంగా ఆరోపణలు ఉన్నాయ్. ఆంధ్రా పేపర్ లిమిటెడ్పై వచ్చిన ఫిర్యాదులతో NGTలోనూ కాలుష్య నియంత్రణ, వ్యర్థాల నిర్వహణపై ప్రశ్నలు వచ్చాయ్. తాజాగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మరింత ఘాటుగా రియాక్ట్ అయ్యారు. రాజమహేంద్రవరం కాలుష్యంలో దాదాపు సగం ఆంధ్రా పేపర్స్ నుంచే వస్తున్నా చర్యలు లేవన్న ప్రశ్నల్ని ప్రస్తావిస్తున్నారు. అంతేకాదు.. 2016 నుంచి స్థానిక సంస్థలకు పన్నులు చెల్లించలేదని, 21.34 కోట్ల వరకు బకాయిలున్నాయన్న విషయం తెరపైకి వచ్చింది.
రాజమండ్రి సిటీలో రోజుకు 70 మిలియన్ లీటర్ల ద్రవ్య వ్యర్ధాలు విడుదల అవుతుంటే అందులో సగానికి సగం 35 మిలియన్ లీటర్లు ఆంధ్రా పేపర్ మిల్స్ నుంచే వస్తున్నాయని కాలుష్య మంత్రిత్వ శాఖ చెబుతోంది. వచ్చే ఏడాది 2027 జూలైలో జరిగే గోదావరి పుష్కరాల నాటికి నదిని పవిత్రంగా కాలుష్య రహితంగా చేస్తామన్న ప్రభుత్వ ఆశయాలకు ఈ సిచ్యువేషన్ నెగెటివ్ గా మారుతుండడంతో పవన్ సీరియస్ యాక్షన్ కు రెడీ అవుతున్నారంటున్నారు. మరి ఇప్పటికైనా గోదావరి కాలుష్యానికి చెక్ పడుతుందా? పవన్ స్వయంగా హెచ్చరించినా ఈ కంపెనీ ఎందుకు వినడం లేదు? గేమ్ ఎక్కడ నడుస్తోంది?