Jeedimetla: మేడ్చల్ జీడిమెట్ల పీఎస్ పరిధిలోని షాపూర్నగర్ పూర్ణిమా స్కూల్లో దారుణం జరిగింది. నర్సరీ చదువుతోన్న చిన్నారిపై స్కూల్ ఆయా పాశవికమైన దాడి చేసింది. దాడిని స్కూల్ పక్కనుండే మేడపై నుంచి వీడియో రికార్డు చేశాడో యువకుడు. నిన్న సాయంత్రం నుంచి బాధిత చిన్నారి ఆహారం తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు తల్లిదండ్రులు. హుటాహుటిన పాపను ఆస్పత్రికి తరలించారు. చిన్నారిపై పాశవిక దాడి జరిగినట్టు గుర్తించారు వైద్యులు. వీడియోలను చూపించి నిందితురాలిపై ఫిర్యాదు చేశారు చిన్నారి తల్లిదండ్రులు. చిన్నారిపై దాడి చేసిన ఆయాను స్టేషన్ కి పిలిపించారు పోలీసులు.