Palnadu: పల్నాడు జిల్లా , కారంపూడి తహశీల్దార్ కార్యాలయం ముందు మృతదేహంతో సహా ఆందోళన నిర్వహించారు గ్రామస్తులు. కారంపూడి గ్రామానికి చెందిన బత్తుల ముసలయ్య పొలం ఆక్రమణకు గురయిందని చెప్పినా.. రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోవడంతో ముసలయ్య మనోవేదన కొద్దీ గుండెపోటుతో మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. పొలం విషయంలో అధికారులు తగిన న్యాయం చేయకపోవడం వల్లేనే మృతి చెందాడని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలని తహశీల్దార్ కార్యాలయం ముందు శవాన్ని ఉంచి మరీ నిరసన వ్యక్తం చేస్తున్నారు.