Keesara House Owner: కీసర మండలం చీర్యాల్లో సదానందం అనే వ్యక్తి 8వ తేదీన తన కొత్త ఇంట్లోకి గృహప్రవేశం చేశాడు. 9వ తేదీన సదానందం ఇంటికి హిజ్రాలు వెళ్లారు. లక్ష రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంత ఇచ్చుకోలేనని సదానందం రిక్వెస్ట్ చేసినప్పటికి వినిపించుకోకుండా అక్కడే ఆందోళన చేశారు. ఆ కోపంలో హిజ్రాలపై సదానందం దాడికి యత్నించాడు. అలాఅక్కడి నుంచి వెళ్లిన హిజ్రాలు.. ఈ సారి మూడు ఆటోల్లో ఫైటింగ్ కు వచ్చేశారు. సదానందాన్ని ఒంటరిగా దొరికించుకొని చితకబాదారు. కర్రలతో దాడి చేశారు. దాడిలో సదానందం తలకు తీవ్ర గాయమైంది. బాధితుడు కీసర పోలీసులకు ఫిర్యాదు చేశాడు.