తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ రెండో రోజు ఇవాళ కీలక ఘట్టాలకు వేదిక కానుంది. సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రైజింగ్–2047 విజన్ డాక్యుమెంట్ను అధికారికంగా విడుదల చేయనున్నారు. ఈ పత్రంలో వచ్చే రెండున్నర దశాబ్దాల పాటు రాష్ట్ర అభివృద్ధి దిశ, రంగావారీ లక్ష్యాలు, వృద్ధి వ్యూహాలు వివరంగా ఉండనున్నాయని తెలుస్తోంది. సమ్మిట్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఐటీ, పరిశ్రమలు, వ్యవసాయం, ఇన్నోవేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంటి అంశాలపై ప్యానల్ చర్చలు కొనసాగుతున్నాయి. దేశీయ–అంతర్జాతీయ నిపుణులు, పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు ఈ చర్చల్లో పాల్గొంటున్నారు. ఇప్పటికే పలు కంపెనీలు పెట్టుబడులకు ఆసక్తి చూపగా, ఇవాళ్టి సెషన్లలో మరిన్ని ఒప్పందాలు కుదిరే అవకాశం ఉందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఇదిగో వీడియో..