Tiger Poaching: నల్లమల పరిధి మార్కాపురం జిల్లా రాచర్ల మండలంలో పులి కళేబరం కేసులో మిస్టరీ వీడింది. వేటగాళ్లు నాటు తుపాకీతో పులిని చంపి గోళ్లను ఎత్తుకెళ్లారని తేల్చారు ఫారెస్ట్ అధికారులు. ఈ కేసులో ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అలాగే పులి గోర్లు, ఎముకలు సహా పులిని వేటాడేందుకు వాడిన నాటు తుపాకీ, గొడ్డలిని స్వాధీనం చేసుకున్నారు. ౩ వారాల కిందట పులిని చంపిన నిందితులు గోళ్లను, ఎముకల్నిసేకరించాక, కళేబరాన్ని అడవిలో పడేశారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశాలతో ఈ కేసును ఛాలెంజింగ్ తీసుకున్న ఫారెస్ట్ అధికారులు మిస్టరీని చేధించడం సహా నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఆ ఏడుగురు నిందితులు కూడా స్థానిక చెంచు గూడెంకు చెందిన వాళ్లని గుర్తించారు. గోళ్లను ఎత్తుకెళ్లిన నిందితులు వాటిలో కొన్నింటిని విక్రయించినట్టు దర్యాప్తులో తేలింది. ఎవరికి ఎంతకు విక్రయించారు? వీళ్ల వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారని వైడ్ యాంగిల్లో ఎంక్వయిరీని స్పీడప్ చేశారు.