Warangal: హనుమకొండ కలెక్టరేట్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విద్యార్థి సంఘాల దాడి నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా బంద్ పాటిస్తున్నాయి ప్రైవేట్ విద్యాసంస్థలు. ఈ సందర్భంగా ప్రయివేట్ స్కూల్స్, కాలేజీ యాజమాన్యాలు, ఉపాధ్యాయులు ఆందోళన చేస్తున్నారు. భారీ ర్యాలీగా తరలివచ్చి కలెక్టరేట్ ముందు నిరసన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థి సంఘాల నుండి తమకు భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. స్మైల్ డీ.జీ స్కూల్ యాజమాన్యంపై దాడికి పాల్పడిన విద్యార్థి సంఘాల నాయకులపై కఠిన చర్యలు తీసుకోవాలని నినాదాలు చేస్తున్నారు.