Bus Accident: ఎన్టీఆర్ జిల్లా నందిగామ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి విజయనగరం వైపు వెళ్లుతున్న కావేరి ట్రావెల్స్ బస్సు, లారీని ఓవర్టేక్ చేసే ప్రయత్నంలో లారీని ఢీ కొట్టింది. దీంతో బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే విజయవాడకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 35 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. గాయపడిన వారు విజయనగరం, శ్రీకాకుళం జిల్లా వాసులుగా గుర్తించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.